
📌 Key Points
- సీఎం కోటా ఐపీఎల్ టికెట్లు ఇన్ఫ్లుయెన్సర్ కుషితకు చేరడం సంచలనం!
- ఒక్కో ఎలైట్ లాంజ్ టికెట్ విలువ రూ. 40,000!
- కుషితా కల్లాపు ఇన్స్టాగ్రామ్లో వీడియో పోస్ట్ చేయడంతో వెలుగులోకి వచ్చిన వ్యవహారం
- సీఎంవో టికెట్ల దుర్వినియోగంపై నెటిజన్ల ఆగ్రహం, విమర్శలు వెల్లువెత్తుతున్నాయి!
తెలంగాణ రాజకీయాల్లో ఐపీఎల్ టికెట్ల వివాదం హాట్ టాపిక్గా మారింది. సీఎం కోటా టికెట్లు ఓ ఇన్ఫ్లుయెన్సర్కు ఎలా వెళ్లాయో తెలుసుకుంటే మీరు షాక్ అవుతారు. అసలు ఏం జరిగిందో చూడండి!
సీఎం టికెట్లు ఇన్ఫ్లుయెన్సర్ చేతికి ఎలా?
తెలంగాణలో ఐపీఎల్ టికెట్ల పంపిణీ వ్యవహారం కొత్త వివాదానికి తెర తీసింది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోసం కేటాయించిన అత్యంత ఖరీదైన ‘ఎలైట్ లాంజ్’ టికెట్లు.. సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్, నటి కుషితా కల్లాపు చేతికి ఎలా వెళ్లాయన్న దానిపై ప్రస్తుతం నెట్టింట తీవ్ర దుమారం రేపుతోంది.
రూ. 40,000 విలువైన టికెట్ల వ్యవహారం!
ఉప్పల్ స్టేడియంలో జరుగుతున్న సన్రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్కు సంబంధించి ముఖ్యమంత్రి పేరిట ఇచ్చే ఎలైట్ లాంజ్ టికెట్లతో నటి కుషితా మ్యాచ్ వీక్షించేందుకు వెళ్లారు. అయితే, ఆ టికెట్లపై స్పష్టంగా సీఎం కోసం ఉద్దేశించినవి అని రాసి ఉన్న దృశ్యాలను ఆమె స్వయంగా తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో వీడియో రూపంలో పంచుకోవడంతో ఈ వ్యవహారం బయటపడింది. ఈ ఎలైట్ లాంజ్ టికెట్లు ఒక్కోటి సుమారు రూ. 40,000 విలువ చేసే విలువ ఉంటుందని, ఇవి ఆమెకు ఎలా దక్కాయని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
నెటిజన్ల ఆగ్రహం.. సీఎంవోపై విమర్శలు!
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంవో) నుంచి ఇన్ ఫ్లూయెన్సర్లకు టికెట్లు ఎవరు ఇస్తున్నారు, ఎందుకు ఇస్తున్నారంటూ నెటిజన్లు అధికారులను నిలదీస్తున్నారు. ఐపీఎల్ టికెట్లను సీఎంవో దుర్వినియోగం చేస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ ఎలైట్ లాంజ్ టికెట్లను అధికారులు ఇలా పంచుతున్నారా..? లేక బ్లాక్ మార్కెట్లో ఎవరికైనా అమ్ముకుంటున్నారా? అని నెటిజన్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
ఐపీఎల్ టికెట్ల వ్యవహారం రాజకీయ దుమారం రేపుతోంది. దీనిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.


