
క్రికెటర్ యుజ్వేంద్ర చహల్ మరియు ధనశ్రీ వర్మ విడాకుల వార్తలు ఇటీవల వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో, సూర్యకుమార్ యాదవ్ భార్య దేవిశా ధనశ్రీకి బహిరంగంగా మద్దతు తెలపడం విశేషం.
Key Points
క్రికెటర్ చహల్ మాజీ భార్య ధనశ్రీకి సూర్యకుమార్ భార్య దేవిశా మద్దతు.
దేవిశా ఇన్స్టాగ్రామ్లో ధనశ్రీ ఇంటర్వ్యూను షేర్ చేసి మద్దతు తెలిపింది.
ధనశ్రీ హ్యూమన్స్ ఆఫ్ బాంబే ఇంటర్వ్యూలో విడాకుల అనుభవాన్ని పంచుకుంది.
ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
ధనశ్రీ, చహల్ విడాకులు
క్రికెటర్ యుజ్వేంద్ర చహల్, ధనశ్రీ వర్మ విడాకులు తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఇటీవల హ్యూమన్స్ ఆఫ్ బాంబేకు ఇచ్చిన ఇంటర్వ్యూలో.. ధనశ్రీ తన నిర్ణయం గురించి.. సోషల్ మీడియాలో వచ్చిన విమర్శలను ఎలా ఎదుర్కొన్నారో చెప్పింది. ఇప్పుడు క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ భార్య దేవిశా శెట్టి.. తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ ద్వారా ధనశ్రీకి బహిరంగంగా మద్దతు తెలపడం విశేషం.
ఒక రెడిట్ పోస్ట్ ప్రకారం.. సూర్యకుమార్ భార్య దేవిశా హ్యూమన్స్ ఆఫ్ బాంబేతో ధనశ్రీ ఇచ్చిన ఇంటర్వ్యూ స్క్రీన్గ్రాబ్ను షేర్ చేసింది. ఇందులో ఆమెకు మద్దతు తెలుపుతూ కామెంట్ చేసింది. ఆ క్యాప్షన్లో “మీపై చాలా గౌరవం, ప్రేమ ఉంది” అని రాసింది. ఈ పోస్ట్పై స్పందించిన ఒక యూజర్.. “ఇది చాలా బాధాకరం. తమ భార్యలను కొట్టే లేదా మోసం చేసే పురుషులపై ఇలాంటి ప్రచారం మీరు చూడలేరు. ఇలాంటి చెత్త, ద్వేషం కేవలం మహిళలపై మాత్రమే కనిపిస్తుంది” అని కామెంట్ చేశారు.
దేవిశా శెట్టి మద్దతు
మరొకరు స్పందిస్తూ.. “అందరూ ఎప్పుడూ మహిళలనే నిందించడానికి ఇష్టపడతారు.. నేను ఎప్పుడూ నటాషా, ధనశ్రీలను ఇష్టపడతాను. కానీ వ్యక్తులు వారి వ్యక్తిగత జీవితాలను చాలా నీచంగా అంచనా వేస్తారు” అని అన్నారు. ఇంకొకరు స్పందిస్తూ.. “స్కై (సూర్యకుమార్ యాదవ్) భార్యపై చాలా గౌరవం, ప్రేమ ఉంది” అని రాయడం విశేషం.
యుజ్వేంద్ర చహల్ , ధనశ్రీ కోవిడ్-19 సమయంలో కలిశారు. చహల్ ఆన్లైన్ డ్యాన్స్ క్లాసుల కోసం ఆమెను సంప్రదించాడు. వారి స్నేహం ప్రేమగా మారింది. వారు డిసెంబర్, 2020లో గురుగ్రామ్లో వివాహం చేసుకున్నారు. అయితే, వారి పిటిషన్ ప్రకారం.. వారు జూన్ 2022లో విడిపోయారు. పెళ్లయిన 18 నెలలకే ఈ ఇద్దరూ విడిపోవడం ప్రముఖంగా వార్తల్లో నిలిచింది. ధనశ్రీ ఇటీవల ‘భూల్ చుక్ మాఫ్’ చిత్రంలో రాజ్కుమార్ రావుతో కలిసి ఒక ప్రత్యేక డ్యాన్స్ నంబర్లో కనిపించింది.
సోషల్ మీడియా స్పందన
ధనశ్రీ ఈ మధ్యే యూట్యూబ్లో హ్యూమన్స్ ఆఫ్ బాంబే కోసం ఒక పాడ్కాస్ట్లో విడాకుల గురించి మాట్లాడింది. “తీర్పు ఇవ్వబోతున్నప్పుడు నాకు ఇంకా గుర్తుంది. మానసికంగా బాగా సిద్ధమైనప్పటికీ నేను చాలా భావోద్వేగానికి లోనయ్యా. అందరి ముందు ఏడ్వడం మొదలుపెట్టా. ఆ సమయంలో నా ఫీలింగ్ ఏంటో కూడా చెప్పలేకపోయా. నేను ఏడుస్తూనే ఉన్నా. అయితే అదంతా జరిగిపోయింది. అతను (చహల్) ముందు బయటకు వెళ్ళాడు” అని ధనశ్రీ తెలిపింది.
విడాకుల విచారణ లాస్ట్ డే రోజు యుజ్వేంద్ర చహల్ ‘బీ యువర్ ఓన్ షుగర్ డాడీ’ అని రాసి ఉన్న టీ-షర్టు ధరించి వచ్చాడు. దీనిపై స్పందిస్తూ.. ధనశ్రీ తాను ఆశ్చర్యపోయానని చెప్పింది. తనకు ఏదైనా చెప్పాలనుకుంటే బహిరంగంగా ప్రదర్శించే బదులు వ్యక్తిగతంగా చెప్పి ఉండాల్సిందని ఆమె చెప్పింది.
చివరగా, సూర్యకుమార్ యాదవ్ భార్య దేవిశా చేసిన మద్దతు చర్య సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. విడాకుల విషయంలో మహిళలకు మద్దతు అవసరమని ఈ ఘటన చూపిస్తుంది.


