
📌 Key Points
- తెలంగాణలో 2026 ప్రవేశ పరీక్షలు సమీపిస్తున్నాయి, విద్యార్థులు సన్నద్ధం కావాలి.
- ఉస్మానియా విశ్వవిద్యాలయం టీజీ లాసెట్ 2026 దరఖాస్తు గడువును ఏప్రిల్ 10, 2026 వరకు పొడిగించింది.
- 3 మరియు 5 సంవత్సరాల ఎల్ఎల్బీ కోర్సులలో ప్రవేశాల కోసం టీఎస్ లాసెట్ 2026 పరీక్ష నిర్వహిస్తారు.
- అసంపూర్తిగా ఉన్న దరఖాస్తులను రిజిస్ట్రేషన్ సమయంలో తిరస్కరిస్తారు.
తెలంగాణలోని విద్యార్థులకు ముఖ్యమైన ప్రకటన. 2026 ప్రవేశ పరీక్షల తేదీలు సమీపిస్తున్నాయి. టీజీ లాసెట్ దరఖాస్తు గడువును ఉస్మానియా విశ్వవిద్యాలయం పొడిగించింది. పరీక్షల వివరాలు, ముఖ్యమైన తేదీల గురించి తెలుసుకోండి.
టీజీ లాసెట్ 2026: దరఖాస్తు గడువు పొడిగింపు
తెలంగాణలో విద్యార్థుల కోసం 2026 ప్రవేశ పరీక్షలు దగ్గరకు వస్తున్నాయి. మీరు మీ క్యాలెండర్పై ఈ తేదీలను మార్క్ చేసుకుని పెట్టుకోవడం మంచిది. దానికి తగ్గట్టుగా ప్రిపరేషన్ ప్లాన్ చేసుకోవాలి. టీజీ ఈఏపీ సెట్, టీజీ లాసెట్ లాంటి పరీక్షలు త్వరలో జరగనున్నాయి. వీటికి సంబంధించి అప్లికేషన్ తేదీలు కూడా దగ్గర పడుతున్నాయి.
ఉస్మానియా విశ్వవిద్యాలయం టీజీ లాసెట్ 2026 దరఖాస్తు గడువును, ఎటువంటి ఆలస్య రుసుము లేకుండా ఏప్రిల్ 10, 2026 వరకు పొడిగించింది. టీజీ లాసెట్ దరఖాస్తు పత్రాన్ని ఇంకా పూరించని అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ lawcet.tgche.ac.in ను సందర్శించవచ్చు. విద్యార్థులు LAWCET 2026 ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియను గడువు తేదీలోగా పూర్తి చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే రిజిస్ట్రేషన్ ప్రక్రియ సమయంలో అసంపూర్ణంగా ఉన్న దరఖాస్తులు తిరస్కరిస్తారు.
ముఖ్యమైన పరీక్ష తేదీలు: విద్యార్థులకు సూచనలు
తెలంగాణలోని సంబంధిత కళాశాలల్లో 3-సంవత్సరాల, 5-సంవత్సరాల LLB కోర్సులలో ప్రవేశాల కోసం అధికారులు TS LAWCET 2026 పరీక్షను నిర్వహిస్తున్నారు. దరఖాస్తు పత్రాన్ని పూరించాలనుకునే విద్యార్థులు ముందుగా ఆన్లైన్ విధానంలో దరఖాస్తు రుసుమును చెల్లించాలి. ఆ తర్వాత తమ వ్యక్తిగత, విద్యా సంబంధిత వివరాలను ఉపయోగించి దరఖాస్తు పత్రాన్ని పూరించాలి.
TS LAWCET దరఖాస్తు పత్రాన్ని పూరించడానికి విద్యార్థులు ఈ క్రింది దశలను పాటించాలి:
దరఖాస్తు ప్రక్రియ: పూర్తి వివరాలు
ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్ఎడిటర్గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్మెంట్లో భాగంగా ఈటీవీ భారత్కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు.
హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్స్టైల్, ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్సైట్స్ లాంచ్ టీమ్లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు. Read More
పరీక్షల తేదీలు దగ్గర పడుతున్నందున, విద్యార్థులు సన్నద్ధతను వేగవంతం చేయాలి. ముఖ్యమైన తేదీలను గుర్తుంచుకొని, దరఖాస్తులను సకాలంలో సమర్పించాలని సూచిస్తున్నారు.


