
📌 Key Points
- తెలంగాణలో అత్యవసర పరిస్థితులకు శిక్షణ పొందిన వాలంటీర్ల బృందం ఏర్పాటు.
- మల్లారెడ్డి, వీరనారి చాకలి ఐలమ్మ యూనివర్సిటీల్లో శిక్షణా కార్యక్రమాలు.
- అగ్నిమాపకం, ప్రథమ చికిత్స, విపత్తు నిర్వహణలో వాలంటీర్లకు శిక్షణ.
- విపత్తుల సంసిద్ధతను బలోపేతం చేయడమే లక్ష్యం: డీజీ విక్రమ్ సింగ్ మాన్.
తెలంగాణ ప్రభుత్వం విపత్తుల నిర్వహణకు కీలక చర్యలు చేపట్టింది. రాష్ట్రంలోని రెండు యూనివర్సిటీల్లో సివిల్ డిఫెన్స్ వాలంటీర్ల శిక్షణ కార్యక్రమాలను ప్రారంభించింది. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు సహాయం అందించేందుకు ఈ వాలంటీర్లకు అగ్నిమాపకం, ప్రథమ చికిత్స వంటి అంశాల్లో శిక్షణ ఇస్తున్నారు.
విపత్తుల సన్నద్ధతకు ప్రభుత్వ చర్యలు
అత్యవసర పరిస్థితులు, విపత్తుల సమయంలో సహాయపడగల శిక్షణ పొందిన స్వచ్ఛంద కార్యకర్తల బృందాన్ని నిర్మించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. తెలంగాణ అగ్నిమాపక, విపత్తు ప్రతిస్పందన, అత్యవసర, పౌర రక్షణ శాఖ రెండు విశ్వవిద్యాలయాలలో పౌర రక్షణ స్వచ్ఛంద కార్యకర్తల శిక్షణా కార్యక్రమాలను(Civil Defence Volunteer Training Programmes) ప్రారంభించింది.
ఈ స్వచ్ఛంద కార్యకర్తలు సహాయక చర్యలు, అగ్నిమాపకం, ప్రథమ చికిత్స, జన సమూహ నిర్వహణ, విపత్తు సన్నద్ధత, సామాజిక అవగాహన, సహాయ పంపిణీ వంటి అంశాలలో సైద్ధాంతిక, ఆచరణాత్మక శిక్షణ పొందుతారు. అత్యవసర పరిస్థితులలో వీరు అగ్నిమాపక శాఖ, పోలీసులు, జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం, ఇతర శాఖలతో కలిసి పనిచేస్తారు.
దులాపల్లిలోని మల్లారెడ్డి డీమ్డ్ టు బి యూనివర్సిటీ లో ఐదు రోజుల శిక్షణా కార్యక్రమం ప్రారంభమైంది. ఇందులో 400 మంది స్వచ్ఛంద కార్యకర్తలకు విపత్తు ప్రతిస్పందన, అత్యవసర నిర్వహణకు సంబంధించిన వివిధ అంశాలలో శిక్షణ ఇస్తారు. అగ్నిమాపక శాఖ అధికారుల సమక్షంలో వైస్-ఛాన్సలర్ పి. రవీందర్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
రెండు యూనివర్సిటీల్లో శిక్షణ ప్రారంభం
అదే సమయంలో కోటిలోని వీరనారి చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయంలో ఐదు రోజుల శిక్షణా కార్యక్రమం రెండో బ్యాచ్ ప్రారంభమైంది. ప్రారంభోత్సవ కార్యక్రమానికి 200 మంది పౌర రక్షణ వాలంటీర్లు, విశ్వవిద్యాలయ యాజమాన్యం, అధ్యాపకులు, సిబ్బందికి చెందిన 50 మంది సభ్యులు హాజరయ్యారు.
అగ్నిమాపక, విపత్తు ప్రతిస్పందన, అత్యవసర, పౌర రక్షణ శాఖ డైరెక్టర్ జనరల్ విక్రమ్ సింగ్ మాన్ మాట్లాడుతూ.. ఈ చొరవ రాష్ట్రవ్యాప్తంగా విపత్తు సంసిద్ధతను, అత్యవసర ప్రతిస్పందనను బలోపేతం చేస్తుందని అన్నారు. వరదలు, పెద్ద అగ్నిప్రమాదాలు, ఇతర విపత్తుల సమయంలో అత్యవసర సేవలు వచ్చేలోపు, శిక్షణ పొందిన వాలంటీర్లు సంబంధిత శాఖలకు సహాయం చేయగలరని అన్నారు.
వాలంటీర్ల పాత్ర, ప్రాముఖ్యత
అత్యవసర పరిస్థితులలో శిక్షణ పొందిన సివిల్ డిఫెన్స్ వాలంటీర్లను మోహరించడం ద్వారా సమస్య తీవ్రతను తగ్గించడానికి ఆస్కారం ఉందన్నారు. వారికి సంబంధించి.. అప్డేట్ చేసిన డేటాబేస్లను నిర్వహించాలని డైరెక్టర్ జనరల్ జిల్లా అధికారులను ఆదేశించారు.
ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్ఎడిటర్గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్మెంట్లో భాగంగా ఈటీవీ భారత్కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు.
హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్స్టైల్, ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్సైట్స్ లాంచ్ టీమ్లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు. Read More
ఈ శిక్షణా కార్యక్రమాలు రాష్ట్రవ్యాప్తంగా విపత్తు సంసిద్ధతను బలోపేతం చేస్తాయని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు. శిక్షణ పొందిన వాలంటీర్లు అత్యవసర సేవలకు అండగా నిలిచి, విపత్తు నష్టాన్ని తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తారు.


