
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలుగు చిత్ర పరిశ్రమపై కీలక వ్యాఖ్యలు చేశారు. టికెట్ల ధరల పెంపుపై నిర్మాతలకు సంచలన షరతు విధించారు. టికెట్ల రేట్లు పెంచుకుంటే 20% వాటాను సినీ కార్మికులకు ఇవ్వాలని స్పష్టం చేశారు. సినీ కార్మికుల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని హామీ ఇచ్చారు.
Key Points
CM రేవంత్ రెడ్డిని సినీ కార్మికులు సన్మానించారు, ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.
సినిమా టికెట్ల ధరలు పెంచితే అందులో 20% వాటా సినీ కార్మికులకు ఇవ్వాలని షరతు విధించారు.
సినీ కార్మికుల పిల్లల కోసం ప్రత్యేక స్కూల్స్, ఫ్యూచర్ సిటీలో స్థలాలు కేటాయిస్తామని హామీ.
ప్రపంచ సినిమాకు హైదరాబాద్ కేరాఫ్ కావాలని, హాలీవుడ్ను ఇక్కడికి తీసుకొస్తామని భరోసా ఇచ్చారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
తెలుగు చిత్ర పరిశ్రమ(Telugu Film Industry)పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళశారం సాయంత్రం హైదరాబాద్లోని యూసుఫ్గూడ పోలీస్ గ్రౌండ్స్లో సీఎం రేవంత్ రెడ్డికి సినీ కార్మికులు(Film Workers) సన్మానం చేశారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఒకప్పుడు తెలుగుచిత్ర పరిశ్రమ అంటే.. మదరాసి అని పిలిచేవారని గుర్తుచేశారు. తెలుగు చిత్ర పరిశ్రమను హైదరాబాద్కు తరలించాలని ఆనాటి ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి(Marri Chenna Reddy) ఎంతో కృషి చేశారని అన్నారు. ఎన్టీఆర్(NTR), ఏఎన్ఆర్(ANR) సాయంతో హైదరాబాద్కు తీసుకొచ్చారని తెలిపారు. ఇవాళ తెలుగు సినిమాలకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు వస్తోంది. ఎన్నో ప్రతిష్టాత్మక అవార్డులు వరిస్తున్నాయని అన్నారు. చిత్రపురి కాలనీకి ప్రపంచ స్థాయి గుర్తింపు రావడానికి ఆనాటి నాయకులు చేసిన కృషిని ఎవరూ మర్చిపోకూడదని చెప్పారు. చిత్రపరిశ్రమను ప్రోత్సహించాలని ఆనాడు తక్కువ ధరకే భూములు ఇచ్చారని తెలిపారు. అంతేగాకుండా.. కళాకారులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో 1964లో నంది అవార్డుల కార్యక్రమాన్ని ప్రారంభించారని గుర్తుచేశారు. తనకు సినీ కార్మికుల కష్టాలు తెలుసని.. సినీ కార్మికులను పట్టించుకోనంత స్థాయికి ఇంకా తాను వెళ్లలేదని అన్నారు. సినీ కార్మికుల కోసం నటుడు ప్రభాకర్ రెడ్డి తన సొంత 10 ఎకరాల భూమి ఇచ్చారని వెల్లడించారు. తెలుగు సినిమా ఆస్కార్ స్థాయికి వెళ్లడంలో కార్మికుల కృషి ఉందని కొనియాడారు.
సినిమా కార్మికుల కష్టాలు – సీఎం హామీలు
తెలంగాణలో ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గద్దర్ అవార్డులు ప్రారంభించామని తెలిపారు. ప్రపంచ సినిమాకు హైదరాబాద్ కేరాఫ్ కావాలన్నదే తమ ఆలోచన అని చెప్పారు. సినీ కార్మికులు అండగా ఉంటే హాలీవుడ్ను హైదరాబాద్కు తీసుకొస్తామని భరోసా ఇచ్చారు. ఫ్యూచర్ సిటీలో సినీ ఇండస్ట్రీకి స్థలాలు కేటాయిస్తామని కీలక వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు.. సినీ కార్మికుల పిల్లల కోసం ప్రత్యేకంగా స్కూల్స్ నిర్మిస్తామని చెప్పారు. సినీ కార్మికుల కష్టాలన్నీ తీరుస్తానని చెప్పను.. కానీ నాకు సాధ్యమైనంత వరకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఇక నుంచి రిలీజ్కు ముందు సినిమా టికెట్ల ధరలు పెంచితే అందులో 20 శాతం వాటా సినీ కార్మికులకు ఇవ్వాలని నిర్మాతలకు చెప్పారు. అలా చేస్తేనే టికెట్ల రేట్లు పెంచుకునేందుకు అనుమతి ఇస్తామని కీలక ప్రకటన చేశారు.
టికెట్ల ధరల పెంపుపై సంచలన షరతు
CM రేవంత్ రెడ్డి ప్రకటన తెలుగు సినీ పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది. సినీ కార్మికులకు లబ్ధి చేకూర్చే ఈ నిర్ణయంపై భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో వేచి చూడాలి.


