
📌 Key Points
- డీఎన్ఏ రిపోర్ట్స్లో కావ్య పాప తనదేనని తేలడంతో షాక్ అయిన కావ్య!
- రిపోర్ట్స్ మార్చిన మంత్రి ధర్మేంద్రకు రుద్రాణి కృతజ్ఞతలు తెలిపింది.
- కళావతి పాపకు గుండె సమస్య అని తెలియడంతో ఆందోళన చెందిన రాజ్, కావ్య.
- దుగ్గిరాల కుటుంబానికి తగిన శిక్ష వేస్తానని రుద్రాణి శపథం చేసింది.
బ్రహ్మముడి సీరియల్ లో సరికొత్త ట్విస్ట్ చోటుచేసుకుంది. డీఎన్ఏ రిపోర్ట్స్ లో మార్పులు జరగడంతో కథ ఊహించని మలుపు తిరిగింది. రాజ్, కావ్యల జీవితాల్లో పెనుమార్పులు రాబోతున్నాయి. ఏం జరగబోతుందో చూడాలి!
డీఎన్ఏ రిపోర్ట్స్లో షాకింగ్ నిజం!
బ్రహ్మముడి సీరియల్ జనవరి 23 ఎపిసోడ్లో డీఎన్ఏ రిపోర్ట్స్లో తను కావ్య పాపే అని వస్తుంది. దాంతో కావ్య ఒప్పుకోదు. ఇంటిల్లిపాది ఒప్పించేందుకు ప్రయత్నిస్తారు. రిపోర్ట్స్ మార్చినందుకు మంత్రికి కంగ్రాట్స్ చెబుతుంది రుద్రాణి. తర్వాత కళావతి పాపకు నురగ రావడంతో హాస్పిటల్కు తీసుకెళ్తారు కావ్య, రాజ్.
బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో ఇంట్లో డీఎన్ఏ టెస్ట్ రిపోర్ట్స్ ఇంకా రావట్లేదని మాట్లాడుకుంటారు. 24 గంటల్లో మెయిల్కు వస్తుందని రాజ్ చెబుతాడు. కావ్య మాత్రం పాపను ఆడిస్తుంటుంది. మాకు చాలా టెన్షన్గా ఉంది. నువ్వు మాత్రం చాలా కూల్గా ఉన్నావని కావ్యను అడుగుతారు.
ఈ పాప మన పాపే అని వచ్చిందమ్మా. పాప డీఎన్ఏ కళావతి డీఎన్ఏతో మ్యాచ్ అయిందని రాజ్ అంటాడు. దాంతో నో అని గట్టిగా అరుస్తుంది కావ్య. అంతా అబద్ధం అని గొడవ చేస్తుంది కావ్య. ఎవరో నా మీద కుట్ర చేస్తున్నారు. ఈ పాప నా పాప అంటే ఒప్పుకోను. టెస్ట్లతో నన్ను మోసం చేయలేరు అని రచ్చ చేస్తుంది కావ్య.
రిపోర్ట్స్ మార్చిన మంత్రికి కృతజ్ఞతలు తెలిపిన రుద్రాణి
ఇంట్లో వాళ్లు నచ్చజెప్పడానికి చూస్తారు. కానీ, కావ్య వినదు. షటప్ కళావతి. కాస్తా బుర్రపెట్టి ఆలోచించు. డాక్టర్స్ టెస్ట్ చేసి పంపిన రిపోర్ట్స్ ఇవి. పిచ్చిదానిలా అనకు. మూర్ఖత్వంతో కాదు మాతృత్వంతో ఆలోచించు అని రాజ్ అంటాడు. కాస్తా మనసు పెట్టి ఆలోచించు అని అంతా అంటారు.
మరోవైపు డీఎన్ఏ రిపోర్ట్స్ మార్చేసినందుకు మంత్రి ధర్మేంద్రకు రుద్రాణి కంగ్రాట్స్ చెబుతుంది. కానీ, చాలా ఖర్చు అయింది. కావ్య ఎక్కడికి వెళ్లిన డీఎన్ఏ రిపోర్ట్స్లో అదే వస్తుంది అని మంత్రి అంటాడు. మెల్లి మెల్లిగా ఆ పాప ఆరోగ్యం పాడవుతుంది. దాంతో దుగ్గిరాల కుటుంబం పిచ్చిది అవుతుంది. నాకు చేసిన అవమానానికి తగిన శిక్ష వేసినట్లు అవుతుందని రుద్రాణి అంటుంది.
దాంతో కాస్తా డల్ అవుతాడు మంత్రి. ఎక్కువ ఫీల్ అవ్వకండి. వాళ్ల గురించి ఇక పట్టించుకోకండి. ఏదో ఒక రోజు వచ్చి మీ సహాయం అడుగుతాను. అప్పుడు కచ్చితంగా చేయండి అని రుద్రాణి వెళ్లిపోతుంది. మంత్రిని భార్య తులసి పిలుస్తుంది. రుద్రాణి ఎవరండి. తరచూ వస్తుంది అని తులసి అడుగుతుంది. ఫ్యామిలీ ఫ్రెండ్ అనుకో. తన వల్లే మనం ఇలా సంతోషంగా ఉన్నామని ధర్మేంద్ర అంటాడు.
పాప గుండె సమస్యతో బయటపడిన రహస్యం!
నువ్వు అన్నట్లు మనకు ఎవరైనా శత్రువులు ఉంటే మన పాపను ఎత్తుకెళ్తారు కానీ ఈ పాపను తీసుకొచ్చి ఎందుకు పెడతారు. నీ ఆరోగ్యం పాడు చేసుకుంటుంటే చూడలేకపోతున్నాను. నీ బాధ ఈ కుటుంబం మోస్తుంది. ఒక్కసారి ఈ పాప మనకు పుట్టిందని ఎందుకు ఆలోచించకూడదు. దయచేసి నన్ను ఏడిపించకు అని రాజ్ అనేసి వెళ్లిపోతాడు.
కృష్ణుడి దగ్గరికి వెళ్లి పాప గురించి మొర పెట్టుకుంటుంది కావ్య. నాకు ఏంటీ కష్టాలు. ఈ బిడ్డను అంగీకరించడానికి నా మనసు ఒప్పుకోవట్లేదు. ఎందుకింత పరీక్షపెడుతున్నావని నిలదీస్తుంది కావ్య. నా బిడ్డ ఎక్కడుంతో దారి చూపించు. ఇప్పటికైనా ఈ తల్లి నమ్మకం నిజమని నిరూపించు అని కావ్య అంటుంది. ఇంతలో పాప నోటి నుంచి నురగ వస్తుంది.
బ్రహ్మముడి సీరియల్ లో రాబోయే మలుపులు చాలా ఆసక్తికరంగా ఉండబోతున్నాయి. రాజ్, కావ్యలు ఈ పరిస్థితిని ఎలా ఎదుర్కొంటారో చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.


