|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

కాశీలో అఖండ-2 మేనియా: బాలయ్య, బోయపాటి కీలక ప్రకటన!

Published: 18-12-2025, 8:04 PM
కాశీలో అఖండ-2 మేనియా: బాలయ్య, బోయపాటి కీలక ప్రకటన!
  • అఖండ-2 సినిమాకు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన.
  • సనాతన ధర్మ పరిరక్షణ అంశంపై సినిమాలో ప్రధాన చర్చ జరుగుతోంది.
  • నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాశీ విశ్వనాథుడిని దర్శించుకున్నారు.
  • శుక్రవారం కాశీలో అఖండ-2 టీమ్ కీలక ప్రెస్ మీట్ ఏర్పాటు.

నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీనుల ‘అఖండ-2’ తాండవం సినిమా బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధిస్తోంది. సనాతన ధర్మం అంశంతో ప్రేక్షకుల ప్రశంసలు పొందిన ఈ చిత్రం టీం ప్రస్తుతం కాశీలో ఉంది. బాలయ్య, బోయపాటి ప్రెస్ మీట్ ద్వారా కీలక విషయాలు వెల్లడించనున్నారు.

అఖండ-2 తాండవం: బాక్సాఫీస్ వద్ద విజయం

బోయపాటి శ్రీను, గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణల క్రేజీ కాంబినేషన్లో రీసెంట్ గా విడుదలైన అఖండ-2 తాండవం సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమాలో సనాతన ధర్మ పరిరక్షణ అంశాన్ని చూపించడంతో దీనిపైనే ప్రధాన చర్చ జరుగుతోంది. ఇక మౌత్ టాక్ తోనే ప్రేక్షకులు థియేటర్లకు వస్తుండటంతో చిత్రబృందం సంతోషం వ్యక్తం చేసింది. తాజాగా బాలయ్య, బోయపాటి కాశీకి వెళ్లినట్లు తెలుస్తోంది.

అఖండ-2కి మంచి రెస్పాన్స్ రావడంతో కాశీ విశ్వనాథుడిని దర్శించుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం అక్కడే ఉన్న వీరిద్దరూ.. శుక్రవారం.. స్థానికంగా ప్రెస్ మీట్ పెట్టి.. సినిమాపై మీడియాతో ముచ్చటించనున్నట్లు ఇండస్ట్రీ వర్గాలు తెలిపాయి. సినిమా విషయానికొస్తే బాలయ్య కూతురిగా హర్షాలీ మల్హోత్రా నటించగా.. సంయుక్త మీనన్ కీలకపాత్ర పోషించింది. థమన్ అందించిన సంగీతం, బ్యాగ్రౌండ్ మ్యూజిక్ సినిమాకు హైలెట్ గా నిలిచాయి.

కాశీలో బాలయ్య, బోయపాటి సందడి

శుక్రవారం ప్రెస్ మీట్ లో ఏం చెబుతారు?

అఖండ-2 విజయాన్ని పురస్కరించుకుని కాశీలో బాలయ్య, బోయపాటి పర్యటన సినీ వర్గాల్లో ఆసక్తిని రేపుతోంది. శుక్రవారం జరగనున్న ప్రెస్ మీట్ లో సినిమా తదుపరి ప్రయాణంపై మరిన్ని వివరాలు వెలువడే అవకాశం ఉంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.