
📌 Key Points
- ఏపీ ఇంటర్ ఫలితాలు ఏప్రిల్ 15న ఉదయం 10.31 గంటలకు విడుదల కానున్నాయి.
- ఫలితాలను విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ అధికారికంగా ప్రకటిస్తారు.
- ఈ ఏడాది దాదాపు 10 లక్షల మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలకు హాజరయ్యారు.
- ఫలితాలను https://resultsbie.ap.gov.in వెబ్సైట్లో మరియు మనమిత్ర వాట్సాప్ ద్వారా తెలుసుకోవచ్చు.
ఏపీ ఇంటర్మీడియట్ ఫలితాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు శుభవార్త. ఏప్రిల్ 15న ఉదయం 10.31 గంటలకు ఫలితాలను విడుదల చేయనున్నట్లు విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ తెలిపారు. ఫలితాలను ఆన్లైన్లో చెక్ చేసుకోవచ్చు.
ఫలితాల విడుదల తేదీ, సమయం
AP Inter Results 2026 :ఏపీ ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు రాసిన లక్షలాది మంది విద్యార్థుల నిరీక్షణకు తెరపడనుంది. ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలను ఏప్రిల్ 15వ తేదీన ఉదయం 10.31 నిమిషాలకు విడుదల చేయనున్నారు. ఈ మేరకు ఇంటర్ బోర్డు ఏర్పాట్లు సిద్ధం చేసింది.
ఏపీ ఇంటర్ ఫలితాల విడుదలపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ అధికారికంగా ప్రకటన విడుదల చేశారు. బుధవారం(ఏప్రిల్ 15) ఉదయం 10.31 గంటలకు మంత్రి నారా లోకేశ్ ఫలితాలను వెల్లడిస్తారు.
ఫలితాలు ఎలా చెక్ చేసుకోవాలి?
ఈ ఏడాది ఫిబ్రవరి 23 నుంచి ప్రారంభమైన ఇంటర్ పరీక్షలు మార్చి 23 వరకు కొనసాగాయి. ఫస్ట్ ఇయర్ లో కొత్తగా అమల్లోకి తెచ్చిన కొన్ని విధానాల వల్ల పరీక్షల నిర్వహణకు దాదాపు నెల రోజుల సమయం పట్టినప్పటికీ…. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని మే నెలకు ముందే ఫలితాలను ప్రకటించేందుకు ఇంటర్ బోర్డు సిద్ధమైంది. నిర్దేశించుకున్న సమయంలోపే స్పాట్ వాల్యుయేషన్ పూర్తి కావటంతో… బుధవారం ఫలితాలను ప్రకటించనున్నారు.
ఈ ఏడాది ఇంటర్ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 10 లక్షల మందికి పైగా విద్యార్థులు హాజరయ్యారు. ఫలితాల వెల్లడి అనంతరం రీ-వెరిఫికేషన్, రీ-కౌంటింగ్, సప్లిమెంటరీ పరీక్షలకు సంబంధించిన వివరాలను కూడా ఇంటర్ బోర్డు ప్రకటించనుంది.
రీ-వెరిఫికేషన్, సప్లిమెంటరీ పరీక్షల వివరాలు
విద్యార్థులు తమ హాల్ టికెట్ నంబర్ సాయంతో https://resultsbie.ap.gov.in వెబ్సైట్ ద్వారా ఫలితాలను పొందవచ్చు. అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం తీసుకువచ్చిన మనమిత్ర వాట్సాప్ ద్వారా కూడా సులభంగా ఫలితాలను తెలుసుకోవచ్చు,
మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 – 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన ‘లాంగ్వేజేస్ జర్నో’ అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు. Read More
ఈ ఫలితాల వెల్లడితో విద్యార్థుల భవిష్యత్తుకు ఒక స్పష్టమైన మార్గం ఏర్పడుతుంది. రీ-వెరిఫికేషన్ మరియు సప్లిమెంటరీ పరీక్షలకు సంబంధించిన వివరాలను ఇంటర్ బోర్డు త్వరలో వెల్లడిస్తుంది.


