
📌 Key Points
- 2026-27 విద్యా సంవత్సరానికి కేజీబీవీలో 6, 11 తరగతుల్లో ప్రవేశాలకు అవకాశం.
- ఖాళీ సీట్ల భర్తీకి 7-10, 12 తరగతుల్లో కూడా అవకాశం ఉంది.
- ఆన్లైన్ దరఖాస్తులు మార్చి 12 నుండి ఏప్రిల్ 1 వరకు అందుబాటులో ఉంటాయి.
- ఎంపికైన విద్యార్థుల జాబితా ఏప్రిల్ 13న విడుదల చేస్తారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలలో 2026-27 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. 6, 11 తరగతుల్లో ప్రవేశాలతో పాటు, ఖాళీ సీట్ల భర్తీకి కూడా అవకాశం ఉంది. ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తున్నారు.
కేజీబీవీ అడ్మిషన్ల వివరాలు
KGBV Admissions 2026 : 2026-27 విద్యా సంవత్సరానికి రాష్ట్రంలోని 352 కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలలో(KGBV) 6, 11 తరగతుల ప్రవేశాలకు, అలాగే 7, 8, 9, 10, 12 తరగతులలో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి మార్చి 12 నుండి 2026 ఏప్రిల్ 1 వరకు ఆన్లైన్ దరఖాస్తులు అందుబాటులో ఉంటాయి.
అనాథలు, బడి మానేసిన పిల్లలు, డ్రాపౌట్లు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, బీపీఎల్ కుటుంబాలకు చెందిన బాలికలు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు అని సమగ్ర శిక్ష రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ బి. శ్రీనివాసరావు తెలిపారు. దరఖాస్తు ఫారాలు apkgbv.apcfss.in వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయని, ఆన్లైన్ లో పంపిన దరఖాస్తులను మాత్రమే అడ్మిషన్ల కోసం పరిగణలోకి తీసుకుంటామని స్పష్టం చేశారు. ఎంపికైన బాలికలకు ఫోన్ ద్వారా సందేశాలు అందుతాయని చెప్పారు. పేర్లు సంబంధిత పాఠశాలల నోటీసు బోర్డులలో కూడా ప్రదర్శించనున్నట్టుగా వెల్లడించారు.
ముఖ్యమైన తేదీలు
మరిన్ని వివరాలకు విద్యార్థులు, తల్లిదండ్రులు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల మధ్య 7993329115, 7075039990 ఫోన్ నంబర్లకు సంప్రదించవచ్చు.
ఈ నోటిఫికేషన్ లో భాగంగా ఆరో తరగతితో పాటు ఇంటర్ మొదటి సంవత్సరంలో అడ్మిషన్లు కల్పిస్తారు. అంతేకాకుండా 7 నుంచి పదో తరగతి వరకు ఖాళీ ఉన్న సీట్ల భర్తీకి ఏప్రిల్ 1 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. ఆరో తరగతిలో ప్రవేశం కోసం దరఖాస్తు చేసుకునే విద్యార్థి 5వ తరగతిలో తప్పనిసరిగా ఉత్తీర్ణుడై ఉండాలి. ఇక ఇంటర్ ఫస్ట్ ఇయర్ సీటు కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థి.. టెన్త్ పాసై ఉండాలి. ప్రస్తుతం టెన్త్ ఎగ్జామ్స్ రాసే వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తు ప్రక్రియ
ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తులను స్వీకరించరు. ఆన్లైన్ ద్వారా వచ్చిన దరఖాస్తులు మాత్రమే అడ్మిషన్ కొరకు పరిగణిస్తారు. https://apkgbv.apcfss.in/ వెబ్సైట్ ద్వారా అప్లికేషన్ ప్రాసెస్ను పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. కేజీబీవీల్లో సీట్ల కోసం ఎంపికైన విద్యార్థుల జాబితా ఏప్రిల్ 13వ తేదీన విడుదల చేస్తారు. ఏప్రిల్ 13 నుంచి 17వ తేదీ వరకు ఆయా విద్యాలయాల్లో విద్యార్థుల ధ్రువపత్రాలు పరిశీలిస్తారు. ఆ తర్వాత సీటును కన్ఫార్మ్ చేస్తారు.
ఈ లింక్ క్లిక్ చేసి అప్లికేషన్ చేసుకోండి.
కేజీబీవీ అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. అర్హులైన విద్యార్థులు వెంటనే దరఖాస్తు చేసుకొని, తమ భవిష్యత్తును ઉજ్వలంగా మార్చుకోవాలని కోరుతున్నాము. ఆలస్యం చేయకుండా అప్లై చేయండి.


