
📌 Key Points
- ఆదిలాబాద్లో భారీ ఎయిర్పోర్ట్ నిర్మాణానికి కేంద్రం సన్నాహాలు చేస్తోంది.
- మామునూరు విమానాశ్రయానికి మూడు నెలల్లో శంకుస్థాపన చేయనున్నారు.
- రక్షణ శాఖ 300 ఎకరాల భూమిని సివిల్ ఏవియేషన్తో కలిసి వినియోగించడానికి సిద్ధంగా ఉంది.
- ఆదిలాబాద్ ఎయిర్పోర్టుకు తెలంగాణ ప్రభుత్వం 450 ఎకరాలు ఇవ్వాల్సి ఉంది.
ఆదిలాబాద్లో భారీ ఎయిర్పోర్ట్ నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. మామునూరు విమానాశ్రయానికి మూడు నెలల్లో శంకుస్థాపన చేయనున్నట్లు కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. దీనికి సంబంధించిన భూసేకరణ ప్రక్రియ కూడా వేగవంతం కానుంది.
మామునూరు ఎయిర్పోర్ట్ శంకుస్థాపనకు సన్నాహాలు
కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ను అశ్వినీ వైష్ణవ్, కిషన్ రెడ్డితో కలిసి విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు సమావేశమయ్యారు. ఆ తర్వాత ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. దేశంలో ఎయిర్పోర్టుల ఏర్పాటుకు సంబంధించి.. అన్ని డిమాండ్లను పరిశీలిస్తున్నట్టుగా రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఫీజబులిటీ ఉన్న చోట ఎయిర్పోర్టులను నిర్మించేందుకు సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. మామునూరు ఎయిర్పోర్టుకు మరో మూడు నెలల్లో శంకుస్థాపనం చేయాలని అనుకుంటున్నామన్నారు.
ఆదిలాబాద్, కొత్తగూడెం ఎయిర్పోర్టు ప్రతిపాదనలను పరిశీలిస్తున్నట్టుగా రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. ఆదిలాబాద్లో ఎయిర్పోర్టు అంశం మీద కూడా తాజాగా కీలక చర్చ చేసినట్టుగా తెలిపారు. ఆదిలాబాద్లో అతిపెద్ద ఎయిర్పోర్ట్ నిర్మించాలని అనుకుంటున్నట్టుగా పేర్కొన్నారు. ఈ మేరకు కేంద్రం ప్రణాళికలు వేస్తోందన్నారు.
ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్కు కేంద్రం ప్రతిపాదనలు
‘ఆదిలాబాద్లో రక్షణ శాఖకు 300 ఎకరాల భూమి ఉంది. సివిల్ ఏవియేషన్తో కలిసి జాయింట్ వెంచర్కు సిద్ధంగా ఉన్నామని రక్షణ శాఖ వెల్లడించింది. సైన్యానికి శిక్షణతోపాటుగా సివిల్ ఏవియేషన్ అవసరాల కోసం వాడాలని రక్షణ మంత్రి వెల్లడించారు. ఈ నెల 17న క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్లాలని అధికారులు నిర్ణయించారు.’ అని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు.
ఆదిలాబాద్ ఎయిర్పోర్టుకు తెలంగాణ ప్రభుత్వం 450 ఎకరాలు ఇవ్వాల్సి ఉంటుందని రామ్మోహన్ నాయుడు చెప్పారు. భూసేకరణకు ఎలాంటి సమస్యలు లేవని ఆదిలాబాద్ నేతలు చెబుతున్నట్టుగా తెలిపారు. ఎయిర్పోర్టుకు కావాల్సిన అన్ని పాటిబులిటీస్ ఆదిలాబాద్కు ఉన్నాయన్నారు. పెద్దపల్లి జిల్లా అంతర్గాం దగ్గర ఎయిర్పోర్ట్ ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వం పంపించిన విషయాన్ని రామ్మోహన్నాయుడు గుర్తు చేశారు.
భూసేకరణపై రామ్మోహన్ నాయుడు ప్రకటన
‘ఆదిలాబాద్లో పెద్ద ఎయిర్పోర్ట్ నిర్మించాలని కేంద్రం భావిస్తోంది. సైనిక, పౌరుల అవసరాలకు అనుగుణంగా ఈ ఎయిర్పోర్ట్ ఉండనుంది. ఇందుకు సివిల్ ఏవియేషన్తో కలిసి పని చేయడానికి సిద్ధంగా ఉన్నాం.’ అని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు చెప్పారు.
కేంద్ర ప్రభుత్వం ఆదిలాబాద్లో పెద్ద ఎయిర్పోర్ట్ నిర్మించాలని భావిస్తోంది. సైనిక మరియు పౌర అవసరాలకు అనుగుణంగా ఈ ఎయిర్పోర్ట్ ఉండనుంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.


