
📌 Key Points
- ఏపీలోని 11 నగరాలకు 750 ఎలక్ట్రిక్ బస్సులు మంజూరు చేసిన కేంద్ర ప్రభుత్వం.
- 12 ఆర్టీసీ డిపోలలో ఈవీ ఛార్జింగ్ పాయింట్ల ఏర్పాటుకు ఏపీఎస్ఆర్టీసీ చర్యలు చేపట్టింది.
- ఒకసారి ఛార్జ్ చేస్తే ఈ-బస్సు 180-200 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది.
- బస్సు 170 కిలోమీటర్లు ప్రయాణించాక ఛార్జింగ్ కోసం డిపోకు చేర్చాలని డ్రైవర్లకు సూచన.
పీఎం ఈ-బస్ సేవా పథకం కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 11 నగరాలకు కేంద్ర ప్రభుత్వం 750 ఎలక్ట్రిక్ బస్సులను మంజూరు చేసింది. ఈ బస్సుల నిర్వహణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తోంది.
11 నగరాలకు 750 ఈ-బస్సులు: కేంద్రం ఆమోదం
పీఎం ఈ-బస్ సేవా పథకం కింద ఏపీలోని 11 నగరాలకు కేంద్ర ప్రభుత్వం 750 ఎలక్ట్రిక్ బస్సులను మంజూరు చేసిన విషయం తెలిసిందే. వీటి నిర్వహణ కోసం ఈవీ ఛార్జింగ్ పాయింట్ల విస్తృత నెట్వర్క్ను ఏర్పాటు చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తోంది. 11 నగరాల్లో తిరగనున్న 750 ఈ-బస్సులను రీఛార్జ్ చేసేందుకు, ఏపీఎస్ఆర్టీసీ తన 12 డిపోలలో ఈవీ ఛార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేయడానికి విద్యుత్, సివిల్ పనులను చేపడుతోంది.
మూడు నెలల్లోగా ఆంధ్రప్రదేశ్లో 750 ఎలక్ట్రిక్ బస్సులన్నీ నడుస్తాయని మేం ఆశిస్తున్నామని ఏపీఎస్ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఆపరేషన్స్) ఎ. అప్పల రాజు అన్నారు.
విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, నెల్లూరు నగరాలకు 100, కాకినాడ, రాజమహేంద్రవరం, అమరావతి, కడప, తిరుపతి, కర్నూలు, అనంతపురం నగరాలకు 50 చొప్పున ఈ-బస్సులు కేటాయించారు.
12 డిపోలలో ఈవీ ఛార్జింగ్ పాయింట్లు ఏర్పాటు
సాధారణ నియమం ప్రకారం ఐదు ఈ-బస్సులను రీఛార్జ్ చేయడానికి ఒక ఈవీ ఛార్జర్ అవసరం. దీనికి అనుగుణంగా ఆర్టీసీ అధికారులు 11 నగరాల్లో, వాటి పరిసర ప్రాంతాల్లోని తమ డిపోలలో ఈవీ ఛార్జర్లను ఏర్పాటు చేస్తున్నారు.
ఒక ఈ- బస్సు ను పూర్తిగా ఛార్జ్ చేయడానికి సుమారు నాలుగు గంటల సమయం పడుతుందని అధికారులు చెబుతున్నారు. ఒకసారి ఛార్జ్ అయిన తర్వాత ఈ-బస్సు 180–200 కిలోమీటర్ల వరకు నడుస్తుందని అంచనా. ఎలక్ట్రిక్ బస్సులను నడిపే డ్రైవర్లకు ఒక స్పష్టమైన సూచన ఇస్తున్నారు. అదేమిటంటే వారి డాష్బోర్డ్లో ఛార్జ్ స్థాయి ఎంత ఉన్నప్పటికీ, బస్సు 170 కిలోమీటర్లు ప్రయాణించిన తర్వాత దానిని ఛార్జింగ్ కోసం వారి వారి డిపోలకు తప్పనిసరిగా తీసుకెళ్లాలి. ఛార్జింగ్ లేకపోవడం వల్ల ఏ ఈ-బస్సు కూడా రోడ్డుపై ఆగిపోకుండా ఉండేందుకు ఈ చర్య తీసుకుంటున్నారు.
ఈ-బస్సులను ఛార్జ్ చేయడానికి రెండు పద్ధతులు ఉన్నాయి. ఒకటి నెమ్మదైన పద్ధతి, ఇది బ్యాటరీకి ఎక్కువ మన్నికను ఇస్తుంది. మరొకటి వేగవంతమైన ఛార్జింగ్ పద్ధతి. బస్సును 45 నిమిషాలు రీఛార్జ్ చేస్తే అది 110 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదు. కానీ ఇలా చేయడం వల్ల బ్యాటరీ మన్నిక తగ్గుతుందని అధికారులు చెబుతున్నారు.
ఈ-బస్సుల నిర్వహణ, ఛార్జింగ్ విధానంపై ఆర్టీసీ మార్గదర్శకాలు
ముఖ్యంగా ఛార్జింగ్ స్టేషన్లలో సివిల్ పనులు చేపట్టడానికి కేంద్ర ప్రభుత్వం 60 శాతం ఆర్థిక సహాయం అందిస్తోంది. హెచ్టీ లైన్లు వేయడం, ఈవీ ఛార్జర్లను ఏర్పాటు చేయడం వంటి విద్యుత్ పనులకు కేంద్రం అందించే ఆర్థిక సహాయం 100 శాతంగా ఉంటుంది.
ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్ఎడిటర్గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్మెంట్లో భాగంగా ఈటీవీ భారత్కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు.
హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్స్టైల్, ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్సైట్స్ లాంచ్ టీమ్లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు. Read More
త్వరలో ఈ ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి రానుండటంతో కాలుష్యం తగ్గుతుందని, ప్రజలకు సౌకర్యవంతమైన రవాణా సేవలు అందుతాయని భావిస్తున్నారు. ఈ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.


