
📌 Key Points
- షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ చిన్నతనంలో షనయ, సుహానాలను దుప్పటిలో చుట్టి మెట్లపై నుంచి తోసేశాడు.
- యూట్యూబ్ ఇంటర్వ్యూలో షనయ కపూర్ ఈ విషయాన్ని వెల్లడించడంతో ఒక్కసారిగా వైరల్ అయింది.
- ఆర్యన్ ఖాన్ డిజైన్ చేసిన ‘రోలర్ కోస్టర్’ రైడ్గా దాన్ని షనయ అభివర్ణించింది.
- ప్రస్తుతం షనయ కపూర్ బాలీవుడ్లో తన నటనతో నిలదొక్కుకునే ప్రయత్నాల్లో ఉంది.
బాలీవుడ్ స్టార్ కిడ్స్ గురించి ఒక షాకింగ్ న్యూస్ వైరల్ అవుతోంది. షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ చిన్నతనంలో తన చెల్లి సుహానాను, షనయ కపూర్ను మెట్లపై నుంచి తోసేసిన సంఘటన గురించి షనయ స్వయంగా వెల్లడించింది.
చిన్ననాటి జ్ఞాపకాలు నెమరువేసుకున్న షనయ కపూర్
స్టార్ కిడ్ షనయ కపూర్ తన చిన్ననాటి భయంకరమైన, సరదా జ్ఞాపకాన్ని తాజాగా పంచుకున్నారు. షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ తమను దుప్పటిలో చుట్టి మెట్ల మీద నుంచి కిందకు తోసేసాడన్న షాకింగ్ విషయాన్ని షనయ కపూర్ గుర్తుచేసుకున్నారు. దీంతో షనయ కపూర్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
బాలీవుడ్ స్టార్ కిడ్స్ మధ్య మంచి స్నేహం ఉంటుంది. అలాగే, బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ పిల్లలు ఆర్యన్ ఖాన్, సుహానా ఖాన్, సీనియర్ నటుడు సంజయ్ కపూర్ కుమార్తె షనయ కపూర్ చిన్నప్పటి నుంచి ప్రాణ స్నేహితులు. తాజాగా ఒక యూట్యూబ్ ఇంటర్వ్యూలో పాల్గొన్న షనయ కపూర్ చిన్నతనంలో ఆర్యన్ ఖాన్ చేసిన ఒక వింత ప్రయోగం వల్ల తాను, సుహానా ఖాన్ ఎంతలా భయపడ్డారో వివరించారు.
ఆర్యన్ ఖాన్ చేసిన వింత ప్రయోగం
ఆ వాయిస్ నోట్లో సుహానా .. “మనమిద్దరం బ్లాంకెట్లో చుట్టబడి మెట్ల మీద నుంచి దొర్లి కిందకు పడిపోయిన రోజు గుర్తుందా? ఎవరో మేధావి (ఆర్యన్) అది గొప్ప ఐడియా అని చెప్పి మనల్ని నెట్టేసారు” అంటూ నవ్వుతూ గుర్తు చేశారు.
దీనిపై షనయా స్పందిస్తూ అసలు విషయం చెప్పారు. “నిజానికి అది ఆర్యన్ ఖాన్ డిజైన్ చేసిన ‘రోలర్ కోస్టర్’ రైడ్. మేమిద్దరం చిన్నవాళ్లం కావడంతో ఆర్యన్ ఏం చెప్పినా వినేవాళ్లం. ‘మీ జీవితంలో ఎక్కడా చూడని రోలర్ కోస్టర్ రైడ్ చూపిస్తా.. హెల్మెట్ పెట్టుకోండి, మిమ్మల్ని దుప్పటిలో చుట్టి జిప్ వేసి మెట్ల మీద నుంచి నెడతాను, గాలిలో తేలుతున్నట్లు ఉంటుంది’ అని ఆర్యన్ మమ్మల్ని నమ్మించాడు” అని షనయా కపూర్ వివరించారు.
షనయ కపూర్ బాలీవుడ్ ఎంట్రీ
అనన్య పాండే , నవ్య నవేలి కూడా తమ కుటుంబ సభ్యులతో సమానమని షనయ కపూర్ పేర్కొన్నారు. అలా షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ తన చెల్లి సుహానాను, హీరోయిన్ షనయాను చిన్నప్పుడు మెట్ల పైనుంచి తోసేసి భయపడెలా చేశాడు.
ఇందులో షనాయా కపూర్ ‘అవని’ అలియాస్ మిస్ వానిటీగా నటించి విమర్శకుల ప్రశంసలు అందుకుంటున్నారు. ఈ సినిమాకు కలెక్షన్స్తోపాటు ప్రశంసలు దక్కుతున్నాయి. ప్రస్తుతం షనాయా కపూర్ తన నటనతో బాలీవుడ్లో నిలదొక్కుకునే ప్రయత్నంలో ఉన్నారు.
షనయ కపూర్ చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. షారుఖ్ ఖాన్ ఫ్యామిలీకి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.


