
అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమాలోని ‘సూసీకి’ పాటకు సంబంధించి దర్శకుడు సుకుమార్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్గా మారాయి. ఈ పాటకు శ్రష్టి వర్మ ఎంతో కృషి చేసిందని ఆయన వెల్లడించారు.
Key Points
పుష్ప సినిమాలోని ‘సూసీకి’ పాటకు శ్రష్టి వర్మ 80% కంటే ఎక్కువ పని చేసింది.
సుకుమార్ శ్రష్టి వర్మకు సరైన క్రెడిట్ ఇవ్వలేకపోయాడని చెప్పారు.
గణేష్ ఆచార్య పేరుతో పాట కొరియోగ్రఫీ క్రెడిట్ లభించింది.
సుకుమార్ వ్యాఖ్యలతో నెటిజన్లలో చర్చ జరుగుతోంది.
‘సూసీకి’ పాటకు శ్రష్టి వర్మ కృషి
Sukumar : అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికి తెలిసిందే. ఈ సినిమాలో సాంగ్స్, స్టెప్పులు కూడా వైరల్ అయ్యాయి. అల్లు అర్జున్, రష్మిక కాంబోలో ‘సూసీకి అగ్గిరవ్వ మాదిరి ఉంటాడే నా సామి..’ అనే పాట కూడా పెద్ద హిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ పాట రిలీజ్ అయినప్పుడు ఈ సాంగ్ ని కొరియోగ్రఫీ చేసింది గణేష్ ఆచార్య మాస్టర్ అని అధికారికంగానే ప్రకటించారు.
అయితే తాజాగా సుకుమార్ ఈ పాట గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. అర్జున్ కూతురు ఐశ్వర్య అర్జున్ హీరోయిన్ గా నటించిన సీతా పయనం సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్ కి సుకుమార్ గెస్ట్ గా వచ్చారు. ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్ కి కొరియోగ్రాఫర్ శ్రష్టి వర్మ కూడా హాజరైంది.
సుకుమార్ వ్యాఖ్యల విశ్లేషణ
ఈ ఈవెంట్లో సుకుమార్ మాట్లాడుతూ.. పుష్ప సినిమాలో సూసీకి సాంగ్ ఆల్మోస్ట్ 80 శాతం శ్రష్టి వర్మనే కంపోజ్ చేసింది. సినిమాలో కొన్ని చిన్న చిన్న మాంటైజ్ షాట్స్ కూడా తనే కంపోజ్ చేసింది. ఆ క్రెడిట్ తనకి ఇవ్వాలి. అప్పుడు ఇవ్వలేకపోయాను అని తెలిపారు. దీంతో ఈ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
క్రెడిట్స్ వివాదం
కొన్ని నెలల క్రితం శ్రష్టి వర్మ జానీ మాస్టర్ కేసులో వైరల్ అయిన సంగతి తెలిసిందే. జానీ మాస్టర్ పై శ్రష్టి వర్మ పలు ఆరోపణలు చేయగా ఆయన జైలుకు వెళ్లి వచ్చాడు. పుష్ప సినిమా నుంచి జానీ మాస్టర్ ని తప్పించారని కూడా వార్తలు వచ్చాయి. అప్పట్లో నిర్మాతలు కూడా జానీ మాస్టర్ ని అనుకున్నాం కానీ కుదరలేదు అని చెప్పారు. అయితే జానీ మాస్టర్ చేయాల్సిన సాంగ్ ని శ్రష్టి వర్మతో చేయించి ఫేమ్, మార్కెట్ కోసం గణేష్ ఆచార్య పేరు వేసినట్టు ఇప్పుడు సుకుమార్ మాటల్లో తెలిసిపోతుంది అని నెటిజన్లు భావిస్తున్నారు.
సుకుమార్ వ్యాఖ్యలతో పుష్ప సినిమాలోని ‘సూసీకి’ పాటకు సంబంధించి కొత్త వివాదం రేగింది. శ్రష్టి వర్మకు సరైన గుర్తింపు దక్కాలని అభిమానులు కోరుకుంటున్నారు.


