
📌 Key Points
- అక్షయ్ ఖన్నా ఒకే ఏడాదిలో రూ.2000 కోట్లు వసూలు చేసి అరుదైన రికార్డు సృష్టించారు.
- విలన్ పాత్రలు పోషించి ఈ ఘనత సాధించిన అక్షయ్ ఖన్నా షారుక్ ఖాన్ తర్వాత రెండో నటుడు.
- 2025లో ఛావా, ధురంధర్ చిత్రాలతో అక్షయ్ ఖన్నా ఈ భారీ వసూళ్లు రాబట్టారు.
- ప్రభాస్ (బాహుబలి 2), అల్లు అర్జున్ (పుష్ప 2) రూ.1700 కోట్లతో ఈ రికార్డుకు దగ్గరగా వచ్చి ఆగారు.
సినిమాల్లో విలన్గా అలరిస్తూనే, బాక్సాఫీస్ వద్ద రూ.2000 కోట్ల సంచలన వసూళ్లను సాధించి అక్షయ్ ఖన్నా రికార్డు సృష్టించారు. ప్రభాస్, అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోలు కూడా అందుకోలేని ఈ అరుదైన ఘనతతో ఆయన వార్తల్లో నిలిచారు.
అక్షయ్ ఖన్నా విలన్ నుంచి హీరోగా ఎలా?
సినిమాల్లో విలన్ క్యారెక్టర్లతో అదరగొడుతున్న ధురంధర్ నటుడు అక్షయ్ ఖన్నా, కలెక్షన్లలో కొత్త రికార్డులతో హీరో అనిపించుకుంటున్నాడు. ఒక ఏడాది కాలంలో తను నటించిన సినిమాలతో రూ.2000 కోట్ల వసూళ్లు రాబట్టిన రెండో నటుడిగా నిలిచాడు. అతని కంటే ముందు షారుక్ ఉన్నాడు. ప్రభాస్, అల్లు అర్జున్ కు ఈ రికార్డు అందలేదు.
రూ.2000 కోట్ల క్లబ్లో చేరిన రెండో నటుడు
సినీ పరిశ్రమలో అక్షయ్ ఖన్నాకు మూడు దశాబ్దాల అనుభవం ఉంది. కానీ 2025 ను మాత్రం అక్షయ్ ఖన్నా సంవత్సరం అని పిలవడం అతిశయోక్తి కాదు. 2025లో ఈ నటుడు ఛావా, ధురంధర్ రెండు చిత్రాలలో విలన్ గా నటించాడు. ఆ చిత్రాలు ఈ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన హిందీ చిత్రాలుగా నిలిచాయి. విమర్శకుల ప్రశంసలతో పాటు, అక్షయ్ ఒక గొప్ప ప్రజాదరణ మైలురాయిని కూడా అధిగమించాడు.
ప్రభాస్, అల్లు అర్జున్కు సాధ్యం కాని రికార్డు
మరోవైపు ప్రభాస్, అల్లు అర్జున్ ఈ రికార్డుకు చేరువగా వచ్చి ఆగిపోయారు. ప్రభాస్ హీరోగా వచ్చిన బాహుబలి 2, అల్లు అర్జున్ లీడ్ రోల్ ప్లే చేసిన పుష్ప 2 ఒక్కొక్కటి రూ.1700 కోట్లకు పైగా వసూలు చేశాయి.
విలన్గా నటించి రూ.2000 కోట్ల మైలురాయిని అధిగమించడం అక్షయ్ ఖన్నాకు విశేషమైన విజయం. ఈ రికార్డు ఆయనకు ప్రత్యేక గుర్తింపునివ్వడమే కాకుండా, సినీ పరిశ్రమలో కొత్త బెంచ్మార్క్ను నెలకొల్పింది.


