|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

తెలంగాణ పోలీసు బాస్ మారారు! సీవీ ఆనంద్ ప్రస్థానం, సవాళ్లు, భవిష్యత్ ప్రణాళికలు!

Published: 01-05-2026, 5:28 PM
తెలంగాణ పోలీసు బాస్ మారారు! సీవీ ఆనంద్ ప్రస్థానం, సవాళ్లు, భవిష్యత్ ప్రణాళికలు!
  • తెలంగాణ నూతన డీజీపీగా సీనియర్ ఐపీఎస్ అధికారి సీవీ ఆనంద్ బాధ్యతలు స్వీకరించారు.
  • శాంతిభద్రతలు, సైబర్ నేరాలు, డ్రగ్స్ నియంత్రణ, మహిళా భద్రతకు ప్రాధాన్యత ఇస్తానని ప్రకటించారు.
  • 1991 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన ఆనంద్‌కు మూడు దశాబ్దాలకు పైగా అనుభవం ఉంది.
  • వరంగల్ ఎస్పీ, విజయవాడ సీపీ, హైదరాబాద్ సీపీ వంటి కీలక పదవుల్లో పనిచేశారు.

తెలంగాణ రాష్ట్ర పోలీసు శాఖకు నూతన సారథిగా సీనియర్ ఐపీఎస్ అధికారి సీవీ ఆనంద్ బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణ, సైబర్ నేరాల నియంత్రణ, మహిళా భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తానని ఆయన స్పష్టం చేశారు.

నూతన డీజీపీగా సీవీ ఆనంద్ బాధ్యతలు

Telangana New DGP CV Anand : తెలంగాణ రాష్ట్ర పోలీసు శాఖలో నూతన శకం ప్రారంభమైంది. రాష్ట్ర పోలీసు విభాగపు అత్యున్నత పదవి అయిన డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (DGP)గా సీనియర్ ఐపీఎస్ అధికారి సీవీ ఆనంద్ బాధ్యతలు స్వీకరించారు. మంగళవారం ఉదయం హైదరాబాద్‌లోని డీజీపీ కార్యాలయంలో (పోలీస్ మేనేజ్‌మెంట్ బిల్డింగ్) వేద మంత్రోచ్ఛారణలు, పోలీసు గౌరవ వందనాల మధ్య ఈ బాధ్యతల స్వీకార కార్యక్రమం జరిగింది.

సీవీ ఆనంద్ కుటుంబ సభ్యులతో పాటు పోలీసు శాఖలోని పలువురు సీనియర్ ఐపీఎస్ అధికారులు హాజరయ్యారు. ఆయన బాధ్యతలు చేపట్టిన వెంటనే కుటుంబ సభ్యులు ఆయనకు పుష్పగుచ్ఛాలు అందించి అభినందనలు తెలియజేశారు. తోటి అధికారులు, కింది స్థాయి సిబ్బంది ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.

గతంలో హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌గా, ఏసీబీ చీఫ్‌గా కీలక బాధ్యతలు నిర్వహించిన సీవీ ఆనంద్… ఇప్పుడు రాష్ట్ర పోలీస్ విభాగానికి సారథిగా వ్యవహరించనున్నారు.

ఆనంద్ ప్రస్థానం: కీలక పదవులు, అవార్డులు

బాధ్యతలు స్వీకరించిన అనంతరం సీవీ ఆనంద్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణ విషయంలో ఎలాంటి రాజీ పడే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యంగా సైబర్ నేరాలు, డ్రగ్స్ నియంత్రణ మరియు మహిళల భద్రతపై ప్రత్యేక దృష్టి సారిస్తామని తెలిపారు. ప్రజలకు చేరువగా ఉంటూనే, నేరగాళ్ల గుండెల్లో వణుకు పుట్టించేలా పోలీసు వ్యవస్థ పనిచేస్తుందన్నారు. కింది స్థాయి పోలీసు సిబ్బంది సంక్షేమంపై కూడా ప్రత్యేక శ్రద్ధ వహిస్తామని ఆయన పేర్కొన్నారు.

1991 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారిగా సీవీ ఆనంద్‌కు మూడు దశాబ్దాలకు పైగా అనుభవం ఉంది. క్షేత్రస్థాయిలో పనిచేసిన అనుభవంతో పాటు, పాలనాపరంగా ఆయన తీసుకున్న నిర్ణయాలు గతంలో మంచి ఫలితాలను ఇచ్చాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనూ, తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా ఆయన పలు కీలక హోదాల్లో పనిచేశారు.

హైదరాబాద్ కు చెందిన సీవీ ఆనంద్… నిజాం కాలేజీలో డిగ్రీ పూర్తి చేశారు. ఉస్మానియా యూనివర్శిటీ నుంచి పీజీ పట్టా పొందారు. స్వతహాగా క్రికెట్‌ క్రీడాకారుడైన ఆనంద్‌ చదువుకునే రోజుల్లోనే అండర్‌-22కు ఎంపికయ్యారు. 2002లో రాష్ట్రపతి శౌర్యపతకం (పీఎంజీ), 2007లో భారత పోలీసు పతకం (ఐపీఎం), 2017లో రాష్ట్రపతి పతకంతోపాటు ఎన్నో అవార్డులు అందుకున్నారు.

ప్రజల భద్రతకు ప్రాధాన్యత: ఆనంద్ ప్రణాళికలు

ఉమ్మడి ఏపీలో వరంగల్ రూరల్ ఎస్పీగా, విజయవాడ సీపీగా పని చేశారు. అబ్కారీ శాఖ డైరెక్టర్ గా, సైబరాబాద్ కమిషనర్ గా విధులు నిర్వర్తించారు. 2021-23 కాలంలో హైదరాబాద్ సీటీ కమిషనర్ గా, 2025 -2026లో హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పని చేశారు. ఏప్రిల్ 30వ తేదీతో డీజీపీగా శివధర్ రెడ్డి కాలవ్యవధి పూర్తి కావటంతో… నూతన డీజీపీగా సీవీ ఆనంద్ బాధ్యతలు చేపట్టారు.

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 – 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన ‘లాంగ్వేజేస్ జర్నో’ అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు. Read More

మూడు దశాబ్దాలకు పైగా అనుభవం కలిగిన సీవీ ఆనంద్, తన ప్రణాళికలతో రాష్ట్ర పోలీసు వ్యవస్థను మరింత పటిష్టం చేసి, ప్రజలకు భద్రత కల్పిస్తారని ఆశిస్తున్నారు. ఆయన నాయకత్వంలో తెలంగాణ పోలీసు శాఖ కొత్త పుంతలు తొక్కనుంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.