
📌 Key Points
- చిరంజీవి దావోస్ పర్యటన: సీఎం రేవంత్ రెడ్డితో ఆసక్తికర భేటీ!
- రాజకీయాలపై చిరు క్లారిటీ: పవన్ కళ్యాణ్ కే ఆ సామర్థ్యం ఉందన్న మెగాస్టార్!
- పవన్ ఫ్యాన్స్ సంబరాలు: చిరు కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్!
- సినిమా, రాజకీయాలు వేర్వేరు: రెండింటినీ బ్యాలెన్స్ చేయడం కష్టమన్న చిరంజీవి!
మెగాస్టార్ చిరంజీవి పొలిటికల్ ఎంట్రీ గురించి ఒక సంచలన ప్రకటన చేశారు. పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఈ న్యూస్ ఇప్పుడు టాలీవుడ్ లో ఒక హాట్ టాపిక్ గా మారింది. పూర్తి వివరాల్లోకి వెళ్దాం!
దావోస్ లో చిరంజీవి, రేవంత్ రెడ్డి భేటీ!
Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి ఇటీవల సంక్రాంతికి మన శంకర వరప్రసాద్ గారు సినిమాతో వచ్చి భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. గతంలో చిరంజీవి పార్టీ పెట్టి రాజకీయాల్లోకి వెళ్లి పలు కారణాలతో రాజకీయాలకు పూర్తిగా దూరమయ్యారు. కానీ అన్ని పార్టీల నేతలతో సన్నిహితంగా ఉంటారు ఇప్పటికి. ఇటీవల దావోస్ లో సీఎం రేవంత్ రెడ్డితో కూడా కలిసి కనిపించారు మెగాస్టార్.(Chiranjeevi)
తాజాగా మన శంకర వరప్రసాద్ గారు సక్సెస్ తర్వాత మీడియాలోని కొంతమంది సీనియర్ జర్నలిస్టులతో చిరంజీవి మాట్లాడారు. ఈ క్రమంలో దావోస్ పర్యటన, పాలిటిక్స్ గురించి ప్రస్తావన రాగా చిరు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
రాజకీయాలపై మెగాస్టార్ క్లారిటీ.. పవన్ గురించేమన్నారంటే?
చిరంజీవి మాట్లాడుతూ.. ఇటీవల నేను దావోస్ వెళ్లడం యాదృచ్ఛికంగా జరిగింది. నేను వెకేషన్ కి అటు వెళ్ళాను. నా మిత్రులు అంతా అక్కడ ఉండటంతో ఇండస్ట్రీ తరపున ఉండమని అడిగారు. దాంతో నేను కాదనలేక వెళ్ళాను. అంతే కానీ నాకు రాజకీయాలతో సంబంధం లేదు. నాకు అన్ని పార్టీల నేతలు మిత్రులే. సినిమా, రాజకీయం రెండు రంగాలను నెట్టుకురావడం నాకు సాధ్యం కాలేదు. పవన్ కళ్యాణ్ కు ఆ సమర్థత ఉందని అన్నారు.
వైరల్ అవుతున్న చిరు కామెంట్స్.. పవన్ ఫ్యాన్స్ రచ్చ!
దీంతో చిరు కామెంట్స్ వైరల్ గా మారగా పవన్ ఫ్యాన్స్, జనసైనికులు ఈ కామెంట్స్ ని వైరల్ చేస్తున్నారు.
చిరంజీవి చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాయి. పవన్ కళ్యాణ్ గురించి చిరు చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.


