
ప్రముఖ నటి దీపికా పదుకొనే తన కుమార్తె దువా మొదటి పుట్టినరోజును ప్రత్యేకంగా జరుపుకుంది. ఆమె స్వయంగా తయారుచేసిన కేక్ తో ఈ సంతోషాన్ని పంచుకుంది. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Key Points
స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే తన కూతురి మొదటి పుట్టినరోజుకు స్వయంగా కేక్ తయారు చేసింది.
ఆమె తన ప్రేమను ఈ విధంగా వ్యక్తపరిచింది.
సెలబ్రిటీలు, అభిమానులు దీపికా పోస్ట్ కు అభినందనలు తెలిపారు.
దువా పదుకొనే సింగ్ పుట్టినరోజు వేడుకలు అందరినీ ఆకట్టుకున్నాయి.
దువా మొదటి పుట్టినరోజు వేడుకలు
నటి దీపికా పదుకొనే తన కుమార్తె దువా మొదటి పుట్టినరోజు సందర్భంగా తీపి వేడుకలను జరుపుకున్నారు. ఆమె తన చిన్నారి కోసం స్వయంగా కేక్ తయారు చేసింది. అది తన ప్రేమ భాష అని ప్రకటించింది. దీపికా పదుకొనే, రణవీర్ సింగ్ కుమార్తె దువా ఫస్ట్ బర్త్ డే జరుపుకొంది.
మంగళవారం (సెప్టెంబర్ 9) దీపికా పదుకొనే, రణవీర్ సింగ్ కూతురు దువా బర్త్ డే జరిగింది. ఈ వేడుకల కోసం దీపికా స్వయంగా కేకు తయారు చేసింది. ఈ విషయాన్ని తాజాగా బుధవారం (సెప్టెంబర్ 10) ఇన్ స్టాలో పోస్టు చేసింది దీపికా.
“నా ప్రేమ భాష? నా కుమార్తె 1 వ పుట్టినరోజు కోసం కేక్ చేయడం ! (బెలూన్, చెడు కన్ను ఎమోజీ)” అని ఈ చిత్రంలో తెలుపు స్టాండ్ పై పెట్టిన చాక్లెట్ కేక్ ను పంచుకుంది దీపికా.
దీపికా చేతిలో తయారైన ప్రత్యేక కేక్
దీపికా పదుకొనే పోస్టుకు సెలబ్రిటీలు కామెంట్లు పెట్టారు. దుబాకు ఫస్ట్ బర్త్ డే విషెస్ చెప్పారు. బిపాస బసు, కాజల్ అగర్వాల్ , భూమి పడ్నేకర్ తదితర హీరోయిన్లు దీపికా పోస్టుకు కామెంట్ పెట్టారు. రెండు గంటల్లోనే ఈ పోస్టుకు 5 లక్షలకు పైగా లైక్ లు వచ్చాయి. ఫ్యాన్స్ కూడా సంతోషం వ్యక్తం చేశారు.
“ఇది చాలా స్వీట్, బేబీ దువా కోసం స్వీట్ తల్లి నుండి స్వీట్ కేక్”, “ఓమై గాడ్ మీరు దీన్ని తయారు చేశారు”, “ధన్యవాదాలు డిపి”, “క్యూటెస్ట్”, “బేబీ దువాకు పుట్టినరోజు శుభాకాంక్షలు. దీపికా మీరు చాలా మధురమైన మమ్మా” అని కామెంట్లు పెట్టారు.
సెలబ్రిటీల నుండి శుభాకాంక్షలు
దీపికా, రణవీర్ సెప్టెంబర్ 8, 2024 న తమ తొలి కుమార్తెకు స్వాగతం పలికారు. ఈ జంట 2018 లో వివాహం చేసుకుంది. గత దీపావళి సందర్భంగా వారు తమ కుమార్తెను ప్రపంచానికి పరిచయం చేశారు. ఆమె పేరు దువా పదుకొనే సింగ్ అని వెల్లడించారు. “దువా: అంటే ప్రార్థన. ఎందుకంటే ఆమె మా ప్రార్థనలకు సమాధానం. మా హృదయాలు ప్రేమ, కృతజ్ఞతతో నిండి ఉన్నాయి” అని పోస్టు చేశారు.
రోహిత్ శెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన ‘సింఘం ఎగైన్’ చిత్రంలో దీపిక చివరిసారిగా కనిపించింది. ఈ చిత్రంలో రణవీర్, కరీనా కపూర్, అజయ్ దేవగన్, అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ తదితరులు నటించారు. గతేడాది థియేటర్లలో విడుదలైంది. ఇటీవలే అల్లు అర్జున్ తో కలిసి నటించే సైన్స్ ఫిక్షన్ చిత్రానికి ఆమెను కథానాయికగా ప్రకటించారు. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి తాత్కాలికంగా AA22 x A6 అని పేరు పెట్టారు. కింగ్ చిత్రంలో షారుఖ్ ఖాన్ తో పాటు ఆమె కూడా కనిపించనుందని భావిస్తున్నారు.
దీపికా పదుకొనే తన కుటుంబ ప్రేమను ఈ విధంగా చూపించడం అందరినీ ఆకట్టుకుంది. దువాకు అందరూ శుభాకాంక్షలు తెలిపారు.


