
📌 Key Points
- మురళీమోహన్, రాజేంద్రప్రసాద్లకు పద్మశ్రీ అవార్డు దక్కిన సందర్భంగా అభినందనలు తెలిపిన చిరంజీవి.
- హైదరాబాద్లోని మురళీమోహన్ ఇంటికి స్వయంగా వెళ్లి శాలువాతో సత్కరించిన మెగాస్టార్ చిరంజీవి.
- గ్యాంగ్ లీడర్, హిట్లర్ వంటి సినిమాల్లో మురళీమోహన్, రాజేంద్రప్రసాద్ల నటనను కొనియాడిన చిరంజీవి.
- ఇద్దరు సహనటులకు పద్మశ్రీ దక్కడం పట్ల చిరంజీవి హర్షం వ్యక్తం చేస్తూ వారికి శుభాకాంక్షలు తెలిపారు.
మెగాస్టార్ చిరంజీవి తన సహనటుల పట్ల చూపించిన అభిమానం అందరినీ ఆశ్చర్యపరిచింది. పద్మశ్రీ పురస్కారం పొందిన మురళీమోహన్, రాజేంద్రప్రసాద్లను ఆయన స్వయంగా కలిసి అభినందించడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది.
పద్మశ్రీ పురస్కార గ్రహీతలను సత్కరించిన చిరంజీవి
సినీ నటులు మురళీమోహన్(Murali Mohan), రాజేంద్రప్రసాద్(Rajendra Pradesh)కు పద్మ శ్రీ అవార్డు దక్కిన విషయం తెలిసిందే. అయితే ఆయనను సినీ, రాజకీయ ప్రముఖులు అభినందనలు తెలిపారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) సైతం అభినందించారు. హైదరాబాద్ ఫిల్మ్ నగర్లో మురళీ మోహన్ ఇంటికి సోమవారం సాయంత్రం చిరంజీవి వెళ్లారు. పద్మశ్రీ పురస్కారానికి ఎంపికైన మురళీమోహన్కు శాలువా కప్పి చిరంజీవి అభినందించారు. అటు రాజేంద్రప్రసాద్ ను సైతం చిరంజీవి సత్కరించి అభినందించారు.
కాగా తెలుగు ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవిని నటులు మురళీమోహన్, రాజేంద్రప్రసాద్ సన్నిహిత సంబంధాలున్నాయి. చాలా సినిమాలో కలిసి నటించారు. గ్యాంగ్ లీడర్ సినిమాలో చిరంజీవికి అన్నగా మురళీమోహన్ నటించారు. అన్నదమ్ముల మధ్య ఉండే బంధాన్ని ఈ సినిమాలో హైలెట్గా నిలించింది. దీంతో ఫ్యామిలీ ఆడియెన్స్లో చిరంజీవితో పాటు మోరళీమోహన్కు మంచి గుర్తింపు లభించింది. అటు రాజేంద్రప్రసాద్ తోనూ చిరంజీవి చాలా సినిమాల్లో నటించారు. ముఖ్యంగా హిట్లర్ సినిమాలో బావమర్దిదిగా రాజేంద్ర ప్రసాద్ నటనకు చిరంజీవి అభిమానులు, ప్రేక్షకుల నుంచి ప్రశంసలు వచ్చాయి. చిరంజీవి సినీ కెరీర్లో గ్యాంగ్ లీడర్, హిట్లర్ సినిమాలు గుర్తిండిపోయేవిగా నిలిచాయి. ఇద్దరు సహనటులకు పద్మశ్రీ దక్కడంపై మెగాస్టార్ చిరంజీవి హర్షం వ్యక్తం చేశారు. ఇద్దరినీ ఇంటికెళ్లి మరీ అభినందనలు తెలిపారు.
మురళీమోహన్తో చిరంజీవి అనుబంధం
రాజేంద్రప్రసాద్తో చిరంజీవి సినీ ప్రయాణం
చిరంజీవి తన సహనటులను గౌరవించిన తీరు టాలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది. మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం చూస్తూ ఉండండి.


