
టాలీవుడ్ స్టార్ విజయ్ దేవరకొండ మరియు నేషనల్ క్రష్ రష్మిక మందన్న మూడో సినిమాలో కలిసి నటించబోతున్నారు. రౌడీ హీరో మరియు రష్మిక జంట మరోసారి తెరపై సందడి చేయడానికి సిద్ధమవుతున్నారు.
Key Points
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న మూడో సినిమాలో కలిసి నటిస్తున్నారు.
1854-1878 బ్రిటిష్ పాలన నేపథ్యంలో కథ రూపొందుతోంది.
విజయ్ దేవరకొండ రాయలసీమ యాసలో మాట్లాడే పల్లెటూరి యువకుడిగా కనిపిస్తాడు.
యాక్షన్, ఎమోషనల్ డ్రామాతో కూడిన భారీ సినిమా ఇది.
విజయ్-రష్మిక కాంబో మరోసారి
టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్న మరోసారి వెండితెరపై సందడి చేయబోతున్నారు. తాజా సమాచారం ప్రకారం, ఈ ఇద్దరూ యంగ్ డైరెక్టర్ రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో ఓ భారీ యాక్షన్ ఎమోషనల్ డ్రామాలో నటించబోతున్నారు. ఇప్పటికే హైదరాబాద్లో మొదటి షెడ్యూల్ ప్రారంభమైందని, మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణ బాధ్యతలు తీసుకున్నారని సమాచారం.
ఈ ప్రాజెక్ట్ గురించి ఎటువంటి హడావిడి లేకుండా, ఓపెనింగ్ జరిగిపోయిందని, ఇప్పటికే షూటింగ్ కూడా మొదలైందని తెలుస్తోంది. కథ వినగానే రష్మిక వెంటనే అంగీకరించిందట. సినిమా కథకు సంబంధించి విశేషాలు కూడా ఆసక్తికరంగా మారాయి. సీనియర్ సినీ వర్గాల సమాచారం ప్రకారం, ఈ చిత్రం 1854–1878 మధ్యకాలంలో బ్రిటిష్ పాలన నేపథ్యంలో జరిగిన సంఘటనల ఆధారంగా రూపొందున్నట్టు సమాచారం. విజయ్ దేవరకొండ ఈ సినిమాలో రాయలసీమ యాసలో మాట్లాడే పల్లెటూరి యువకుడిగా కనిపించనున్నాడు. ఇది ఆయనకు పూర్తిగా కొత్త తరహా పాత్రగా ఉండనుందని తెలుస్తోంది.
బ్రిటిష్ పాలన నేపథ్యం
ఈ చిత్రంలో యాక్షన్, ఎమోషన్ సన్నివేశాలు ప్రధానంగా నిలవనున్నాయి. డైరెక్టర్ రాహుల్ సాంకృత్యాన్ ఇప్పటికే ట్యాక్సీవాలా, శ్యామ్ సింగ రాయ్ సినిమాలతో వైవిధ్యమైన సినిమాల దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు. ఇక ఇప్పుడు ఈ సినిమా కోసం కూడా ప్రత్యేకమైన స్క్రీన్ప్లే సిద్ధం చేసినట్టు సమాచారం. ఇక విజయ్, రష్మిక కాంబినేషన్ గురించి మాట్లాడితే, 2018లో వచ్చిన గీత గోవిందం సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న ఈ జంట తర్వాత డియర్ కామ్రేడ్ సినిమా చేసింది. ఆ చిత్రం విమర్శకుల ప్రశంసలు పొందినా, బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయి విజయం అందుకోలేకపోయింది. అయినప్పటికీ, విజయ్–రష్మిక మధ్య ఉన్న కెమిస్ట్రీకి అప్పట్లో మంచి మార్కులు పడ్డాయి.
రాయలసీమ యాసలో విజయ్
ఇప్పుడు మూడోసారి వీరిద్దరూ కలసి నటిస్తుండటంతో అభిమానుల్లో ఆసక్తి , అంచనాలు రెండు భారీగా పెరిగాయి. సినిమా పీరియాడికల్ బ్యాక్డ్రాప్లో ఉండటంతో పాటు, కథ, పాత్రలు, దర్శకత్వం అన్నీ కలిపి టాలీవుడ్ గర్వించదగ్గ సినిమా రాబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది. మరి ఈసినిమాపై నిజానిజాలను టీమ్ ఎప్పుడు వెల్లడిస్తారో చూడాలి. ఇప్పటికే విజయ్, రష్మికల మధ్య సమ్ థింగ్ అని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈసినిమాపై క్యారియాసిటీ జనాల్లో ఇంకాస్త ఎక్కువైపోయింది.
విజయ్ దేవరకొండ మరియు రష్మిక మందన్నల కెమిస్ట్రీని మరోసారి చూడటానికి అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రం టాలీవుడ్కు గర్వకారణం అవుతుందని భావిస్తున్నారు.

