|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఇలా కూడా చేస్తారా! – క్లైమాక్స్ లేకుండానే సీరియ‌ల్‌కు శుభం కార్డు – ఫ్యాన్స్ హ‌ర్ట్‌

Published: 10-05-2025, 2:45 PM
ఇలా కూడా చేస్తారా! - క్లైమాక్స్ లేకుండానే సీరియ‌ల్‌కు శుభం కార్డు - ఫ్యాన్స్ హ‌ర్ట్‌

జీ తెలుగులో ప్రసారమైన ‘సీతే రాముడి కట్నం’ సీరియల్‌కు 502 ఎపిసోడ్ల తర్వాత శుభం కార్డు పలికారు. కానీ, క్లైమాక్స్ లేకుండా సీరియల్ ముగియడంతో అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జీ తెలుగును ట్రోల్ చేస్తున్నారు.

Key Points

1

సీతే రాముడి కట్నం సీరియల్‌కు అకస్మాత్తుగా శుభం కార్డు.

2

క్లైమాక్స్ లేకుండా సీరియల్ ముగియడంతో అభిమానులు నిరాశ చెందారు.

4

సోమవారం నుంచి ఘరానా మొగుడు సీరియల్ ప్రారంభం.

అకస్మాత్తుగా ముగిసిన సీరియల్

జీ తెలుగులో టెలికాస్ట్ అవుతోన్నసీతే రాముడి క‌ట్నం సీరియ‌ల్‌కు మేక‌ర్స్ శ‌నివారం శుభం కార్డు వేశారు. స‌రైన ఎండింగ్ అన్న‌ది లేకుండా అర్థాంత‌రంగా ఈ సీరియ‌ల్‌ను ముగించేశారు. 502 ఎపిసోడ్స్‌తో సీతే రాముడి క‌ట్నం సీరియ‌ల్ ఎండ‌య్యింది.

ప్రాప‌ర్ క్లైమాక్స్ అంటూ లేకుండా సీతేరాముడి క‌ట్నం సీరియ‌ల్‌ను ముగించ‌డం ప‌ట్ల బుల్లితెర ఫ్యాన్స్ హార్ట‌వుతున్నారు. జీ తెలుగును ట్రోల్ చేస్తోన్నారు. ఇది ఎక్స్‌పెక్ట్ చేయ‌లేద‌ని, ఇలా కూడా సీరియ‌ల్‌ను ముగిస్తారా అంటూ కామెంట్స్ చేస్తోన్నారు. మ‌రికొంత నెటిజ‌న్లు మాత్రం సీరియ‌ల్ చాలా బోరింగ్‌గా సాగుతుంద‌ని, ఎండ్ చేసి మంచి ప‌ని చేశార‌ని అంటున్నారు. సీతే రాముడి క‌ట్నం సీరియ‌ల్ స్థానంలో సోమ‌వారం నుంచి ఘ‌రానా మొగుడు సీరియ‌ల్ టెలికాస్ట్ కాబోతోంది.

అభిమానుల నిరాశ

సీతేరాముడి క‌ట్నం సీరియ‌ల్‌లో స‌మీర్, వైష్ణ‌వి లీడ్ రోల్స్‌లో క‌నిపించారు. మంజుల ప‌రిటాల‌, వాసు ఇంటూరి కీల‌క పాత్ర‌లు పోషించారు. త‌మిళ సీరియ‌ల్ సీతారామ‌న్‌కు రీమేక్‌గా 2023 అక్టోబ‌ర్‌లో సీతే రాముడి క‌ట్నం లాంఛ్ అయ్యింది. ఆరంభంలో జీ తెలుగు లో టాప్ సీరియ‌ల్స్‌లో ఒక‌టిగా నిలిచింది. క‌థ‌లో డ్రామా తో పాటు లీడ్ రోల్ కెమిస్ట్రీ స‌రిగ్గా పండ‌క‌పోవ‌డంతో సీరియ‌ల్ క్రేజ్ త‌గ్గుతూ వ‌చ్చింది. లేటెస్ట్ టీఆర్‌పీ లో సీతేరాముడి క‌ట్నం 2.86 రేటింగ్ మాత్ర‌మే ద‌క్కించుకున్న‌ది. అర్బ‌న్ ఏరియాలో మాత్రం 3.18తో ప‌ర్వాలేద‌నిపించింది.

ఈ సీరియ‌ల్‌తోనే స‌మీర్‌, వైష్ణ‌వి టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇందులో సీత‌గా వైష్ణ‌వి, రామ్ పాత్ర‌లో స‌మీర్ క‌నిపించారు. హీరో తండ్రిగా మ‌హాల‌క్ష్మి పాత్ర‌లో మంజుల ప‌రిటాల న‌టించింది.

కొత్త సీరియల్ ప్రారంభం

స్వ‌త‌హాగా క‌న్న‌డ న‌టి అయిన వైష్ణ‌వి.. తెలుగుతో పాటు మ‌ల‌యాళ భాష‌ల్లో ప‌లు సీరియ‌ల్స్ చేసింది. క‌న్న‌డంలో మిథున రాశి సీరియ‌ల్‌ లో వైష్ణ‌వి ఫేమ‌స్ అయ్యింది.

సీతే రాముడి క‌ట్నం స్థానంలో కొత్త‌గా ప్రారంభం కానున్న ఘ‌రానా మొగుడు సీరియ‌ల్‌లో ప‌వ‌న్ సాయి, అక్షిత స‌త్య‌నారాయ‌ణ లీడ్ రోల్స్‌లో న‌టిస్తోన్నారు. నెగెటివ్ రోల్‌లో భావ‌న క‌నిపించ‌బోతున్న‌ది.

చివరికి, సీతే రాముడి కట్నం సీరియల్ యొక్క అకస్మాత్తుగా ముగింపు అభిమానులను నిరాశపరిచింది. కానీ, ఘరానా మొగుడు సీరియల్ ప్రారంభం వారికి కొంత ఉపశమనం కలిగించవచ్చు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.