
పరువు హత్యలను సమర్థించినందుకు యూట్యూబర్ దివాకర్ పై నటి షకీలా చెన్నై పోలీసు కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. జాతి వివక్షతో కూడిన వ్యాఖ్యలు కూడా ఆమె ఫిర్యాదులో ఉన్నాయి.
Key Points
షకీలా చెన్నై పోలీసు కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు
యూట్యూబర్ దివాకర్ పరువు హత్యలను సమర్థించడం
జాతి వివక్షతో కూడిన వ్యాఖ్యలు
దివాకర్ పై చర్యలు తీసుకోవాలని షకీలా డిమాండ్
షకీలా చేసిన ఫిర్యాదు వివరాలు
పరువు హత్యలను సమర్థిస్తున్న యూట్యూబర్ దివాకర్ పై తగిన చర్యలు తీసుకోవాలంటూ నటి షకీలా మంగళవారం ఉదయం చెన్నై పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. అందులో గత నెల 27వ తేదీన తూత్తుకుడి జిల్లాకు చెందిన ఇంజనీర్ కవీన్ కుమార్ అనే వ్యక్తి పై తిరునెల్వెల్లి జిల్లాకు చెందిన సుజిత్ అనే వ్యక్తి పరువ హత్యకు పాల్పడ్డారని, పలు పోరాటాల అనంతరం హంతకులను పోలీసులు అరెస్ట్ చేసి న్యాయస్థానంలో నిలబెట్టారని, అయితే ఆ హత్యను సమర్థించే విధంగా యూట్యూబర్ దివాకర్ ఒక భేటీలో మాట్లాడారని ఆమె ఆరోపించారు.
అందులో హత్యకు పాల్పడిన వ్యక్తి తమ జాతికి చెందిన వాడిగా పేర్కొన్నారని అదేవిధంగా ఇటీవల మరో భేటీలో నటుడు జీపీ ముత్తు గురించి ప్రస్తావిస్తూ కించపరిచే వ్యాఖ్యలు చేశారని పేర్కొన్నారు. ఇలా జాతి వివక్షకు పాల్పడుతున్న యూట్యూబర్ దివాకర్పై తగిన చర్యలు తీసుకోవాలంటూ నటి షకీలా ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.
దివాకర్ యొక్క వివాదాస్పద వ్యాఖ్యలు
పోలీసుల చర్య ఏమిటి?
యూట్యూబర్ దివాకర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర విమర్శలకు గురయ్యాయి. షకీలా ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు చేసి తగిన చర్యలు తీసుకోవాల్సి ఉంది.

