
తమిళ హీరో ఆర్య నటించే సినిమా షూటింగ్లో ఘోర ప్రమాదం జరిగింది. కారు స్టంట్ సమయంలో స్టంట్ ఆర్టిస్ట్ ఎస్.ఎం. రాజు మృతి చెందారు. ఈ ఘటనపై విశాల్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
Key Points
తమిళ సినిమా షూటింగ్లో స్టంట్ ఆర్టిస్ట్ ఎస్.ఎం. రాజు మృతి.
కారు స్టంట్ సమయంలో జరిగిన ప్రమాదంలో మరణం.
విశాల్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ కుటుంబానికి అండగా ఉంటానని హామీ.
కోలీవుడ్ ఇండస్ట్రీ రాజు మరణంపై విషాదంలో మునిగిపోయింది.
కారు స్టంట్లో ప్రమాదం
తమిళ హీరో ఆర్య, డైరెక్టర్ పా.రంజిత్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ లో ప్రమాదం జరిగింది. ఆదివారం (జూలై 13) అత్యంత ప్రమాదకరమైన కారును తిప్పే స్టంట్ చేస్తున్న సమయంలో స్టంట్ ఆర్టిస్ట్ ఎస్.ఎం. రాజు మరణించారు. ఈ మరణంపై తమిళ హీరో విశాల్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విశాల్, గతంలో రాజుతో అనేక చిత్రాల్లో పనిచేశారు.
సోషల్ మీడియాలో విషాదాన్ని వ్యక్తం చేస్తూ ఎక్స్ లో విశాల్ పోస్టు పెట్టారు. “జామి (ఆర్య), పా.రంజిత్ చిత్రంలో కారును తిప్పే సన్నివేశం చేస్తున్న సమయంలో స్టంట్ ఆర్టిస్ట్ రాజు మరణించడం నమ్మశక్యంగా లేదు. నాకు రాజు చాలా ఏళ్లుగా తెలుసు. నా చిత్రాల్లో అనేక ప్రమాదకరమైన స్టంట్లు చేశాడు. అతను చాలా ధైర్యవంతుడు. అతని కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి. అతని ఆత్మకు శాంతి లభించాలని కోరుకుంటున్నా” అని విశాల్ పేర్కొన్నారు.
స్టంట్ ఆర్టిస్ట్ మృతి
రాజు కుటుంబానికి ఎప్పటికీ అండగా ఉంటానని విశాల్ హామీ ఇచ్చారు. “ఈ ట్వీట్ మాత్రమే కాదు – చలన చిత్ర పరిశ్రమ నుండి వచ్చిన వ్యక్తిగా, ఆయన అనేక చిత్రాలకు చేసిన సహకారానికి కృతజ్ఞతగా, నేను ఖచ్చితంగా రాజు కుటుంబానికి అండగా ఉంటా’’ అని విశాల్ తెలిపారు.
ప్రముఖ స్టంట్ కొరియోగ్రాఫర్ స్టంట్ సిల్వా కూడా ఇన్ స్టాగ్రామ్ లో నివాళులు అర్పించారు. “మా గొప్ప కార్ జంపింగ్ స్టంట్ ఆర్టిస్టులలో ఒకరైన ఎస్ ఎమ్ రాజు ఈ రోజు కారు విన్యాసాలు చేస్తూ మరణించారు. మన స్టంట్ యూనియన్, ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఆయన్ను మిస్ అవుతున్నాం” అని సిల్వా పోస్టు చేశారు.
విశాల్ సానుభూతి
హైరిస్క్ యాక్షన్ సీక్వెన్స్ లను నిర్భయంగా తెరకెక్కించడంలో దిట్టగా పేరుగాంచిన రాజు కోలీవుడ్ ఇండస్ట్రీలో గౌరవప్రదమైన, అనుభవజ్ఞుడైన స్టంట్ ఆర్టిస్ట్. సంవత్సరాలుగా అతను అనేక చిత్రాలకు పనిచేశాడు. అతని నైపుణ్యం, అంకితభావం, ధైర్యానికి నటులు, చిత్రనిర్మాతల నుండి ప్రశంసలు పొందాడు. ప్రమాదం జరిగిన సమయంలో అతను పనిచేస్తున్న ఈ చిత్రం 2021 తమిళ స్పోర్ట్స్ డ్రామా సర్పట్టా పరంబరైకు సీక్వెల్ అని భావిస్తున్నారు. ఇది 2026 లో థియేట్రికల్ విడుదల కానుంది.
ఈ విషాద ఘటనతో కోలీవుడ్ ఇండస్ట్రీ లో విషాదం నెలకొంది. ఎస్.ఎం. రాజు ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, అతని కుటుంబానికి విశాల్ అండగా ఉంటానని హామీ ఇచ్చారు.


