|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

వైశాఖ శుక్ల ఏకాదశి: మోహిని ఏకాదశి – శ్రీహరి విశిష్ట అవతార కథ

Published: 06-05-2025, 10:11 PM
వైశాఖ శుక్ల ఏకాదశి: మోహిని ఏకాదశి - శ్రీహరి విశిష్ట అవతార కథ

వైశాఖ శుక్ల ఏకాదశిని మోహిని ఏకాదశి అంటారు. ఈ రోజున విష్ణువు మోహిని అవతారం గురించి పురాణ కథలు ప్రసిద్ధి చెందాయి. ఈ అవతారం ద్వారా దేవతలను రక్షించడం, అమృతం పొందడం వంటివి జరిగాయి.

Key Points

1

వైశాఖ శుక్ల ఏకాదశిని మోహిని ఏకాదశి అని పిలుస్తారు.

2

విష్ణువు మోహిని అవతారం ద్వారా దేవతలను రక్షించాడు.

4

మోహిని ఏకాదశి నాడు పూజలు చేయడం వల్ల పాపాలు నశించి మోక్షం లభిస్తుంది.

మోహిని ఏకాదశి: పవిత్రత మరియు ప్రాముఖ్యత

హిందూ మతంలో ఏకాదశి తిథికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ రోజు విష్ణుమూర్తికి అంకితం చేయబడింది. ఈ రోజున విష్ణుమూర్తిని ఆరాధిస్తే మంచిది. హిందూ క్యాలెండర్ ప్రకారం ఏకాదశి తిథి ప్రతి నెలా రెండుసార్లు వస్తుంది. ఒకటి కృష్ణ పక్షంలో, మరొకటి శుక్ల పక్షంలో.

వైశాఖ మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి తిథిని మోహినీ ఏకాదశి అంటారు. ఈ పవిత్రమైన రోజున, విష్ణువు మోహిని రూపాన్ని పూజిస్తారు. ఇలా ఆరాధించడం వల్ల సకల పాపాలు నశించి మరణానంతరం మోక్షం లభిస్తుంది. ఏకాదశి తిధి మే 07, 2025 ఉదయం 10:19 గంటలకు మొదలవుతుంది. మే 08, 2025 మధ్యాహ్నం 12:29 గంటలకు ముగుస్తుంది. ఈ లెక్కన మే 08న గురువారం నాడు జరుపుకోవాలి.

రాక్షసుల్ని అంతం చేయాలని విష్ణువు ఎప్పటికప్పుడు అనేక అవతారాలని ఎత్తాడు. కానీ శ్రీహరి అవతారాలు అన్నిట్లో మోహిని అవతారం విశిష్టమైనది. విష్ణువు అందమైన స్త్రీ అవతారాన్ని ఎత్తాడు. కానీ మహావిష్ణువు ఎందుకు మోహిని అవతారం ఎత్తాల్సి వచ్చింది అనే దాని గురించి తెలుసుకుందాం.

మోహిని అవతారం: దేవతల రక్షణ

రాక్షసులని గందరగోళానికి గురి చేయాలని విష్ణువు మోహిని అవతారం ఎత్తాడు. వాస్తవానికి సముద్రం మథనం చేస్తున్నప్పుడు అమృత కలశం కూడా వివిధ రత్నాలు, విషంతో పాటు కనుగొనబడింది. ఈ కలశాన్ని పొందడానికి దేవతలు, రాక్షసులు మధ్య భయంకరమైన యుద్ధం జరిగింది.

రాక్షసులు అమృత కలశాన్ని స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నం చేశారు. కానీ విష్ణువు సురక్షితంగా అమృత కలశాన్ని దేవతలకు అందించాడు. దీనిని సురక్షితంగా అందించడానికి మోహిని రూపాన్ని తీసుకున్నాడు. ఆ తర్వత దేవతలు శక్తి, అమరత్వాన్ని పొందారు.

విష్ణువు మోహిని అవతారానికి సంబంధించి ఇంకో కథ కూడా ఉంది. అదేంటంటే బస్మాసురుడు అనే రాక్షసుడు నుంచి దేవతల్ని రక్షించాలని శ్రీహరి మోహిని అవతారాన్ని తీసుకున్నాడట. మత విశ్వాసాల ప్రకారం, భస్మాసురుడు ఎవరి తలపై అయితే చెయ్యి వేస్తాడో వారు బూడిదగా మారతారట. విష్ణువు మోహిని అవతారం తీసుకున్నాడు. భస్మాసురుడుని నాట్యం చేయమని మోహిని అడుగుతుంది. మోహినితో నాట్యం చేయడానికి భస్మాసురుడు అంగీకరిస్తాడు.

భస్మాసురుడు వధ: మోహిని అవతార విశేషాలు

మోహిని ఎలా నాట్యం చేస్తోందో అచ్చం అలానే నాట్యం చేయడం మొదలు పెడతాడు. నాట్యం చేస్తున్నప్పుడు మోహిని తన తలపై చెయ్యి వేసుకుంటుంది. అది చూసి భస్మాసురుడు కూడా అలానే తన తలపై చెయ్యి వేసుకుంటాడు. దీనితో భస్మాసురుడు బూడిదగా మారిపోయాడు. ఇలా విష్ణువు మోహిని అవతారం ద్వారా భస్మాసురుడు నాశనం అవుతాడు.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

మోహిని ఏకాదశి పూజలతో పాపవిమోచనం, మోక్ష ప్రాప్తి లభిస్తుందని విశ్వాసం. ఈ పవిత్ర దినాన్ని భక్తి శ్రద్ధలతో జరుపుకోవడం మంచిది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.