|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

టీజీ ఈఏపీసెట్ గడువు ముగింపుకు చేరువలో! మీ భవితవ్యం కోసం వెంటనే దరఖాస్తు చేసుకోండి!

Published: 30-03-2026, 2:05 AM
టీజీ ఈఏపీసెట్ గడువు ముగింపుకు చేరువలో! మీ భవితవ్యం కోసం వెంటనే దరఖాస్తు చేసుకోండి!
  • ఏప్రిల్ 4 వరకు ఫైన్ లేకుండా టీజీ ఈఏపీసెట్ దరఖాస్తుకు అవకాశం ఉంది.
  • పరీక్షా కేంద్రాలు నిండిపోతున్నందున వెంటనే దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచన.
  • మే 4, 5 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్షలు; మే 9-11 వరకు ఇంజినీరింగ్ పరీక్షలు జరుగుతాయి.
  • పరీక్షల అనంతరం ర్యాంకుల ప్రకటన, కౌన్సెలింగ్ ద్వారా సీట్ల కేటాయింపు ఉంటుంది.

తెలంగాణలోని ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించే టీజీ ఈఏపీసెట్-2026 దరఖాస్తు గడువు దగ్గర పడుతోంది. ఏప్రిల్ 4 వరకు ఫైన్ లేకుండా దరఖాస్తు చేసుకోవచ్చునని అధికారులు తెలిపారు.

దరఖాస్తు గడువు సమీపిస్తోంది: వెంటనే అప్లై చేసుకోండి!

రాష్ట్రంలోని ఇంజినీరింగ్, అగ్రికల్చర్ ఫార్మసీ కాలేజీల్లో ప్రవేశాలకు నిర్వహించే టీజీ ఈఏపీసెట్ దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. అయితే దరఖాస్తులకు గడువు దగ్గరపడుతోంది. ఎలాంటి ఫైన్ లేకుండా ఏప్రిల్ 4వ తేదీ వరకు అప్లయ్ చేసుకోవచ్చు. సమయం దగ్గరపడుతున్న వేళ… వెంటనే దరఖాస్తు చేసుకోవాలని అదికారులు సూచిస్తున్నారు.

ఈ ఎంట్రెన్స్ ఎగ్జామ్ ద్వారా 2026 -2027 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు కల్పిస్తారు. ఫైన్ తో అయితే… మే 2 వరకు అవకాశం కల్పించారు. ఇప్పటికే పలు జిల్లాల్లో పరీక్షా జోన్‌లను ఎంచుకునే అవకాశం లేకుండా పోయింది. ఎందుకంటే అధికారులు వాటిని బ్లాక్ చేశారు. మహబూబ్‌నగర్, నల్గొండ, సంగారెడ్డి, ఆదిలాబాద్, నిజామాబాద్‌లలో పరీక్షా జోన్లను స్తంభింపజేసింది. ఈ జిల్లాల నుండి అధిక సంఖ్యలో దరఖాస్తులు అందాయి.

రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 16 టెస్ట్ జోన్లు ఉండగా…. 10 జోన్లు ఇప్పటికే నిండిపోయాయి. ప్రస్తుతం హైదరాబాద్(జోన్​ 1, 2, 3), ఖమ్మం, సత్తుపల్లి, వరంగల్ కేంద్రాల్లోనే స్లాట్లు అందుబాటులో ఉన్నాయని అధికారులు చెబుతున్నారు.

టీజీ EAPCET -2026 పరీక్షల నిర్వహణ తేదీలు చూస్తే.. మే 4, మే 5న అగ్రికల్చర్, ఫార్మసీ ప్రవేశ పరీక్షలు ఉంటాయి. మే 9 నుంచి మే 11 వరకు ఇంజినీరింగ్ స్ట్రీమ్ ఎగ్జామ్స్ నిర్వహిస్తారు. పరీక్షలు పూర్తి అయిన తర్వాత ప్రాథమిక కీలను ప్రకటించి… అభ్యంతరాలను స్వీకరించిన… అనంతరం ర్యాంకులను ప్రకటిస్తారు. అభ్యర్థులు సాధించే ర్యాంకుల ఆధారంగానే సీట్ల కేటాయింపు ఉంటుంది. విడతల వారీగా కౌన్సెలింగ్ ప్రక్రియను నిర్వహించి… సీట్లను భర్తీ చేస్తారు.

పరీక్షా కేంద్రాల కొరత: వేగంగా నిండుతున్న స్లాట్లు!

టీజీ EAPCET దరఖాస్తులకు చివరి తేదీ – 4 ఏప్రిల్ 2026.

రూ. 250 ఫైన్ తో దరఖాస్తులకు చివరి తేదీ – 10-04-2026.

రూ. 500 ఫైన్ తో చివరి తేదీ – 15-04-2026.

రూ. 2,500 ఆలస్య రుసుంతో చివరి తేదీ – 20-04-2026.

ముఖ్యమైన తేదీలు: పరీక్షల నిర్వహణ ఎప్పుడంటే?

రూ. 5,000 ఆలస్య రుసుంతో చివరి తేదీ – 24-04-2026.

రూ. 10,000 ఆలస్య రుసుంతో చివరి తేదీ – : 02-05-2026.

అధికారిక వెబ్ సైట్ – https://eapcet.tgche.ac.in/

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 – 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన ‘లాంగ్వేజేస్ జర్నో’ అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు. Read More

టీజీ ఈఏపీసెట్ 2026 దరఖాస్తు గడువు సమీపిస్తున్నందున, అర్హులైన విద్యార్థులు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తున్నారు. మీ భవిష్యత్తును సుస్థిరం చేసుకోవడానికి ఇది మంచి అవకాశం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.