
తెలుగు టెలివిజన్ డిజిటల్ అండ్ ఓటిటి ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ 2025-27 కాలానికి కొత్త కార్యవర్గం ఎన్నిక చేసింది. ఏకగ్రీవంగా జరిగిన ఈ ఎన్నికలలో ఏ. ప్రసాదరావు ప్రెసిడెంట్ గా ఎన్నికయ్యారు. కౌన్సిల్ యొక్క విజయాలు, భవిష్యత్ ప్రణాళికల గురించి ఈ కథనం వివరిస్తుంది.
Key Points
తెలుగు టెలివిజన్ డిజిటల్ అండ్ ఓటిటి ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కొత్త కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికైంది.
ఏ. ప్రసాదరావు (సోనోపిక్స్ ప్రసాద్) ప్రెసిడెంట్గా ఎన్నికయ్యారు.
కౌన్సిల్ లో దాదాపు 200 మంది నిర్మాతలు సభ్యులుగా ఉన్నారు.
సొంత భవనం, స్థిరాస్తులతో, సభ్యులకు విశ్వసనీయ సంస్థగా కౌన్సిల్ గుర్తింపు పొందింది.
నూతన కార్యవర్గం ఎన్నిక
TV Producers : 2025– 2027వ సంవత్సరానికి ‘తెలుగు టెలివిజన్ డిజిటల్ అండ్ ఓటిటి ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ నూతన కార్యవర్గం ఎన్నికైంది. ప్రెసిడెంట్గా ఏ.ప్రసాదరావు (సోనోపిక్స్ ప్రసాద్), వైస్ ప్రెసిడెంట్గా పి.ప్రభాకర్, యన్.అశోక్లు ఎన్నికవ్వగా జనరల్ సెక్రటరీగా యం.వినోద్బాల జాయింట్ సెక్రటరీలుగా నటుడు, నిర్మాత కె.వి శ్రీరామ్, గుత్తా వెంకటేశ్వరరావు, ట్రెజరర్గా డి.వై చౌదరి ఎన్నికయ్యారు.(TV Producers)
14 ఏళ్లుగా ఎలాంటి లాభాపేక్ష లేకుండా తమ సభ్యులకు ఉపయోగపడే విధంగా పనులు చేసి అందరితో శభాష్ అనిపించుకునే ఏకైక యూనియన్ మాది అని ప్రెసిడెంట్ ప్రసాద్రావు అన్నారు. ఎలాంటి ఎన్నికల హడావిడి లేకుండా, రాగద్వేషాలు లేకుండా ఏకగ్రీవంగా సభ్యులను ఎన్నుకుంటున్న ఏకైక యూనియన్ మా టిటిడిఓపిసి సంస్థ అని తెలిపారు జనరల్ సెక్రటరీ వినోద్బాల.
కౌన్సిల్ సభ్యుల వివరాలు
ఈ కౌన్సిల్లో దాదాపు 200 మంది నిర్మాతలు ఉన్నారు. అందరూ యాక్టివ్గా ఉంటూ వందలమందికి ఉపాధి కల్పించటంలో అనేక యూనియన్ల కంటే సౌతిండియాలోనే అతి పెద్ద సంస్థ మాది అన్నారు నటుడు, నిర్మాత ఈటీవి ప్రభాకర్. మా యూనియన్కి సొంత భవనంతో పాటు కొన్ని స్థిరాస్తులు ఉండటంతో మా మీద నమ్మకం ఉంచి మమ్మల్ని ఎంతో ప్రోత్సహిస్తున్నారు మా యూనియన్ సభ్యులు అని తెలిపారు ట్రెజరర్ డి.వి చౌదరి.
కౌన్సిల్ యొక్క విజయాలు
మా యూనియన్ సభ్యులకి ఎలాంటి ఆపద వచ్చినా అందమా కలిసి కట్టుగా మాట్లాడుకుని డెసిషన్ తీసుకుంటామని, అందుకే మాలో వివాదాలు ఉండవని అన్నారు నటుడు, నిర్మాత కె.వి శ్రీరామ్.
Also See : National Awards : నేషనల్ అవార్డులు అందుకున్న గ్రహీతలు.. టాలీవుడ్ నుంచి ఎవరెవరంటే..
ఏకగ్రీవ ఎన్నికతో కౌన్సిల్ మరింత బలపడింది. సభ్యులకు మద్దతు, సహకారంతో టెలివిజన్ మరియు ఓటిటి రంగాల అభివృద్ధికి కృషి చేస్తామని కొత్త కార్యవర్గం తెలిపింది.


