
మహేశ్ బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న అంతర్జాతీయ స్థాయి సినిమా హైదరాబాద్లో షూటింగ్ జరుపుకుంటోంది. వారణాసి నగరాన్ని తలపించేలా భారీ సెట్స్ నిర్మించారు.
Key Points
మహేశ్ బాబు, ప్రియాంకా చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ నటన
హైదరాబాద్లో వారణాసి సెట్ నిర్మాణం – రూ.40 కోట్ల ఖర్చు
మేజర్ సన్నివేశాల చిత్రీకరణ హైదరాబాద్లోనే జరుగుతుంది
విదేశీ షెడ్యూల్లో యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ
భారీ సెట్స్ నిర్మాణం
మహేశ్బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో ఓ అంతర్జాతీయ స్థాయి సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ప్రియాంకా చో్ప్రా పృథ్వీరాజ్ సుకుమారన్ ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా కొత్త షెడ్యూల్ చిత్రీకరణ ఈ వారంలో హైదరాబాద్లో మొదలైందని సమాచారం. ఈ షెడ్యూల్ కోసం మేకర్స్ హైదరాబాద్ శివార్లలో భారీ సెట్స్ను క్రియేట్ చేశారని తెలిసిందే.
ఇందులో భాగంగా వారణాసి నగరాన్ని తలపించేలా భారీ సెట్స్ వేశారని భోగట్టా. ఈ సెట్స్కు రూ. 40 కోట్లకు పైనే అయ్యిందని టాక్. అంతేకాదు… ఈ సినిమాలోని మేజర్ సన్నివేశాల చిత్రీకరణ ఈ సెట్స్లోనే జరుగుతుందని, అందుకే ఈ స్థాయిలో ఖర్చుపెట్టారనే టాక్ వినిపిస్తోంది. ఇక ఈ షెడ్యూల్ పూర్తయిన తర్వాత టీమ్ ఫారిన్కి వెళుతుందని, అక్కడి ఫారెస్ట్ లొకేషన్స్లో యాక్షన్ సీక్వెన్స్లను ΄్లాన్ చేశారనే టాక్ వినిపిస్తోంది.
వారణాసి సెట్ విశేషాలు
విదేశీ షెడ్యూల్ వివరాలు
ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్ తర్వాత విదేశాలకు వెళ్తుంది. యాక్షన్ సన్నివేశాల కోసం విదేశీ అడవి ప్రాంతాలను ఎంచుకున్నారని సమాచారం.


