
📌 Key Points
- మైనారిటీ గురుకులాల్లో 5-8 తరగతుల్లో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల.
- ఆన్లైన్ దరఖాస్తు గడువు మార్చి 31 వరకు ఉంది.
- మైనారిటీలకు 75% సీట్లు, ఇతరులకు 25% సీట్లు రిజర్వ్ చేయబడ్డాయి.
- కుటుంబ వార్షిక ఆదాయం రూ. 1.5 లక్షలు (గ్రామీణం), రూ. 2 లక్షలు (పట్టణం) మించకూడదు.
తెలంగాణ మైనారిటీస్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ (TMREIS) 2026-27 విద్యా సంవత్సరానికి మైనారిటీ గురుకులాల్లో 5 నుంచి 8 తరగతుల వరకు ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆన్లైన్ దరఖాస్తులు మార్చి 31 వరకు అందుబాటులో ఉంటాయి.
TMREIS అడ్మిషన్ నోటిఫికేషన్ వివరాలు
హైదరాబాద్లోని తెలంగాణ మైనార్టీస్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ(టీఎంఆర్ఈఐఎస్) నుంచి అడ్మిషన్ నోటిఫికేషన్ జారీ అయింది. ఈ ఎంట్రెన్స్ ఎగ్జామ్ ద్వారా….. మైనారిటీ గురుకులాల్లో 2026-27 విద్యాసంవత్సరానికి ప్రవేశాలు కల్పిస్తారు.
ఈ ఎంట్రెన్స్ ఎగ్జామ్ ద్వారా 5, 6, 7, 8 తరగతులల్లో ప్రవేశాలు పొందవచ్చు. ప్రస్తుతం ఆన్ లైన్ దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. ఈ గడువు మార్చి 31వతేదీతో ముగుస్తుంది.
దరఖాస్తు ప్రక్రియ మరియు ముఖ్యమైన తేదీలు
రాష్ట్రంలో ఉన్న మైనార్టీ గురుకులాల్లో 75శాతం సీట్లు మైనార్టీలకు, 25శాతం సీట్లు మైనార్టీయేతర విద్యార్థులకు రిజర్వు చేశారు. అభ్యర్థులు https://tgmreistelangana.cgg.gov.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. మైనార్టీ విద్యార్థులకు తొలుత దరఖాస్తు చేసిన వారికి ప్రాధాన్యం ఉంటుంది. మైనార్టీయేతర విద్యార్థులకు లక్కీడిప్ ద్వారా సీట్లు కేటాయిస్తారు.
తరగతిని అనుసరించి 4, 5, 6, 7వ తరగతి ఉత్తీర్ణత ఉండాలి. కుటుంబ వార్షికా ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో అయితే రూ.1.5 లక్షలుగా ఉండాలి. అదే పట్టణ ప్రాంతాల్లో అయితే రూ.2 లక్షలకు మించకూడదని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. ఇతర వివరాల కోసం 040-23437909 ( ఉదయం10:30 నుంచి సాయంత్రం 5:00 గంటలు) ను సంప్రదించవచ్చు.
రిజర్వేషన్లు మరియు అర్హతలు
ఈ లింక్ పై క్లిక్ చేసి అప్లికేషన్ ప్రాసెస్ పూర్తి చేసుకోవచ్చు
మైనారిటీ గురుకులాల్లో ప్రవేశం పొందాలనుకునే విద్యార్థులు వెంటనే దరఖాస్తు చేసుకోండి. ఇది మీ పిల్లల భవిష్యత్తును మార్చే ఒక గొప్ప అవకాశం. మరింత సమాచారం కోసం వెబ్సైట్ను సందర్శించండి.


