
Key Points
SSMB29 చిత్రంలో మహేశ్ బాబుతో పాటు ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్నారు.
తాజాగా, తమిళ స్టార్ హీరో చియాన్ విక్రమ్ ఈ చిత్రంలో నటించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.
ఈ వార్తల వల్ల SSMB29 మల్టీస్టారర్గా మారే అవకాశం ఉందని అభిమానులు భావిస్తున్నారు.
రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి.
SSMB29 చిత్రం గురించి తాజా వార్తలు
సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu) ప్రస్తుతం SSMB29తో బిజీగా ఉన్నాడు. దర్శకధీరుడు రాజమౌళి (SS Rajamouli)తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై ఫ్యాన్స్తో పాటు సినీ ప్రేమికుల్లో కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ఈ హై బడ్జెట్ మూవీలో హాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా (Priyanka Chopra) హీరోయిన్గా నటిస్తుండగా.. మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) కీలక పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ సినిమా నుంచి అప్డేట్స్ రానప్పటికీ అనౌన్స్మెంట్తోనే హైప్ పెంచేశారు చిత్ర బృందం. అలాగే SSMB29కు సంబంధించిన నిత్యం ఏదో ఒక న్యూస్ నెట్టింట వైరల్ అవుతూ ఫ్యాన్స్ను ఫుల్ ఖుష్ చేస్తుంది.
తాజాగా మరో ఇంట్రెస్టింగ్ బజ్ నెట్టింట వినిపిస్తోంది. రాజమౌళి, మహేశ్ కాంబోలో వస్తున్న ఈ చిత్రంలో ఎంతో మంచి స్టార్ హీరోస్ కీలక పాత్రల్లో కనిపించనున్నారని ఇప్పటికే పలు వార్తలు రాగా.. ఇప్పుడు ఇందులో తమిళ స్టార్ హీరో చియాన్ విక్రమ్ (Chiyan Vikram) కూడా భాగం అయినట్లు తెలుస్తుంది. అయితే.. ఇందులో నిజం ఎంత ఉందో తెలియనప్పటికీ ఇందుకు సంబంధించిన పోస్టులు మాత్రం నెట్టింట వైరల్ అవుతుండగా.. ఇది మల్టీస్టారర్ చిత్రంలా ఉంటుందేమో అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.
చియాన్ విక్రమ్ సినిమాలో నటించే అవకాశం
మల్టీస్టారర్గా మారే అవకాశం
చియాన్ విక్రమ్ నటనతో SSMB29 మరింత ఆసక్తికరంగా మారే అవకాశం ఉంది. ఈ మల్టీస్టారర్ చిత్రంపై అభిమానుల ఆసక్తి రోజురోజుకు పెరుగుతోంది.


