
📌 Key Points
- రాబోయే 24-72 గంటల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిక.
- ఉత్తర కోస్తా, యానాంలో గంటకు 40-60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి; విజయనగరం, విశాఖపట్నం జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ.
- రాయలసీమలో పిడుగుపాటు ప్రమాదం ఎక్కువగా ఉంటుందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచన.
- హైదరాబాద్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. వేడిగాలులతో పాటు అకాల వర్షాలు కురుస్తున్నాయి. రాగల మూడు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్ లో వర్ష సూచన, ఎల్లో అలర్ట్ జారీ
మార్చి నెలాఖరు సమీపిస్తున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వ్యాప్తంగా వాతావరణ పరిస్థితులు అసాధారణంగా మారాయి. తీవ్రమైన వేడితో పాటు అకాల వర్షాలు కూడా కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావం ఈ వాతావరణ మార్పునకు కారణంగా ఉంది. దీని ఫలితంగా అధిక ఉష్ణోగ్రతలు, ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులు వంటివి చోటుచేసుకున్నాయి. రాబోయే 24 నుండి 72 గంటల పాటు పరిస్థితులు ఇలాగే ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం, దక్షిణ కర్ణాటక పరిసర ప్రాంతాల్లో కేంద్రీకృతమైన ద్రోణి ప్రభావంతో వాతావరణం అకస్మాత్తుగా మారింది. రాబోయే మూడు రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ఉత్తర కోస్తా, యానాం ప్రాంతాలలో గంటకు 40 నుండి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉంది. విజయనగరం, విశాఖపట్నం, కృష్ణా, గుంటూరు, బాపట్ల జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ అయింది. ఇక్కడ ఉరుములు మెరుపులతో కూడిన మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉంది.
తెలంగాణలో తేలికపాటి వర్షాలు, ప్రజలకు హెచ్చరిక
రాయలసీమ ప్రాంతంలో ముఖ్యంగా నంద్యాల, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో మరింత తీవ్రమైన పరిస్థితులు ఏర్పడతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. పగటిపూట ఉష్ణోగ్రతలు 38 డిగ్రీల వరకు చేరుతున్నప్పటికీ.. సాయంత్రం వేళల్లో పిడుగుపాటు ప్రమాదం ఎక్కువగా ఉంటుందని అధికారులు హెచ్చరించారు. ఉరుములతో కూడిన వర్షం సమయంలో చెట్ల కింద లేదా విద్యుత్ స్తంభాల దగ్గర ఉండకూడదని వెల్లడించారు. ఆకాశం మేఘావృతమై ఉన్నప్పుడు ఎలక్ట్రానిక్ పరికరాల వాడకాన్ని పరిమితం చేసుకోవాలని విపత్తు నిర్వహణ సంస్థ అధికారులు.. సూచించారు.
పిడుగుపాటు ప్రమాదం: ప్రజలు తీసుకోవలసిన జాగ్రత్తలు
తెలంగాణ లో ఉష్ణోగ్రతలు అధికంగానే ఉన్నప్పటికీ.. అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. హైదరాబాద్ , రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్, మెదక్ వంటి జిల్లాలతో పాటు ఉత్తర తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో వానలు పడే అవకాశం ఉంది. ప్రస్తుతం హైదరాబాద్లో ఉష్ణోగ్రతలు 35 డిగ్రీల నుంచి 37 డిగ్రీల మధ్య నమోదవుతున్నాయి. సాయంత్రం పూట బలమైన గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే పగటిపూట వేడి గాలులు కొనసాగే అవకాశం ఉన్నందున ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా పిడుగుపాటు సమయంలో సురక్షితమైన ప్రదేశాల్లో ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ప్రమాదాలను నివారించవచ్చు.


