
టాలీవుడ్ నటి ప్రగ్యా జైస్వాల్ ఇటీవల జరిగిన ఒక ఈవెంట్లో తన దుస్తుల ఎంపిక వల్ల వివాదంలో చిక్కుకుంది. ఆమె మీడియా ప్రవర్తనపై కూడా విమర్శలు చేసింది. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
Key Points
ప్రగ్యా జైస్వాల్ బికినీ, బ్లాక్ డ్రెస్లో కనిపించి వైరల్గా మారింది.
ఈవెంట్లో ప్రైవేట్ భాగాలు కనిపించేలా డ్రెస్ వేసుకున్నందుకు విమర్శలు ఎదుర్కొంటోంది.
మీడియా వ్యక్తులు ఫోటోలు, వీడియోలు తీస్తుండటంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది.
సమంత తర్వాత ప్రగ్యా జైస్వాల్ కూడా ఇలాంటి వివాదంలో చిక్కుకుంది.
ప్రగ్యా జైస్వాల్ యొక్క వైరల్ ఫోటోలు
టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్లు ఉన్న సంగతి తెలిసిందే. అందులో కొంతమంది మాత్రమే పాపులర్ అవుతూ ఉంటారు. అలాంటి హీరోయిన్లలో ప్రగ్యా జైస్వాల్ (Pragya Jaiswal). మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఈ బ్యూటీ… తెలుగుతో పాటు బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా చాలా సినిమాలు చేసింది. ఇండస్ట్రీకి వచ్చే కంటే ముందు మోడల్ గా రాణించి ఆ తర్వాత హీరోయిన్ అవతారం ఎత్తింది.
మీడియా ప్రవర్తనపై ఆమె ఆగ్రహం
ఈ నేపథ్యంలోనే 2015 సంవత్సరంలో కంచె (Kanche) సినిమాలో కనిపించి తెలుగు ప్రేక్షకులకు దగ్గర అయింది. అంతకంటే ముందు రెండు తెలుగు సినిమాలు చేసినప్పటికీ కంచె సినిమాతోనే ఆమెకు మంచి పేరు వచ్చింది. ఆ తర్వాత ఆడపాదడపా సినిమాలు చేసినప్పటికీ.. బాలయ్య ( Balayya) హీరోగా చేసిన అఖండలో ఈ బ్యూటీ.. మెరిసి మంచి సక్సెస్ అందుకుంది. అఖండ 2 సినిమాలో కూడా ప్రగ్యా జైస్వాల్ నటిస్తోంది. అయితే సినిమాలు చేస్తూనే.. ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది ఈ అందాల తార.
సోషల్ మీడియాలో విమర్శలు
ఇటీవల బికినీలో కూడా కనిపించి రచ్చ చేసింది. ఇక తాజాగా ఓ ఈవెంట్ కు బ్లాక్ డ్రెస్ లో వెళ్లి రచ్చ చేసింది ప్రగ్యా జైస్వాల్. ఈ పార్టీలో.. తన ప్రైవేట్ భాగాలు కనిపించేలా డ్రెస్ వేసుకొని మరీ… అందరినీ ఆకట్టుకుంది. అయితే ఈ సందర్భంగా కొంతమంది మీడియాకు సంబంధించిన వ్యక్తులు ఫోటోలు అలాగే వీడియోలు తీస్తుంటే… వాళ్లపై కాస్త సీరియస్ అయింది. మొన్న సమంత కూడా ఇదే తరహాలో వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ ప్రగ్యా జైస్వాల్ కూడా అలాగే వ్యవహరించింది. దీనికి సంబంధించిన ఫోటో వైరల్ గా మారింది.
ప్రగ్యా జైస్వాల్ యొక్క ఈ వివాదం సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. నటీనటుల వ్యక్తిగత జీవితం మీద మీడియా ప్రభావం గురించి మళ్ళీ చర్చ జరుగుతోంది.


