|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

సాయి పల్లవి అభిమానులకు బిగ్ షాక్: ఆమీర్ ఖాన్ నిర్ణయంతో సినిమా వాయిదా!

Published: 02-01-2026, 1:30 AM
సాయి పల్లవి అభిమానులకు బిగ్ షాక్: ఆమీర్ ఖాన్ నిర్ణయంతో సినిమా వాయిదా!
  • సాయి పల్లవి బాలీవుడ్ లో జునైద్ ఖాన్ సరసన ‘మేరే రహో’ సినిమాలో నటించింది.
  • ఆమీర్ ఖాన్ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమా రిలీజ్ పలుమార్లు వాయిదా పడింది.
  • తాజాగా సినిమాను 2026 సమ్మర్ కి మార్చడంతో సాయి పల్లవి అభిమానులు నిరాశ చెందారు.
  • ఇతర సినిమాల షెడ్యూల్స్, బిజినెస్ కారణాల వల్లే వాయిదా అని బాలీవుడ్ వర్గాల సమాచారం.

సౌత్ లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సాయి పల్లవి బాలీవుడ్ ఎంట్రీ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఆమీర్ ఖాన్ నిర్మించిన ఆమె బాలీవుడ్ తొలి చిత్రం ‘మేరే రహో’ రిలీజ్ మళ్ళీ వాయిదా పడటంతో అభిమానులు నిరాశకు గురయ్యారు. ఎందుకు ఈ ఆలస్యం?

సాయి పల్లవి బాలీవుడ్ ఎంట్రీ ఎప్పుడు?

ఇన్నాళ్లు సౌత్ లో సినిమాలు చేసిన సాయి పల్లవి ఇప్పుడు బాలీవుడ్ లో సినిమాలు చేస్తుంది.(Sai Pallavi)

Sai Pallavi : మంచి మంచి సినిమాలతో సాయి పల్లవి సౌత్ లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చుకుంది. చివరగా సాయి పల్లవి తండేల్ సినిమాతో గత సంవత్సరం ప్రేక్షకులను మెప్పించింది. ఇన్నాళ్లు సౌత్ లో సినిమాలు చేసిన సాయి పల్లవి ఇప్పుడు బాలీవుడ్ లో సినిమాలు చేస్తుంది.(Sai Pallavi)

సాయి పల్లవి బాలీవుడ్ లో రణబీర్ కపూర్ సరసన రామాయణ సినిమాలో సీత గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆ సినిమా మొదటి పార్ట్ 2026 దీపావళికి రిలీజ్ కానుంది. రామాయణ తో పాటు సాయి పల్లవి బాలీవుడ్ స్టార్ హీరో ఆమీర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్ తో ఒక సినిమా చేసింది.

ఆమీర్ ఖాన్ నిర్ణయం వెనుక కారణాలు

సాయి పల్లవి, జునైద్ ఖాన్ జంటగా నటించిన ‘మేరే రహో’ సినిమా ఈ సంవత్సరమే రిలీజ్ అవ్వాలి. ఇప్పటికే ఈ సినిమా పలుమార్లు వాయిదా పడింది. ఈ సినిమాకు ఆమీర్ ఖాన్ నిర్మాత. అయితే ఇటీవల డిసెంబర్ లో కూడా రిలీజ్ చేద్దామనుకున్నా అమీర్ ఖాన్ మళ్ళీ వాయిదా వేసి 2026 సమ్మర్ కి మార్చారు.

దీంతో సాయి పల్లవి బాలీవుడ్ ఎంట్రీ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆమె ఫ్యాన్స్ ఇంకెంత కాలం వెయిట్ చేయాలి అని అడుగుతున్నారు. అమీర్ ఖాన్ ఈ సినిమా రిలీజ్ ని ఎందుకు ఆపుతున్నారు అంటూ ప్రశ్నిస్తున్నారు. అయితే బాలీవుడ్ లో వేరే సినిమాలు ఉండటం, ఈ సినిమా బిజినెస్ ఇంకా పూర్తిగా అవ్వకపోవడం వల్లే అమీర్ ఖాన్ ఈ సినిమా రిలీజ్ ని వాయిదా వేస్తున్నాడని బాలీవుడ్ సమాచారం.

‘మేరే రహో’ రిలీజ్ తేదీ మార్పుపై ఉత్కంఠ

ఆమీర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్ ఇప్పటికే లవ్ యాపా, మహారాజ సినిమాలతో హీరోగా మెప్పించాడు. మరి 2026 సమ్మర్ కి అయినా సాయి పల్లవి బాలీవుడ్ మొదటి సినిమా మేరే రహో రిలీజ్ అవుతుందా చూడాలి.

మొత్తానికి, సాయి పల్లవి బాలీవుడ్ ఎంట్రీ ‘మేరే రహో’ సినిమా రిలీజ్ 2026 సమ్మర్ వరకు వాయిదా పడింది. ఆమీర్ ఖాన్ నిర్ణయంతో అభిమానుల నిరీక్షణ మరింత పెరిగింది. ఈ సినిమా ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తుందో వేచి చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.