|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

అడవి పిలిచింది!

Published: 30-04-2025, 6:10 PM
అడవి పిలిచింది!

‘అడవి పిలిచింది!’ అంటూ తమన్నా సిద్ధార్థ్ మల్హోత్రాతో కలిసి నటిస్తున్న ‘వ్వాన్: ఫోర్స్ ఆఫ్ ది ఫారెస్ట్’ సినిమా ప్రీ టీజర్ విడుదలైంది. అడవి నేపథ్యంలో చిత్రీకరించిన ఈ మైథలాజికల్ మూవీ 2026లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

Key Points

1

తమన్నా 'వ్వాన్: ఫోర్స్ ఆఫ్ ది ఫారెస్ట్' సినిమాలో నటిస్తున్నారు.

2

రాత్రి వేళ అడవిలో దీపం వెలిగించే తమన్నా ప్రీ టీజర్ విడుదలైంది.

4

బాలాజీ మోషన్ పిక్చర్స్, ది వైరల్ ఫీవర్ మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

తమన్నా ‘వ్వాన్’ లో!

‘అడవి పిలిచింది… నేను సమాధానం చెప్పాను’ అని అంటున్నారు హీరోయిన్‌ తమన్నా. సిద్ధార్థ్‌ మల్హోత్రా హీరోగా అరుణభ్‌ కుమార్‌–దీపక్‌ మిశ్రా దర్శకత్వంలో ‘వ్వాన్‌: ఫోర్స్‌ ఆఫ్‌ ది ఫారెస్ట్‌’ అనే మైథలాజికల్‌ మూవీ తెరకెక్కుతోంది. బాలాజీ మోషన్‌ పిక్చర్స్, ది వైరల్‌ ఫీవర్‌ మోషన్‌ పిక్చర్స్‌ సంస్థలు ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ఈ సినిమాలో తమన్నా నటిస్తున్నట్లుగా వెల్లడించి, ఆమెపాత్ర తాలూకు ప్రీ టీజర్‌ను మేకర్స్‌ విడుదల చేశారు.

రాత్రి వేళ ఎర్రటి చీర ధరించిన తమన్నా కారు దిగి, అడవిలోకి వెళ్లి, అక్కడ ఓ దీపం వెలిగించడం, అక్కడ ఏదో దృశ్యాన్ని చూసి కళ్లు పెద్దవి చేయడం వంటి విజువల్స్‌ ఈ వీడియోలో కనిపించాయి. ‘‘అడవి పిలిచింది. నేను సమాధానం చెప్పాను. ‘వ్వాన్‌’లో భాగం కావడం థ్రిల్లింగ్‌గా ఉంది’’ అంటూ ‘ఎక్స్‌’లో పేర్కొన్నారు తమన్నా. ఈ సినిమా  2026లో విడుదల కానుంది.

అడవి నేపథ్యం

2026 విడుదల

తమన్నా నటనతో ‘వ్వాన్’ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలతో నిండి ఉంటుందని అంచనాలు ఉన్నాయి. 2026 లో విడుదల కానున్న ఈ చిత్రంపై అంచనాలు పెరుగుతున్నాయి.

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.