
📌 Key Points
- అఖండ 2 విడుదల ముందు తెలంగాణ హైకోర్టులో కొత్త కేసు. ఇది వరుస అడ్డంకులకు కారణమవుతోంది.
- సినిమా టికెట్ల ధరల పెంపుపై న్యాయవాది శ్రీనివాసరెడ్డి లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు.
- తెలంగాణలో ప్రీమియర్ టికెట్లు రూ.600కు పెరిగిన ధరలపై అభ్యంతరం వ్యక్తం అవుతోంది.
- పెంచిన ధరల్లో 20% సినీ కార్మికుల సంక్షేమానికి కేటాయించాలనే షరతు ఉంది.
అఖండ 2 సినిమాకు వరుస అడ్డంకులు ఎదురవుతున్నాయి. విడుదల తేదీ వాయిదాల అనంతరం, ఇప్పుడు టికెట్ల ధరల పెంపుపై తెలంగాణ హైకోర్టులో కొత్త పిటిషన్ దాఖలైంది. దీనిపై హైకోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందోనని చిత్రబృందం, అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.
టికెట్ల ధరల పెంపుపై లంచ్ మోషన్ పిటిషన్
Akhanda 2: అఖండ 2 సినిమా విడుదల ముహూర్తం ఏ రోజు ప్రకటించారో తెలియదు కానీ అప్పటినుంచి వరుసగా అడ్డంకులు ఎదురవుతూనే ఉన్నాయి. నిజానికి ఈ సినిమా సెప్టెంబర్ 5వ తేదీ విడుదల కావాలి కానీ అప్పుడు పవన్ కళ్యాణ్ సినిమా విడుదలవుతున్న నేపథ్యంలో డిసెంబర్ 5వ తేదీ విడుదలకు సిద్ధమైంది. ఈ సినిమా డిసెంబర్ 5న విడుదలకు కొన్ని గంటల ముందు వాయిదా పడుతూ డిసెంబర్ 12న విడుదలకు సిద్ధమైంది. మరికొన్ని గంటలలో ఈ సినిమా ప్రీమియర్ ప్రసారం కాబోతున్న నేపథ్యంలో ఈ సినిమాకు మరొక అడ్డంకి ఎదురైంది.
తాజాగా ఈ సినిమా టికెట్ల ధరల పెంపు విషయంలో తెలంగాణ హైకోర్టులో న్యాయవాది శ్రీనివాసరెడ్డి లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఇటీవల కాలంలో ప్రతి సినిమాకు ప్రభుత్వాలు టికెట్ల ధరలను పెంచుతూ ఉత్తర్వులు జారీ చేస్తున్న సంగతి తెలిసిందే . అయితే ఆఖండ 2 సినిమాకి కూడా తెలంగాణ ప్రభుత్వం కూడా టికెట్ల ధరలను పెంచుతూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సినిమా ప్రీమియర్లకు 600 రూపాయలు చొప్పున టికెట్ ధరలు ఉన్నాయి. ఈనెల 12 నుంచి 14వ తేదీ వరకు టికెట్ల ధరలు పెంచుకోవచ్చని అనుమతి తెలిపారు. మల్టీప్లెక్స్ లలో 100 రూపాయలు సింగిల్ స్క్రీన్ థియేటర్లలో 50 రూపాయలు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే.
తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు, షరతులు
ఇలా సినిమా టికెట్ల ధరలను పెంచుతూ తెలంగాణ సర్కార్ మరొక కండిషన్ కూడా పెట్టారు. ఈ సినిమా టికెట్ల ధరలు పెంచడం వల్ల వచ్చే లాభాలలో 20% సినీ కార్మికుల సంక్షేమానికి కేటాయించాలని షరతులు పెట్టారు. ఇంతవరకు బానే ఉన్నప్పటికీ తాజాగా న్యాయవాది శ్రీనివాస్ రెడ్డి టికెట్ ధరల పెంచడం గురించి కోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో ఈ సినిమాకు మరొక అడ్డంకి తలెత్తిందని చెప్పాలి. మరి ఈ పిటిషన్ విచారణ అనంతరం తెలంగాణ హైకోర్టు సినిమా టికెట్ల ధరలపై ఎలాంటి తీర్పు వెల్లడిస్తుందో తెలియాల్సి ఉంది.
ఆంధ్రాలో కూడా పెరిగిన టికెట్ ధరలు..
ఆంధ్రాలోనూ పెరిగిన టికెట్ల ధరల పరిస్థితి
అఖండ సినిమాకు ఆంధ్రాలో కూడా టికెట్ల ధరలను పెంచిన సంగతి తెలిసిందే. ఇక్కడ సింగిల్ స్క్రీన్ థియేటర్లలో 75 రూపాయలు మల్టీప్లెక్స్ లలో ₹100 పెంచుతూ ఉత్తర్వులు జారీ చేశారు అయితే పెంచిన ధరలు 10 రోజులపాటు అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఇక ప్రీమియర్లకు 600 రూపాయలు చొప్పున ఏపీ ప్రభుత్వం కూడా అనుమతి తెలిపింది.. ఇలా రెండు తెలుగు రాష్ట్రాలు ఈ సినిమా టికెట్ల ధరలు పెంచడానికి అనుమతి తెలిపాయి కానీ తెలంగాణలో మాత్రం పెంచిన టికెట్ల ధరలకు ఇలా అడ్డంకి ఏర్పడటంతో అభిమానులు షాక్ అవుతున్నారు. మరి న్యాయవాది శ్రీనివాస్ రెడ్డి పిటిషన్ పై కోర్ట్ తీర్పు ఏంటో తెలియాల్సి ఉంది.
అఖండ 2 సినిమాకు తెలంగాణలో టికెట్ల ధరల పెంపుపై అడ్డంకి ఏర్పడటం అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసింది. హైకోర్టు నిర్ణయం ఈ సినిమా విడుదల, వసూళ్లపై ప్రభావం చూపే అవకాశం ఉంది. తదుపరి తీర్పు కోసం అందరూ వేచి చూస్తున్నారు.


