
బాలీవుడ్ నటి షానయా కపూర్ తన తాజా చిత్రం ‘ఆంఖోంకి గుస్తాఖియాన్’ విడుదల తేదీని ప్రకటించింది. విక్రాంత్ మస్సేతో కలిసి నటించిన ఈ చిత్రంపై అభిమానులు, నెటిజన్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Key Points
షానయా కపూర్ తన తాజా చిత్రం ‘ఆంఖోంకి గుస్తాఖియాన్’ విడుదలకు సిద్ధమవుతోంది.
ఈ చిత్రంలో విక్రాంత్ మస్సేతో కలిసి నటించింది.
జూలై 11న థియేటర్లలో విడుదల కానుంది.
షానయా ఇన్స్టాగ్రామ్లో వీడియోను షేర్ చేసి ప్రేక్షకులకు శుభవార్త అందించింది.
షానయా కపూర్ యొక్క కొత్త చిత్రం
బాలీవుడ్ యంగ్ హీరోయిన్ షానయా కపూర్(Shanaya Kapoor) చాలాకాలంగా ఇండస్ట్రీలో రాణిస్తోంది. నటుడు అనీల్ కపూర్ సోదరుడు సంజ్య(Sanjay Kapoor) కుమార్తె షానయా కపూర్. ‘స్క్రూ డీలా’ సినిమాతో హీరోయిన్గా పరిచయం అయింది. ఆ తర్వాత ‘బే దడక్’ నటించి మెప్పించింది. అంతేకాకుండా మోహన్లాల్(Mohanlal) హీరోగా నటించిన ‘వృషభ’ చిత్రంలోనూ నటించింది. అయితే ఈ మూవీ షూటింగ్ జరుపుకున్నప్పటికీ పలు కారణాల వల్ల వాయిదా పడినట్లు తెలుస్తోంది. అక్టోబర్ 16న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే.. తాజాగా, షానయా కపూర్ మరో బంపర్ ఆఫర్ అందుకుంది.12th ఫెయిల్, సబర్మతీ రిపోర్ట్ వంటి సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న విక్రాంత్ మస్సే(Vikrant Massey) సరసన నటించనుంది.
‘ఆంఖోంకి గుస్తాఖియాన్’ విడుదల తేదీ
‘ఆంఖోంకి గుస్తాఖియాన్’ పేరుతో రాబోతున్న ఈ చిత్రాన్ని సంతోష్ సింగ్(Santosh Singh) తెరకెక్కిస్తున్నారు. అయితే ఇందులో విక్రాంత్, షానయా జంటగా నటించబోతున్నారు. దీనిని జీ స్టూడియోస్, మిని ఫిల్మ్స్ ప్రజెంట్స్ బ్యానర్పై ఉమేష్ భన్సాలీ, వరుణ్, విశాల్ మిశ్రా నిర్మిస్తున్నారు. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమా ‘ఆంఖోంకి గుస్తాఖియాన్’ విడుదలకు సిద్ధం అయింది. ఈ విషయాన్ని తెలుపుతూ షానయా ఇన్స్టాగ్రామ్ ద్వారా ఓ వీడియోను షేర్ చేసింది. ఈ మూవీ జూలై 11న థియేటర్స్లోకి రాబోతున్నట్లు తెలుపుతూ ‘‘ఈ వర్షాకాలంలో పడటమే కాదు, ప్రేమను అనుభూతి చెందండి’’ అనే క్యాప్షన్ జత చేసింది. కంగ్రాట్స్ డార్లింగ్ మా నీరిక్షణ ఇప్పటికే ముగిసింది అని కామెంట్లు చేస్తున్నారు.
నెటిజన్ల స్పందన
A post shared by Zee Studios (@zeestudiosofficial)
షానయా కపూర్ ‘ఆంఖోంకి గుస్తాఖియాన్’ చిత్రం జూలై 11న విడుదల కానున్న విషయం తెలిసి ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నెటిజన్ల అభినందనలు ఆమెకు మరింత ధైర్యాన్ని ఇచ్చాయి.


