|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

సెన్సార్ రూల్స్‌లో సంచలన మార్పులు! ఇకపై ఆ సినిమాలకు కష్టమే!

Published: 27-02-2026, 11:35 AM
సెన్సార్ రూల్స్‌లో సంచలన మార్పులు! ఇకపై ఆ సినిమాలకు కష్టమే!
  • సెన్సార్ బోర్డు నుంచి సర్టిఫికెట్ ఉంటేనే సినిమా విడుదలవుతుంది.
  • టాట్కాల్ విధానం ద్వారా త్వరగా సెన్సార్ పూర్తి చేసే అవకాశం ఉండేది.
  • కేంద్ర ప్రభుత్వం టాట్కాల్ విధానాన్ని రద్దు చేయాలని యోచిస్తోంది.
  • కొత్త విధానం చిన్న నిర్మాతలకు మేలు చేస్తుందని భావిస్తున్నారు.

సినిమా విడుదలకి ముందు సెన్సార్ సర్టిఫికెట్ తప్పనిసరి. అయితే, కేంద్ర ప్రభుత్వం సెన్సార్ సర్టిఫికెట్ల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. టాట్కాల్ విధానాన్ని రద్దు చేయాలని భావిస్తోంది. దీనికి గల కారణాలు ఏంటో చూద్దాం.

సెన్సార్ బోర్డు కొత్త నిబంధనలు

Movies Censor: సినిమా విడుదలకు ముందు నిర్మాతలు ఎదుర్కొనే చివరి అడ్డంకి సెన్సార్ సర్టిఫికెట్. ఒకసారి Central Board of Film Certification (CBFC) నుంచి సర్టిఫికెట్ వస్తే..సినిమా థియేటర్లలో విడుదలకు అర్హత పొందుతుంది. అందుకే నిర్మాతలు సాధారణంగా సినిమా ఫైనల్ కాపీని ముందుగానే సెన్సార్ బోర్డుకు పంపిస్తారు.

కానీ కొన్ని సందర్భాల్లో షూటింగ్ ఆలస్యం కావడం, పోస్ట్ ప్రొడక్షన్ ఎక్కువ సమయం తీసుకోవడం వల్ల సినిమాలు చివరి నిమిషంలో సెన్సార్‌కు వెళ్తాయి. అలాంటి పరిస్థితుల్లో టాట్కాల్‌ లేదా ప్రాధాన్య పద్ధతి ఉపయోగపడేది. ఈ పద్ధతిలో సాధారణ ఫీజుకు మూడింతలు చెల్లిస్తే, సినిమాకు త్వరగా సెన్సార్ స్క్రీనింగ్ జరిగేది. ఈ ప్రాధాన్య విధానాన్ని 2024లో ప్రవేశపెట్టారు. విడుదల తేదీ దగ్గరగా ఉన్న సినిమాలకు ఐదు రోజుల్లో సెన్సార్ పూర్తి చేయాలనే ఉద్దేశంతో ఇది తీసుకొచ్చారు.

అయితే తాజాగా కేంద్ర ప్రభుత్వం ఈ టాట్కాల్ ప్రాధాన్య పద్ధతిని రద్దు చేయాలని ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదన అమల్లోకి వస్తే, ఇకపై చివరి నిమిషంలో సెన్సార్ చేయించుకునే అవకాశం ఉండదు. అదనపు ఫీజు చెల్లించి క్యూ దాటేసే వెసులుబాటు కూడా ఉండదు. అంటే “ముందు వచ్చిన సినిమాకే ముందు” అన్న విధానం కచ్చితంగా అమలవుతుంది.

టాట్కాల్ విధానం రద్దుకు కారణం?

ఈ నిర్ణయం పెద్ద బడ్జెట్ సినిమాలకు పెద్ద దెబ్బగా మారే అవకాశం ఉంది. ఎందుకంటే భారీ సినిమాలు ఎక్కువగా చివరి నిమిషంలోనే సెన్సార్‌కు వెళ్లి, ఈ ప్రాధాన్య పద్ధతిని వినియోగించుకుంటున్నాయి. ఇకపై అది సాధ్యం కాకపోవచ్చు.

ప్రభుత్వ వర్గాల ప్రకారం, ఈ మార్పు వెనుక ప్రధాన ఉద్దేశం అందరికీ సమాన అవకాశాలు కల్పించడమే. చిన్న, స్వతంత్ర నిర్మాతలకు అన్యాయం జరగకుండా చూడాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ అంశంపై Ministry of Information and Broadcasting అన్ని వర్గాల నుంచి అభిప్రాయాలను కోరుతోంది.

ఈ ప్రతిపాదనపై అభిప్రాయాలు పంపేందుకు మార్చి 17 చివరి తేదీగా నిర్ణయించారు. అలాగే, ప్రాంతీయ అధికారి ప్రాధాన్య దరఖాస్తుల ఆధారంగా పరీక్ష క్రమాన్ని మార్చే నిబంధనను కూడా తొలగించాలని సూచించారు.

చిన్న నిర్మాతలకు మేలు జరుగుతుందా?

మొత్తం పైన..ఈ నిర్ణయం అమల్లోకి వస్తే సినిమా ఇండస్ట్రీలో సెన్సార్ ప్రక్రియ మరింత క్రమబద్ధంగా మారే అవకాశం ఉంది. నిర్మాతలు ఇకపై ముందస్తు ప్రణాళికతోనే సినిమాలను సిద్ధం చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.

కేంద్రం తీసుకునే ఈ నిర్ణయం వల్ల సినిమా పరిశ్రమలో సెన్సార్ ప్రక్రియలో సమూల మార్పులు వస్తాయి. నిర్మాతలు ముందస్తు ప్రణాళికతో సినిమాలను సిద్ధం చేసుకోవలసి ఉంటుంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.