|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Allu Aravind: ‘ఏకపక్ష నిర్ణయం సరికాదు.. ఆ నలుగురిలో నేను లేను’

Published: 25-05-2025, 8:41 AM
Allu Aravind: 'ఏకపక్ష నిర్ణయం సరికాదు.. ఆ నలుగురిలో నేను లేను'

సినిమా థియేటర్ల మూసివేతపై టాలీవుడ్ నిర్మాత అల్లు అరవింద్ స్పందిస్తూ, ఈ నిర్ణయం ఏకపక్షమని అన్నారు. తనకు తక్కువ సంఖ్యలో థియేటర్లు మాత్రమే ఉన్నాయని వివరించారు. ‘ఆ నలుగురు’ అనే వార్తలపై కూడా స్పష్టతనిచ్చారు.

Key Points

1

అల్లు అరవింద్ థియేటర్ల మూసివేతను ఏకపక్ష నిర్ణయంగా పేర్కొన్నారు.

2

తెలుగు రాష్ట్రాల్లో తనకు పరిమిత సంఖ్యలోనే థియేటర్లు ఉన్నాయని వివరించారు.

4

‘ఆ నలుగురి’లో తాను లేనని స్పష్టం చేశారు.

థియేటర్ల మూసివేతపై అల్లు అరవింద్ ఆందోళన

సినిమా థియేటర్ల వివాదంపై టాలీవుడ్ నిర్మాత అల్లు అరవింద్ స్పందించారు. థియేటర్ల మూసివేత అనేది ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయమన్నారు. ఏపీలో 1500 థియేటర్లు ఉంటే తనవి కేవలం 15 మాత్రమే ఉన్నాయని తెలిపారు. తెలంగాణలో తనకు కేవలం ఒక్క థియేటర్‌ మాత్రమే ఉందన్నారు. స్టాండ్‌ అలోన్ థియేటర్లకు సమస్యలు ఉన్న మాట వాస్తవమేనని అల్లు అరవింద్ అన్నారు. ఇలాంటి నిర్ణయాలు తీసుకునేముందు కూర్చుని మాట్లాడుకోవాలని.. ఏకపక్షంగా వెళ్లడం సరికాదన్నారు.

అల్లు అరవింద్ మాట్లాడుతూ..’రెండు రోజుల నుంచి ఆ నలుగురు అనే వార్తలు వస్తున్నాయి. ఆ నలుగురిలో నేను లేను.  ఆ నలుగురు  అనేది 10 సంవత్సరాలక్రితం ఇప్పుడు 10 మంది పైనే ఉ‍న్నారు.   తెలంగాణలో నాకు ఉన్న ఒక్క థియేటర్ ట్రిపుల్ ఏ సినిమాస్ మాత్రమే. ఏపీలో కూడా 15 థియేటర్ల లోపు మాత్రమే నా దగ్గర ఉన్నాయి. థియేటర్లకు సంబంధించి జరిగిన మూడు సమావేశాలకు నేను వెళ్లలేదు. దయచేసి ఆ నలుగురిలో నన్ను కలపకండి.’ అని అన్నారు.

తనకున్న థియేటర్ల సంఖ్యను వెల్లడించారు

‘ఆ నలుగురు’ వ్యవహారంపై స్పష్టీకరణ

చివరగా, అల్లు అరవింద్ తనకు తక్కువ థియేటర్లు మాత్రమే ఉన్నాయని, ఈ వివాదంలో తన పాత్ర లేదని స్పష్టం చేశారు. ఏకపక్ష నిర్ణయాలకు వ్యతిరేకంగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.