
నటి అనుష్క శెట్టి తాజాగా సోషల్ మీడియా నుండి విరామం ప్రకటించారు. ‘ఘాటి’ సినిమా ఫలితాల నేపథ్యంలో ఈ నిర్ణయం అని చర్చ జరుగుతోంది. ఆమె తన భవిష్యత్ ప్రాజెక్టుల గురించి కూడా సూచించారు.
Key Points
అనుష్క శెట్టి సోషల్ మీడియాకు దూరం అంటూ ప్రకటన.
'ఘాటి' సినిమా ఫలితాల తర్వాత ఈ నిర్ణయం అని అనుమానాలు.
బ్లూ లైట్ నుంచి మూన్ లైట్ కు మారడం గురించి పేర్కొన్నారు.
త్వరలోనే కొత్త ప్రాజెక్టులతో అభిమానులను కలుస్తానని తెలిపారు.
అనుష్క శెట్టి సోషల్ మీడియా బ్రేక్
నటి అనుష్క శెట్టి తాను సోషల్ మీడియా నుంచి బ్రేక్ తీసుకుంటున్నట్లు ప్రకటించింది. శుక్రవారం (సెప్టెంబర్ 12) ఎక్స్ లో తన చేతితో రాసిన నోట్తో ఈ అనౌన్స్మెంట్ చేయడం విశేషం. ఈ మధ్యే వచ్చిన ‘ఘాటి’ సినిమా బాక్సాఫీస్ దగ్గర పెద్దగా ఆడకపోవడంతో ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్లు భావిస్తున్నారు. అనుష్క ఏం చెప్పిందో చూడండి.
అనుష్క శెట్టి తాను ఒక పేపర్పై రాసిన నోట్ నే ట్వీట్ చేసింది. అందులో ఆమె ఏం రాసిందో చూడండి. “స్క్రీన్ ప్రపంచానికి మించి నిజ జీవితానికి, అసలు పనికి తిరిగి కనెక్ట్ అవ్వడానికి” ఒక బ్రేక్ తీసుకుంటున్నట్లు రాసింది. “బ్లూ లైట్ను క్యాండిల్ లైట్తో మారుస్తున్నాను. (నవ్వుతున్న ఎమోజీ).
నేను సోషల్ మీడియా నుంచి కొంత కాలం దూరంగా ఉంటున్నాను. మనం అందరం నిజంగా ఎక్కడ మొదలుపెట్టామో ఆ ప్రపంచానికి, ఆ పనికి తిరిగి కనెక్ట్ అవ్వడానికే ఈ నిర్ణయం. త్వరలోనే మరిన్ని స్టోరీలతో, మరింత ప్రేమతో మిమ్మల్ని కలుస్తాను.. ఎప్పుడూ నవ్వుతూ ఉండండి. లవ్ అనుష్క శెట్టి” అని ఆమె రాసుకొచ్చింది.
‘ఘాటి’ సినిమా బాక్సాఫీస్ ఫలితాలు
ఆ నోట్ను షేర్ చేస్తూ అనుష్క పోస్ట్కి “లవ్.. ఎప్పుడూ ఎప్పటికీ” అని క్యాప్షన్ పెట్టింది. దీనికి ఒక అభిమాని స్పందిస్తూ.. “ఓ మై గాడ్ మీరు నిజమైన ప్రపంచానికి తిరిగి వస్తున్నారు. మిమ్మల్ని చూడటానికి వెయిట్ చేయలేకపోతున్నాను స్వీటీ” అని అన్నారు. “మీరు ఎన్నో ఎత్తుపల్లాలు చూశారు స్వీటీ. ఇది మీకు కొత్తేమీ కాదు. ఒకప్పుడు చరిత్ర సృష్టించిన లేడీ సూపర్ స్టార్ ని మళ్లీ చూడటానికి వెయిటింగ్. బ్రేక్ తీసుకోండి, మరింత స్ట్రాంగ్గా తిరిగి రండి” అని రాసి ఉంది. ఒక కామెంట్ లో, “స్వీటీ దయచేసి మీ డెడికేషన్కి తగ్గ డైరెక్టర్లతో పని చేయండి. మీరు ఎప్పటికీ బెస్ట్” అని రాసి ఉండటం విశేషం.
అనుష్క ఎంతో ఎదురుచూసిన సినిమా ‘ ఘాటి ‘ సెప్టెంబర్ 5న థియేటర్లలో రిలీజ్ అయింది. అయితే sacnilk.com ప్రకారం ఈ సినిమా తొలి వారంలో ఇండియాలో కేవలం రూ.6.64 కోట్ల నెట్ మాత్రమే సాధించింది. క్రిష్ జాగర్లమూడి రచించి, దర్శకత్వం వహించిన ‘ఘాటి’లో అనుష్కతో పాటు విక్రమ్ ప్రభు లీడ్ రోల్లో నటించారు. రాజీవ్ రెడ్డి, సాయి బాబు జాగర్లమూడి ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై ఈ సినిమాను నిర్మించారు.
అభిమానుల స్పందన
అనుష్క ఇప్పుడు రోజిన్ థామస్ కొత్త హారర్ ఫాంటసీ థ్రిల్లర్ ‘కథనార్ – ది వైల్డ్ సార్సరర్’ లో కనిపించనుంది. ఈ సినిమాతో అనుష్క మలయాళంలోకి ఎంట్రీ ఇస్తోంది. ఆమె సినిమాలో నిలా అనే ఒక నేతపని చేసే మహిళ పాత్రలో నటిస్తోంది. అనుష్కతో పాటు ఈ సినిమాలో జైసూర్య, ప్రభు దేవా, వినీత్ కూడా ముఖ్యమైన పాత్రల్లో నటించారు.
‘కథనార్ – ది వైల్డ్ సార్సరర్’ కు ఆర్.రామానంద్ కథ రాశారు. నీల్ డి’కన్హా సినిమాటోగ్రఫీ, రాహుల్ సుబ్రహ్మణ్యన్ సంగీతం అందించారు. ఈ సినిమాను శ్రీ గోకులం మూవీస్ బ్యానర్పై గోకులం గోపాలన్ నిర్మించారు.
అనుష్క శెట్టి తన సోషల్ మీడియా విరామం తర్వాత త్వరలోనే కొత్త ప్రాజెక్టులతో తిరిగి వస్తారని ఆశిద్దాం. ఆమెకు అభిమానుల నుండి మంచి మద్దతు లభిస్తోంది.


