
📌 Key Points
- టాలీవుడ్ దర్శకుడు కిరణ్ కుమార్ అలియాస్ కేకే ఆకస్మిక మరణం.
- ‘KJQ’ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని 2026 ఆరంభంలో విడుదల కావాల్సి ఉంది.
- కేకే మణిరత్నం వద్ద సహాయ దర్శకుడిగా, నాగార్జున ‘కేడి’ సినిమాకు దర్శకుడిగా పనిచేశారు.
- ప్రస్తుత స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ ‘కేడి’ సినిమాకు కేకే వద్ద అసిస్టెంట్ డైరెక్టర్.
టాలీవుడ్లో విషాదం చోటుచేసుకుంది. దర్శకుడు కిరణ్ కుమార్ (కేకే) ఆకస్మిక మృతి సినీ పరిశ్రమను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆయన రూపొందించిన ‘KJQ’ సినిమా విడుదల ముంగిటనే ఈ విషాదం జరగడం తీవ్ర ఆవేదన కలిగిస్తోంది. సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు.
దర్శకుడు కేకే సినీ ప్రస్థానం
Director Kiran Kumar : టాలీవుడ్ లో విషాదం నెలకొంది. దర్శకుడు కిరణ్ కుమార్ అలియాస్ కేకే మరణించారు. దర్శకత్వ శాఖలో ఎన్నో ఏళ్లుగా సినీ పరిశ్రమలో ఉన్న కేకే మణిరత్నం వద్ద కూడా సహాయ దర్శకుడిగా పని చేసాడు. నాగార్జున కేడి సినిమాతో దర్శకుడిగా మారాడు కేకే. ఆ తర్వాత మళ్ళీ చాన్నాళ్లు గ్యాప్ తీసుకొని ఇటివలే KJQ అనే సినిమాని ప్రకటించారు.(Director Kiran Kumar)
KJQ సినిమా షూటింగ్ పూర్తిచేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. ఇప్పటికే టీజర్ కూడా రిలీజ్ చేసారు. 2026 మొదట్లోనే ఈ సినిమా రిలీజ్ కి ప్లాన్ చేసారు. కానీ అంతలోనే దర్శకుడు కేకే మరణించాడు. నేడు ఉదయం కేకే మరణించినట్టు సమాచారం. దీంతో మూవీ యూనిట్, పలువురు సినీ ప్రముఖులు ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు. అయితే కేకే ఎలా మరణించాడు, ఆయన మరణానికి కారణాలు ఏంటి అనేది తెలియాల్సి ఉంది.
‘KJQ’ సినిమాకు సిద్ధమైన వేళ..
ఆకస్మిక మరణం: కారణాలు ఏంటి?
అర్జున్ రెడ్డి డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ కేకే దగ్గర కేడి సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసాడు. ఈ విషయం కేకే గతంలో ఓ ప్రెస్ మీట్ లో తెలిపాడు.
దర్శకుడు కేకే మరణం టాలీవుడ్కు తీరని లోటు. ‘KJQ’ సినిమా విడుదల కాకుండానే ఆయన కన్నుమూయడం దురదృష్టకరం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేద్దాం.


