
ఉల్లు, ఏఎల్టీటీ వంటి ఓటీటీ ప్లాట్ఫామ్లు అశ్లీల కంటెంట్ను ప్రసారం చేస్తున్నాయని పలు ఆరోపణలు వచ్చాయి. దీనిపై కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటూ 24 ఓటీటీ యాప్లను నిషేధించింది.
Key Points
ఉల్లు, ఏఎల్టీటీ వంటి 24 ఓటీటీ యాప్లపై కేంద్రం నిషేధం విధించింది.
అశ్లీల కంటెంట్ ప్రసారం చేస్తున్నందుకు ఈ యాప్లపై చర్య తీసుకోబడింది.
కేంద్ర ఐ అండ్ బి మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా ఇంటర్నెట్ సేవాదాతలకు ఆదేశాలు జారీ చేసింది.
సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు కేంద్రం ఈ చర్యలు తీసుకుంది.
24 ఓటీటీ యాప్లపై నిషేధం
ఉల్లు(ULLU), ఏఎల్టీటీ (ALTT) లాంటి ఓటీటీ సంస్థలు విచ్చలవిడిగా అశ్లీల చిత్రాలని ప్రసారం చేస్తున్నాయి. గతంలో పలుమార్లు కేంద్ర ప్రభుత్వం ఈ సంస్థల కంటెంట్ పై హెచ్చరిక జారీ చేసింది. అయినా కూడా ఈ సంస్థలు అశ్లీల దృశ్యాలని ప్రసారం చేస్తూనే ఉన్నాయి. దీనితో ఇలాంటి ఓటీటీ సంస్థల ఆట కట్టించేందుకు కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది.
ఉల్లు, ఏఎల్టీటీ సహా మొత్తం 24 అసభ్యకర కంటెంట్ ని ప్రసారం చేసే యాప్స్ పై బ్యాన్ విధించింది. ఈ మేరకు కేంద్ర ఐ అండ్ బి మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలు దేశంలోని మొత్తం ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లకు వెళ్లాయి. దీనితో ఇది ఉల్లు, ఏఎల్టీటీ లాంటి సంస్థలకు కోలుకోలేని దెబ్బ అని చెప్పొచ్చు.
అశ్లీల కంటెంట్పై కేంద్రం చర్య
కేంద్రం ఝుళిపించిన కొరడాతో మొత్తం 24 ఓటీటీ సంస్థలు బ్యాన్ కానున్నాయి. ఓటీటీ వేదికలపై అసభ్యకరమైన కంటెంట్ ఇటీవల కాలంలో ఎక్కువవుతోంది. దానిని నియంత్రించేందుకు ఈ చర్యలు తీసుకున్నట్లు ఐ అండ్ బి మంత్రిత్వ శాఖ ప్రకటనలో పేర్కొంది.
ఓటీటీ సంస్థలు తాము ప్రసారం చేసే కంటెంట్ విషయంలో బాధ్యతతో వ్యవహరించాలని కేంద్ర ప్రభుత్వం కోరింది. ఈ ఏడాది ఏప్రిల్ లో ఉల్లు, ఏఎల్టీటీ, నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ లాంటి ఓటీటీ సంస్థల్లో ప్రసారం అవుతున్న అసభ్యకర కంటెంట్ పై సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. దీనితో సుప్రీం కోర్టు చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని ఆదేశించింది.
సుప్రీం కోర్టు ఆదేశాలు
ఉల్లు, ఏఎల్టీటీ, నవరస లైట్, హాట్ ఎక్స్ వీఐపీ, దేశీ ఫ్లిక్స్, బిగ్ షాట్స్, బూమెక్స్, గులాబ్ యాప్, కంగన్ యాప్, బుల్ యాప్, జ్వాలా యాప్, వావ్ ఎంటర్టైన్మెంట్, లుక్ ఎంటర్టైన్మెంట్, హిట్ ప్రైమ్, ఫినియో, షో ఎక్స్, సోల్ టాకీస్, అడ్డా టీవీ, హల్చల్ యాప్, నియాన్ ఎక్స్ వీఐపీ, ఫ్యుగి, ట్రైఫ్లిక్స్, మోజ్ ఫ్లిక్స్ ఇలా మొత్తం 24 అసభ్యకర ఓటీటీ సంస్థల్ని కేంద్రం బ్యాన్ చేసింది.
కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఓటీటీ ప్లాట్ఫామ్లలో అశ్లీలతను అరికట్టే దిశగా ముందుకు వెళ్ళే ప్రయత్నంగా చెప్పవచ్చు. ఇది భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలను నివారించడానికి దోహదపడుతుందని ఆశిద్దాం.


