
తాజాగా సోషల్ మీడియాలో బాహుబలి స్టార్స్ ప్రభాస్ మరియు అనుష్క శెట్టి వైరల్ అయ్యారు. ప్రభాస్ సీఈవోగా, అనుష్క హెచ్ఆర్గా ఉన్న ఫోటో నెట్టింట తెగ వైరలైంది. ఈ ఫోటో కోల్డ్ప్లే కన్సర్ట్ను పోలి ఉండటం విశేషం.
Key Points
ప్రభాస్ సీఈవోగా, అనుష్క హెచ్ఆర్గా బాహుబలి పోస్టర్ వైరల్!
కోల్డ్ప్లే కన్సర్ట్ను పోలిన ప్రభాస్-అనుష్క ఫోటో
సోషల్ మీడియా ప్రభావం: ఉద్యోగాలు పోయే ప్రమాదం
బాహుబలి టీం సోషల్ మీడియా పోస్ట్
సోషల్ మీడియా వచ్చాక ఎప్పుడు ఎవరు ఎందుకు వైరల్ అవుతున్నారో అర్థం కావట్లేదు . కొందరు ఫేమస్ అవుతుంటే .. మరికొందరు ఊహించని విధంగా బుక్కైపోతున్నారు . తాజాగా లండన్ లో ఓ కంపెనీ సీఈవో అండ్ హెచ్ ఆర్ చీఫ్ ఓ మ్యూజిక్ కన్సర్ట్ కు హాజరయ్యారు . వీరిద్దరు అత్యంత సన్నిహితంగా ఉన్న వీడియో నెట్టింట తెగ వైరలైంది . దీంతో ఆ కంపెనీ సీఈవో ఏకంగా తన ఉద్యోగానికి రాజీనామా చేయాల్సి వచ్చింది . సోషల్ మీడియాతో ఫేమస్ అవ్వడం మాత్రమే కాదు .. ఉద్యోగం కూడా ఊడుతుందన్న సంగతి తెలిసొచ్చింది .
అయితే ఈ సీన్ తో లింక్ చేస్తూ బాహుబలి టీమ్ సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ వైరల్ గా మారింది . మాహిస్మతి రాజ్యానికి సీఈవో అండ్ హెచ్ ఆర్ అంటూ ప్రభాస్ , అనుష్క పోస్టర్ ను పోస్ట్ చేసింది . ఇందులో ప్రభాస్ – అనుష్క అచ్చం కోల్డ్ ప్లే కన్సర్ట్ లో చేసిన స్టైల్లోనే ఫోటోను షేర్ చేశారు . ఇది చూసిన అభిమానులు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు . కోల్డ్ప్లే కన్సర్ట్ వర్సెస్ భల్లాలదేవా కన్సర్ట్ అంటూ పోస్టులు పెడుతున్నారు . కెమెరామెన్ కట్టప్ప అంటూ మరో నెటిజన్ కామెంట్ చేశాడు .
ప్రభాస్ మరియు అనుష్క వైరల్ ఫోటో
అభిమానుల ప్రతిచర్యలు
ప్రభాస్ మరియు అనుష్క శెట్టి యొక్క బాహుబలి థీమ్తో కూడిన వైరల్ ఫోటో సోషల్ మీడియాలో వినోదాన్ని పంచింది. కోల్డ్ప్లే కన్సర్ట్తో పోల్చడం మరింత ఆసక్తిని కలిగించింది.


