
భాద్రపద శుక్ల ఏకాదశిని పరివర్తిని ఏకాదశి అంటారు. సెప్టెంబర్ 3న ఈ ఏకాదశి వస్తుంది. ఈ రోజు ఉపవాసం, పూజలు చేయడం ద్వారా విష్ణుమూర్తి అనుగ్రహాన్ని పొందవచ్చు.
Key Points
సెప్టెంబర్ 3న పరివర్తిని ఏకాదశి ఉపవాసం.
లక్ష్మీనారాయణులను భక్తి శ్రద్ధలతో ఆరాధించండి.
విష్ణు ఆలయాలను సందర్శించండి.
పరివర్తిని ఏకాదశి: ప్రాముఖ్యత
భాద్రపద మాసంలోని శుక్ల పక్ష ఏకాదశిని పరివర్తని ఏకాదశి అని పిలుస్తారు. ఈ ఏడాది సెప్టెంబర్ 03న ఉదయం 04:53 గంటలకు ప్రారంభమై మరుసటి రోజు సెప్టెంబర్ 04న ఉదయం 04:21 గంటలకు ముగుస్తుంది. అందుకే సెప్టెంబర్ 3న జరుపుకోవాలి. ఈ ఉపవాసం గురించి శ్రీకృష్ణుడే స్వయంగా యుధిష్ఠిరుడికి చెప్పాడు. ఈ ఏకాదశి నాడు ఉపవాసం ఉండి ఆరాధించడం వల్ల బ్రహ్మ, విష్ణువుతో సహా మూడు లోకాలను పూజించిన ఫలితం లభిస్తుంది. దీని ప్రాముఖ్యత ఏమిటి?, ఆ రోజు ఏం చెయ్యాలి మొదలైన విషయాలను తెలుసుకుందాం.
ప్రతీ ఏకాదశిలానే పరివర్తిని ఏకాదశి నాడు కూడా ఉపవాసం ఉంటే మంచిది. సూర్యోదయం సమయంలో నిద్ర లేచి తలస్నానం చేసి పూజ మందిరాన్ని శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత లక్ష్మీనారాయణులను భక్తి శ్రద్ధలతో ఆరాధించాలి. చక్కెర పొంగలి, పులగం వంటి ప్రసాదాలను నైవేద్యంగా పెట్టాలి. చేమంతులతో నారాయణుని పూజించడం వలన సకల సంతోషాలు కలుగుతాయి.
ఏకాదశి నాటి పూజా విధానం
ఈ ఏకాదశి నాడు పూజ చేసి ఉపవాసం ఉంటే మంచిది. వీలైతే విష్ణు ఆలయాలను కూడా సందర్శించవచ్చు. సాయంత్రం మళ్ళీ శుచిగా స్నానం చేసి దీపారాధన చేసి, విష్ణు సహస్రనామ పారాయణం చేస్తే మంచిది. ఏకాదశి నాడు విష్ణు సహస్రనామ పారాయణ చేయడం వలన కోటి రెట్ల ఎక్కువ పుణ్యం వస్తుంది.
ఆగిపోయిన పనుల పూర్తికి సూచనలు
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
పరివర్తిని ఏకాదశి ఉపవాసం, పూజలతో సకల శుభాలను పొందవచ్చు. భక్తి శ్రద్ధలతో విష్ణుమూర్తిని ఆరాధించి, ఆగిపోయిన పనులు పూర్తి చేసుకోండి.


