
📌 Key Points
- హిమాచల్ ప్రదేశ్, చంబా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.
- మహీంద్రా బొలెరో లోయలోకి దూసుకెళ్లడంతో ఏడుగురు మృతి.
- మతపరమైన వేడుక నుండి తిరిగి వస్తుండగా ఘటన.
- పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
హిమాచల్ ప్రదేశ్లోని చంబా జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం దేశవ్యాప్తంగా విషాదం నింపింది. లోయలోకి దూసుకెళ్లిన మహీంద్రా బొలెరో వాహనంలో ప్రయాణిస్తున్న ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటన మతపరమైన వేడుక నుండి తిరిగి వస్తుండగా జరిగింది.
ప్రమాద వివరాలు: ఎలా జరిగింది?
హిమాచల్ ప్రదేశ్ లోని చంబా జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఏడుగురు దుర్మరణం చెందారు. ప్రయాణికులతో వెళ్తోన్న మహీంద్రా బొలెరో వాహనం.. అదుపుతప్పి లోయలోకి దూసుకెళ్లింది. మస్రూండ్ – హమాల్ మార్గంలోని చత్రుండ్ సమీపంలోడ్రైవర్ వాహనంపై పట్టుకోల్పోవడంతో లోయలోకి పడిపోయినట్లు అధికారులు భావిస్తున్నారు. ఈ ప్రమాదంలో వాహనంలో ఉన్న డ్రైవర్ సహా ముగ్గురు మహిళలు, ముగ్గురు పురుషులు అక్కడికక్కడే మృతి చెందారు. ఒక మతపరమైన వేడుకకు హాజరై.. తిరిగి సొంతూరికి వెళ్తుండగా ఈ ఘోర ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు, జిల్లా యంత్రాంగం, అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. లోయలో నుంచి మృతదేహాలను వెలికితీశారు. ప్రమాదంలో మరణించినవారి వివరాలు ఇంకా వెల్లడించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి మృతి..
మృతుల వివరాలు, సహాయక చర్యలు
పోలీసుల దర్యాప్తు: కారణాలపై ఆరా
ఈ ఘోర ప్రమాదం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.


