
ప్రముఖ కొరియోగ్రాఫర్ ఆట సందీప్ జీవితంలో మరిచిపోలేని రోజును పంచుకున్నారు. మెగాస్టార్ చిరంజీవిని తన సతీమణితో కలిసి కలిసిన సందీప్, చిరంజీవి స్వయంగా కొరియోగ్రఫీ అవకాశం ఇవ్వడంతో భావోద్వేగానికి లోనయ్యారు. అది దేవుడిచ్చిన వరంగా భావిస్తున్నట్లు వెల్లడించారు.
Key Points
ప్రముఖ కొరియోగ్రాఫర్ ఆట సందీప్ తన సతీమణి జ్యోతిరాజ్తో కలిసి చిరంజీవిని కలిశారు.
చిరంజీవి స్వయంగా ఇంటికి పిలిచి కొరియోగ్రఫీ అవకాశం కల్పించారు.
ఈ అవకాశాన్ని ఆట సందీప్ దేవుడే దిగివచ్చి వరం ఇచ్చినట్లుగా భావించారు.
చిరంజీవి ఆశీర్వాదం పరమశివుడి ఆశీర్వాదంలా అనిపించిందని సందీప్ ఎమోషనల్ అయ్యారు.
సందీప్, చిరంజీవి కలయిక
టాలీవుడ్లో ప్రముఖ కొరియోగ్రాఫర్ ఆట సందీప్ పేరు తెలియనివారు ఉండరు. ప్రముఖ డ్యాన్స్ రియాలిటీ షో ‘ఆట’ ద్వారా ఫేమ్ సంపాదించారు. మొదటి సీజన్లోనే విన్నర్గా నిలిచారు . అందువల్లే అతని పేరుతోనే ఆట సందీప్గా అభిమానుల్లో ముద్ర వేసుకున్నారు. తెలుగు బిగ్ బాస్ సీజన్ -7 లోనూ కంటెస్టెంట్ గా పాల్గొన్నారు .
తాజాగా సందీప్ సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ వైరల్ గా మారింది . సందీప్ తన సతీమణి జ్యోతిరాజ్ తో కలిసి మెగాస్టార్ చిరంజీవిని కలిశారు . ఈ సందర్భంగా ఆట సందీప్ ఎమోషనల్ పోస్ట్ చేశారు . నా జీవితంలో ఇది మరచిపోలేని రోజని పోస్ట్ చేశారు . ఆ దేవుడే దిగి వచ్చి మాకు వరం ఇచ్చినట్లుగా ఉందని సంతోషం వ్యక్తం చేశారు . ఆయనే స్వయంగా ఇంటికి పిలిచి కొరియోగ్రఫీ ఛాన్స్ ఇచ్చారని సందీప్ వెల్లడించారు . ఆ క్షణం నాకు సాక్షాత్ పరమశివుడు ఆశీర్వాదం చేసినట్టుగా అనిపించిందని ఎమోషనలయ్యారు . నా హృదయమంతా ఆనందంతో నిండిపోయిందని ఇన్ స్టాలో పంచుకున్నారు .
కొరియోగ్రఫీ అవకాశం.. సందీప్ భావోద్వేగం
మెగాస్టార్ ఆశీస్సులు!
చిరంజీవి ఇచ్చిన ఈ అద్భుత అవకాశం ఆట సందీప్ హృదయాన్ని ఆనందంతో నింపింది. దేవుడి ఆశీర్వాదంగా భావిస్తున్న ఈ క్షణాన్ని జీవితాంతం గుర్తుంచుకుంటానని సందీప్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.


