|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఓటీటీలో ఆ తెలుగు హారర్ థ్రిల్లర్ డిజిటల్ ప్రీమియర్‌కు ముందు ఈ సైకలాజికల్ థ్రిల్లర్ ట్రెండింగ్.. ఇదీ ఆ ఇద్దరి సినిమానే..

Published: 08-10-2025, 7:46 AM
ఓటీటీలో ఆ తెలుగు హారర్ థ్రిల్లర్ డిజిటల్ ప్రీమియర్‌కు ముందు ఈ సైకలాజికల్ థ్రిల్లర్ ట్రెండింగ్.. ఇదీ ఆ ఇద్దరి సినిమానే..

అనుపమ పరమేశ్వరన్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటించిన హారర్ థ్రిల్లర్ ‘కిష్కింధపురి’ జీ5 ఓటీటీలో విడుదల కానుంది. అయితే, ఈ ఇద్దరు కలిసి నటించిన సైకలాజికల్ థ్రిల్లర్ ‘రాక్షసుడు’ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది. రెండు సినిమాల విశేషాలు ఇక్కడ తెలుసుకోండి.

Key Points

1

కిష్కింధపురి మూవీ అక్టోబర్ 17న జీ5 ఓటీటీలోకి రానుంది.

2

అనుపమ, శ్రీనివాస్ నటించిన రాక్షసుడు ప్రస్తుతం MX ప్లేయర్‌లో ట్రెండింగ్‌లో ఉంది.

4

కిష్కింధపురి ప్రపంచవ్యాప్తంగా రూ.27 కోట్ల గ్రాస్ వసూలు చేసింది.

రాక్షసుడు మళ్లీ ఎందుకు ట్రెండింగ్?

అనుపమ పరమేశ్వరన్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ లీడ్ రోల్స్ లో నటించిన హారర్ థ్రిల్లర్ మూవీ కిష్కింధపురి. ఈ మూవీ అక్టోబర్ 17న జీ5 ఓటీటీలోకి అడుగుపెట్టబోతోంది. అయితే దాని కంటే ముందు ఈ ఇద్దరే కలిసి నటించిన రాక్షసుడు మూవీ ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉండటం విశేషం.

ట్రెండింగ్‌లో రాక్షసుడు మూవీ

అనుపమ పరమేశ్వరన్ , బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటించిన మూవీ రాక్షసుడు. 2019లో థియేటర్లలో రిలీజైంది. ఇదో సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ. అప్పట్లో మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంది. ‘రాక్షసుడు’ సినిమా శ్రీనివాస్ కెరీర్‌లోని మొదటి ప్రధాన హిట్‌లలో ఒకటిగా నిలిచింది. తెలుగు రాష్ట్రాల్లో అతన్ని ఇంటింటికీ తెలిసేలా చేసింది. ఈ సినిమా విజయం అనుపమ పరమేశ్వరన్‌కు కూడా తెలుగు సినిమాలో మంచి స్థానాన్ని పదిలం చేసింది.

కిష్కింధపురి ఓటీటీ విడుదల, వసూళ్లు

ఇప్పుడు ఈ సినిమా మళ్లీ వార్తల్లో ఉంది. సోషల్ మీడియాలో దీని గురించి చర్చలు జోరందుకున్నాయి. శ్రీనివాస్ హారర్ థ్రిల్లర్ చేసినప్పుడల్లా అది అతనికి అద్భుతాలు చేసిందని అభిమానులు గుర్తుచేస్తున్నారు. ‘రాక్షసుడు’ కథ ఒక రహస్య వ్యక్తి వరుసగా పిల్లలను చంపడం, అతన్ని శ్రీనివాస్ పాత్ర ఎలా ట్రాక్ చేస్తుందనే దాని చుట్టూ తిరుగుతుంది. ప్రస్తుతం ఈ సినిమా ఎంఎక్స్ ప్లేయర్ లో అందుబాటులో ఉంది. ఫ్రీగానే చూడొచ్చు.

‘కిష్కిందపురి’ బాక్సాఫీస్ కలెక్షన్లు

ఇక అనుపమ, శ్రీనివాస్ నటించిన కిష్కింధపురి సెప్టెంబర్ 5న థియేటర్లలో రిలీజై మంచి విజయం సాధించింది. ఈ సినిమా అక్టోబర్ 10న ఓటీటీలోకి వస్తుందని భావించినా.. అక్టోబర్ 17న రానుందని అంటున్నారు. అయితే దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది.

అనుపమ, శ్రీనివాస్ కెరీర్‌కు మలుపు

మరోవైపు ట్రాకింగ్ పోర్టల్ Sacnilk ప్రకారం ‘కిష్కింధపురి’ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.27 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. అదే రోజు విడుదలైన ‘మిరాయ్’ సినిమా హైప్ కారణంగా చాలా మంది ఈ సినిమాను థియేటర్లలో చూడలేకపోయారు. అందుకే దీని ఓటీటీ రిలీజ్ పై బలమైన బజ్ ఉంది.

‘పరదా’ సినిమాతో భారీ ఫ్లాప్‌ను చవిచూసిన అనుపమ పరమేశ్వరన్.. ‘కిష్కింధపురి’ తో బలంగా తిరిగి పుంజుకుంది. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో ప్రీమియర్ అయిన తర్వాత ఎలా పర్ఫామ్ చేస్తుందో చూడాలి.

‘కిష్కింధపురి’ ఓటీటీ విడుదల, ‘రాక్షసుడు’ ట్రెండింగ్‌తో అనుపమ, బెల్లంకొండలు మళ్లీ వార్తల్లో నిలిచారు. ఈ రెండు సినిమాలు వారి కెరీర్‌లో ముఖ్యమైన విజయాలుగా నిలిచాయి. ‘కిష్కింధపురి’ ఓటీటీలో ఎలాంటి ప్రదర్శన చేస్తుందో చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.