|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

‘అత్తయ్య’ అంటూ చిరంజీవి ఎమోషనల్‌.. అల్లు అరవింద్‌ ఇంటికి సెలబ్రిటీలు

Published: 30-08-2025, 4:48 AM
'అత్తయ్య' అంటూ చిరంజీవి ఎమోషనల్‌.. అల్లు అరవింద్‌ ఇంటికి సెలబ్రిటీలు

ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తల్లి, అల్లు కనకరత్నమ్మ కన్నుమూశారు. ఈ విషాద వార్త తెలుసుకున్న చిరంజీవి తన అత్తయ్యను గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ పోస్ట్ చేశారు. టాలీవుడ్ సెలబ్రిటీలు అందరూ వారి కుటుంబాన్ని ఓదార్చేందుకు వచ్చారు.

Key Points

1

అల్లు అరవింద్ తల్లి అల్లు కనకరత్నమ్మ కన్నుమూశారు.

2

చిరంజీవి తన అత్తయ్యను గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ పోస్ట్ చేశారు.

4

అంత్యక్రియలు కోకాపేటలో జరిగాయి.

అల్లు కనకరత్నమ్మ కన్నుమూత

ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌ తల్లి, అల్లు రామలింగయ్య సతీమణి అల్లు కనకరత్నమ్మ (94) కన్నుమూశారు. దీంతో ఇప్పటికే వారి కుటుంబాన్ని ఓదార్చేందుకు సినిమా ఇండస్ట్రీ నుంచి చాలామంది ప్రముఖులు వారి ఇంటికి చేరుకున్నారు. ఆమె మరణ వార్త తెలుసుకున్న తర్వాత ముంబై నుంచి అల్లు అర్జున్‌, మైసూర్‌ నుంచి రామ్‌ చరణ్‌ వెంటనే హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఈ క్రమంలో చిరంజీవి తన అత్తయ్యను గుర్తు చేసుకుంటూ సోషల్‌మీడియాలో ఒక పోస్ట్‌ చేశారు. ఆమె అంత్యక్రియలు కోకాపేటలో నేడు సాయింత్రం నిర్వహించనున్నారు.

అత్తయ్య గారు అంటూ చిరంజీవి ఎమోషనల్‌ మా అత్తయ్య గారు.. దివంగత అల్లు రామలింగయ్య సతీమణి కనకరత్నమ్మ శివైక్యం చెందటం ఎంతో బాధాకరమని చిరంజీవి అన్నారు. ఇరు కుటుంబాలపై ఆమె చూపిన ప్రేమ, ధైర్యం, జీవిత విలువలు ఎప్పటికీ తమకు ఆదర్శంగా ఉంటాయని చెప్పారు. ఆమె పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడిని ప్రార్థిస్తున్నానంటూ సోషల్‌మీడియాలో చిరంజీవి పంచుకున్నారు.

చిరంజీవి ఎమోషనల్ పోస్ట్

‘ శ్రీమతి అల్లు కనకరత్నమ్మ కన్నుమూశారని తెలిసి చింతిస్తున్నాను . చెన్నైలో ఉన్నప్పటి నుంచి ఎంతో ఆప్యాయత చూపేవారు. చుట్టూ ఉన్నవారిపట్ల అమిత ప్రేమాభిమానాలు కురిపించేలా తన కుమార్తె, మా వదినమ్మ సురేఖను తీర్చిదిద్దారు. కనకరత్నమ్మ ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను. అల్లు అరవింద్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను. ‘ – పవన్‌ కల్యాణ్

సినీ ప్రముఖుల నివాళులు

అరవింద్‌ ఇంటికి టాలీవుడ్‌ ప్రముఖులు అల్లు అరవింద్‌ ఇంటి వద్దకు అందరికంటే ముందుగానే చిరంజీవి తన సతీమణి సురేఖతో చేరుకుని నివాళులు అర్పించారు. ఆపై పవన్ కల్యాణ్ ‌ సతీమణి అన్నా లెజినోవా అక్కడికి చేరుకున్నారు . ఈ క్రమంలోనే అల్లు అరవింద్ తల్లి కనకరత్నమ్మ పార్థివ దేహానికి వెంకటేష్, త్రివిక్రమ్‌, వరుణ్‌ తేజ్‌, అది శేషగిరిరావు, శ్యామల దేవి , మెహర్ రమేష్, జీవిత , నిర్మాత నాగవంశీ , నాగచైతన్య , బోయపాటి శీను , వంటి సినీ ప్రముఖులు నివాళులు అర్పించారు .

అల్లు కనకరత్నమ్మ గారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, అల్లు అరవింద్ కుటుంబానికి సానుభూతి తెలియజేస్తున్నాము. టాలీవుడ్ ప్రముఖులందరూ వారికి మద్దతుగా నిలిచారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.