
📌 Key Points
- గ్యాస్ సిలిండర్ బుకింగ్ చేసిన రెండున్నర రోజుల్లో డెలివరీ
- దేశీయ అవసరాల కోసం ఎల్పీజీ ఉత్పత్తిని 25% పెంచిన కేంద్రం
- హార్ముజ్ జలసంధిలో సమస్యలున్నా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు పూర్తి
- దేశంలో ఇంధన నిల్వల కొరత లేదని కేంద్రం భరోసా
దేశవ్యాప్తంగా వంట గ్యాస్ సిలిండర్ల కొరతపై వస్తున్న వార్తలకు కేంద్రం స్పందించింది. సామాన్యులకు ఊరటనిస్తూ గ్యాస్ సరఫరా, డెలివరీ విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇకపై సిలిండర్ కోసం ఎక్కువ రోజులు వేచి ఉండాల్సిన అవసరం లేదు.
రెండున్నర రోజుల్లో సిలిండర్ డెలివరీ
దేశవ్యాప్తంగా వంట గ్యాస్ సిలిండర్ల కొరతపై వస్తున్న వార్తలకు కేంద్ర ప్రభుత్వం తెరదించింది. సామాన్యులకు ఊరటనిస్తూ గ్యాస్ సరఫరా, డెలివరీ విషయంలో కీలక నిర్ణయాలను ప్రకటించింది. ఇకపై సిలిండర్ కోసం వారాల తరబడి వేచి చూడాల్సిన అవసరం లేదని, బుకింగ్ చేసిన రెండున్నర రోజుల్లోనే సిలిండర్ ఇంటికి చేరుతుందని స్పష్టం చేసింది. అయితే, దేశీయ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఎల్పీజీ (LPG) ఉత్పత్తిని ఏకంగా 25 శాతం పెంచినట్లుగా కేంద్రం వెల్లడించింది. దీంతొ సరఫరాలో ఎటువంటి అంతరాయం కలగదని పేర్కొంది.
అంతర్జాతీయ ఉద్రిక్తతల వల్ల హార్ముజ్ జలసంధి (Strait of Hormuz) గుండా చమురు రవాణాకు ఇబ్బందులు ఎదురవుతున్న నేపథ్యంలో, ప్రభుత్వం అప్రమత్తమైంది. ఆ మార్గంతో సంబంధం లేని ప్రత్యామ్నాయ రూట్ల ద్వారా చమురు దిగుమతులు చేసుకునేలా ఏర్పాట్లు పూర్తి చేసింది. హార్ముజ్ మార్గంలో నిలిచిపోయిన సప్లయ్ కంటే కూడా ఎక్కువ మొత్తంలోనే ఇతర వనరుల నుండి చమురును సేకరించామని ప్రభుత్వం పేర్కొంది. తద్వారా దేశంలో ఇంధన నిల్వలకు ఎటువంటి కొరత లేదని భరోసానిచ్చింది. తాజాగా కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో గ్యాస్ ఏజెన్సీల చుట్టూ తిరిగే తిప్పలు తప్పనున్నాయి. ముఖ్యంగా పండుగలు, శుభకార్యాల సమయంలో సిలిండర్ల కొరత లేకుండా వేగవంతమైన సేవలు అందుతాయని వినియోగదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
25 శాతం పెరిగిన ఎల్పీజీ ఉత్పత్తి
చమురు దిగుమతుల్లో ప్రత్యామ్నాయ మార్గాలు
కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం సామాన్యులకు ఊరటనిచ్చే అంశం. గ్యాస్ ఏజెన్సీల చుట్టూ తిరిగే అవసరం లేకుండా, వేగంగా సిలిండర్లను పొందవచ్చు. పండుగలు, ప్రత్యేక సందర్భాల్లో ఇది మరింత ఉపయోగకరంగా ఉంటుంది.


