
టాలీవుడ్ నటి రాశీ ఖన్నా తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఓ ఆసక్తికరమైన పోస్ట్ పెట్టింది. ఇతరులను కించపరచకూడదని హెచ్చరిస్తూ, దేవుడు స్క్రిప్ట్ను తిప్పగలడని ఆమె పేర్కొన్నారు. భారత సైన్యంపై తన అభిమానాన్ని కూడా ఆమె వ్యక్తం చేశారు.
Key Points
రాశీ ఖన్నా ఇన్స్టాగ్రామ్లో ఓ వైరల్ పోస్ట్ పెట్టారు.
ఇతరులను కించపరచకూడదని, దేవుడు స్క్రిప్ట్ను తిప్పగలడని ఆమె పేర్కొన్నారు.
భారత సైన్యంపై ఆమె తన అభిమానాన్ని వ్యక్తం చేశారు.
ఆమె తెలుగు సినిమాల్లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.
రాశీ ఖన్నా వైరల్ పోస్ట్
టాలీవుడ్ హీరోయిన్ రాశీ ఖన్నా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. ఈ బ్యూటీ ప్రస్తుతం జరుగుతోన్న యుద్ధం గురించి సోషల్ మీడియా వేదిక అయిన ఇన్స్టాగ్రామ్లో స్టోరీలో ‘‘ఇతరులను కించపరిచేలా ఎప్పుడూ మాట్లాడొద్దు.. దేవుడు ఎప్పుడైనా స్క్రిప్ట్ను తిప్పగలడు’’ అని రాసుకొచ్చింది.
సైన్యంపై రాశీ ఖన్నా అభిమానం
అంతేకాకుండా మరో స్టోరీలో.. ‘రాబోయే అనిశ్చితి మధ్య, మనల్ని కాపాడే సైనికులు తమ అద్భుతమైన శౌర్యాన్ని ప్రదర్శిస్తూ క్షేమంగా ఉండాలని మేము ప్రార్థిస్తున్నాం. సైన్యం, వైమానిక దళం అండ్ నావికాదళం కారణంగానే మనం ఈ ఉద్రిక్త పరిస్థితులలో మీమ్స్ని స్క్రోల్ చేస్తూ ఇక్కడ కూర్చోగలుగుతున్నాం. మేము మీకు ఎప్పటికీ కృతజ్ఞులం అండ్ మీకు మద్దతు ఇస్తున్నాం జై హింద్’ అని వ్యాఖ్యలు జోడించింది.
రాశీ ఖన్నా సినిమా జీవితం
ఇకపోతే ఈ బ్యూటీ తెలుగులో అనేక చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటోన్న విషయం తెలిసిందే. బెంగాల్ టైగర్, సుప్రీమ్, జై లవ కుశ, తొలి ప్రేమ, ఇమైక్కా నొడిగల్, వెంకీమామ, ప్రతి రోజు పండగే, సర్దార్, తిరుచిత్రంబాలం వంటి బ్లాక్ బస్టర్ చిత్రాల్లో అగ్ర హీరోల సినిమాల్లో నటించి మెప్పించింది. అంతేకాకుండా ఈ అమ్మడు పలు భాషల్లో సాంగ్స్ కూడా పాడింది. కానీ కెరీర్ స్టార్టింగ్కు ఇప్పుటికీ రాశీ ఖన్నాకు అవకాశాలు తగ్గుముఖం పట్టాయని చెప్పుకోవచ్చు.
రాశీ ఖన్నా సోషల్ మీడియా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. ఆమె సందేశం చాలా మందికి స్ఫూర్తినిచ్చింది. ఆమె తెలుగు సినీ ప్రేక్షకులకు సుపరిచితం.


