|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Adarsha Kutumbam: వెంకీ మామ జెట్ స్పీడ్! త్రివిక్రమ్ డైరెక్షన్, మే లోనే షూటింగ్ పూర్తి! రిలీజ్ ఎప్పుడో?

Published: 10-01-2026, 5:00 AM
Adarsha Kutumbam: వెంకీ మామ జెట్ స్పీడ్! త్రివిక్రమ్ డైరెక్షన్, మే లోనే షూటింగ్ పూర్తి! రిలీజ్ ఎప్పుడో?
  • వెంకటేష్, త్రివిక్రమ్ కాంబినేషన్లో ‘ఆదర్శ కుటుంబం’ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది – మే నెలలో పూర్తి చేసే అవకాశం!
  • దర్శకుడు త్రివిక్రమ్ సినిమాను సమ్మర్ లో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు – అభిమానులకు ఇది నిజంగా గుడ్ న్యూస్!
  • ఈ సినిమా కోసం చాలా కాలంగా ఎదురు చూస్తున్న అభిమానులు – విడుదల తేదీ కోసం ఆసక్తిగా నిరీక్షణ!
  • వెంకటేష్, త్రివిక్రమ్ గతంలో నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి వంటి సూపర్ హిట్ సినిమాలు అందించారు – మరో హిట్ కోసం ఎదురుచూపులు!

టాలీవుడ్ లో మోస్ట్ క్రేజీ కాంబో అంటే వెంకటేష్, త్రివిక్రమ్ లదే. వీరిద్దరూ కలిసి ‘ఆదర్శ కుటుంబం’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సినిమా షూటింగ్ జెట్ స్పీడ్ లో జరుగుతోంది. మే నెలలో షూటింగ్ పూర్తి కానుండటంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

జెట్ స్పీడ్ లో షూటింగ్ పూర్తి చేసేలా ప్లాన్!

Adarsha Kutumbam: టాలీవుడ్ లో ఈ మధ్య కాలంలో సెట్ అయిన క్రేజీ కాంబో అంటే విక్టరీ వెంకటేష్ అండ్ దర్శకుడు త్రివిక్రమ్ కాంబో అనే చెప్పాలి. చాలా కాలం నుంచి ఈ ఇద్దరు కలిసి ఒక సినిమా చేస్తున్నారు అంటూ వార్తలు వైరల్ అవుతూనే ఉన్నాయి. నిజానికి, ఆడియన్స్ కూడా చాలా కాలంగా ఈ కాంబోలో సినిమా కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. దానికి, కారణం గతంలో ఈ ఇద్దరు కలిసి చేసిన సినిమాలే.

విక్టరీ వెంకటేష్ హీరోగా వచ్చిన నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి లాంటి సినిమాలకు కథ మాటలు అందించాడు త్రివిక్రమ్. కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమాలు సూపర్ సక్సెస్ సాధించాయి. ఇప్పటికే, టీవీలో వచ్చినా మిస్ చేయకుండా చూసేవాళ్లు చాలా మందే ఉన్నారు. అందుకే, వెంకటేష్-త్రివిక్రమ్ కాంబోకి ఆ రేంజ్ లో డిమాండ్ ఏర్పడింది.

సమ్మర్ లోనే విడుదల చేసేందుకు సన్నాహాలు!

ఎట్టకేలకు, చాలా ఏళ్ళ గ్యాప్ తరువాత ఈ ఇద్దరు కలిసి సినిమా చేసేందుకు సిద్ధం అయ్యారు. అదే ‘ఆదర్శ కుటుంబం Ak47(Adarsha Kutumbam)’. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ కూడా స్తారట అయ్యింది. అయితే, తాజాగా ఈ సినిమా గురించి వినిపిస్తున్న న్యూస్ ఏంటంటే.. ఆదర్శ కుటుంబం సినిమాను జెట్ స్పీడ్ లో ఫినిష్ చేయాలని ప్లాన్ చేస్తున్నాడట దర్శకుడు త్రివిక్రమ్.

వెంకటేష్-త్రివిక్రమ్ కాంబోకి భారీ డిమాండ్!

అది కూడా మే వరకు కంప్లేట్ చేయాలని పక్కా ప్లాన్ వేసుకున్నాడట. అందుకు తగ్గట్టుగానే షూటింగ్ ను ఉరకలెత్తిస్తున్నాడట. అలాగే, సమ్మర్ లోనే సినిమాను కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నాడట. దీంతో, ఈ సినిమా కోసం చూస్తున్న ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నిజానికి, త్రివిక్రమ్ కి షూటింగ్ చాలా ఆలస్యం చేస్తాడు అనే బ్యాడ్ నేమ్ ఉంది. ఆ టాక్ ను ఈ సినిమాతో చెరిపేయాలని, అలాగే గుంటూరు కారం సినిమాతో వచ్చిన నెగిటివిటీను కూడా తుడిచేయాలని ప్లే చేస్తున్నాడట.

వెంకటేష్, త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. షూటింగ్ కూడా వేగంగా జరుగుతోంది. త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తారు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.