
ఇండియా జాయ్ 2025లో జరిగిన ఓటీటీ పల్స్ 2025 కార్యక్రమంలో అమెజాన్ ప్రైమ్ వీడియో సౌత్ హెడ్ పద్మ కస్తూరిరంగన్ కీలక విషయాలు పంచుకున్నారు. ప్రాంతీయ కథలకు ప్రాముఖ్యతనివ్వడం, కొత్త ప్రతిభను ప్రోత్సహించడం, సరిహద్దులు లేని వినోదాన్ని అందించడమే తమ లక్ష్యమని ఆమె స్పష్టం చేశారు.
Key Points
ఇండియా జాయ్ 2025లో ఓటీటీ పల్స్ 2025 చర్చా కార్యక్రమం ఘనంగా జరిగింది.
అమెజాన్ ప్రైమ్ వీడియో సౌత్ హెడ్ పద్మ కస్తూరిరంగన్ ఇందులో పాల్గొని మాట్లాడారు.
ప్రామాణికమైన ప్రాంతీయ కథల (తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం) నిర్మాణమే ప్రైమ్ లక్ష్యం.
గొప్ప కథలకు సరిహద్దులు లేవని, కొత్త ప్రతిభను ప్రోత్సహిస్తామని ఆమె అన్నారు.
ఇండియా జాయ్ 2025: ఓటీటీ పల్స్ చర్చ
ఇండియా జాయ్ 2025 సంత్సరానికి సంబంధించిన 8వ ఎడిషన్ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఇందులో ఓటీటీ పల్స్ 2025 చర్చ జరిగింది. ఈ కార్యక్రమంలో అమెజాన్ ప్రైమ్ వీడియో ఒరిజినల్స్ సౌత్ హెడ్ పద్మ కస్తూరిరంగన్ పాల్గొన్నారు. వారి ఫోకస్ ఎలాంటి కథలను నిర్మించడంపై ఉందో ఆమె తెలిపారు.
ఇండియా జాయ్ 2025 8వ ఎడిషన్ యానిమేషన్, వీఎఫ్ఎక్స్, గేమింగ్, కామిక్స్ (AVGC) రంగాలలో సృజనాత్మకత, ఆవిష్కరణ, సాంకేతికతకు సంబంధించిన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సంవత్సరం ప్రధాన ముఖ్యాంశాలలో ఓటీటీ పల్స్ 2025 ఉంది. ఇది డిజిటల్ యుగంలో ప్రాంతీయ కథల భవిష్యత్తును చర్చించడానికి భారతదేశ ఓటీటీ, వినోద పరిశ్రమ నుంచి అగ్ర తారలను ఒకచోట చేర్చింది.
పద్మ కస్తూరిరంగన్: ప్రాంతీయ కథలపై ప్రైమ్ ఫోకస్
తమిళం, తెలుగు, కన్నడ, మలయాళ భాషల సాంస్కృతిక గొప్పతనాన్ని ప్రతిబింబించే ప్రామాణిక కథలను రూపొందించడంపై ప్రైమ్ వీడియో దృష్టి పెట్టడం గురించి కూడా ఆమె మాట్లాడారు.
అమెజాన్ ప్రైమ్ వీడియో ఇండియా ఒరిజినల్స్ సౌత్ హెడ్ పద్మా కస్తూరిరంగన్ ఇంకా మాట్లాడుతూ.. “గొప్ప కథలు ఎక్కడి నుండైనా వచ్చి ప్రతిచోటా ప్రతిధ్వనిస్తాయని మేము ఎల్లప్పుడూ నమ్ముతున్నాము. దక్షిణ భారత శైలిలో కథలు చెబుతుండటంలోని అసాధారణ పెరుగుదల ఈ నమ్మకాన్ని పునరుద్ఘాటించింది” అని అన్నారు.
భవిష్యత్తు వైవిధ్యమైనది: సరిహద్దులు లేని వినోదం
“ఇది ప్రాంతీయ కథనాన్ని ఉన్నతీకరించడమే కాకుండా భారతదేశంలో ‘మెయిన్ స్ట్రీమ్’ అంటే ఏమిటో పునర్నిర్వచించింది. ప్రైమ్ వీడియోలో ఈ కథల్ని శక్తివంతం చేయడం, తాజా ప్రతిభను పెంపొందించడం, గొప్ప, అద్భుతమైన కథలను నిర్మించడంపై మా దృష్టి ఉంది. ఎందుకంటే వినోద పరిశ్రమ భవిష్యత్తు అంతర్గతంగా వైవిధ్యమైనది, సరిహద్దులు లేనిది” అని పద్మ కస్తూరి రంగన్ చెప్పుకొచ్చారు.
ఓటీటీ ప్రతినిధులు, చిత్రనిర్మాతలు, రచయితలు, విద్యార్థులు, మీడియా నిపుణులను ఒకచోట చేర్చి, ఆలోచనలు, సహకారం, ప్రేరణతో నిండిన ఉత్సాహభరితమైన కేంద్రంగా ‘ఓటీటీ పల్స్ 2025’ ఎడిషన్ నిలిచింది.
మొత్తంగా, పద్మ కస్తూరిరంగన్ వ్యాఖ్యలు ఓటీటీ రంగంలో ప్రాంతీయ కంటెంట్ ప్రాముఖ్యతను నొక్కి చెప్పాయి. భవిష్యత్తులో వైవిధ్యమైన, ఆకర్షణీయమైన కథలతో ప్రేక్షకులను అలరించడానికి ప్రైమ్ వీడియో కట్టుబడి ఉందని స్పష్టమైంది.


