
📌 Key Points
- గ్రామాల్లో గ్యాస్ బుకింగ్ గడువు 25 రోజుల నుండి 45 రోజులకు పెంపు.
- గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్ ధర రూ.60, కమర్షియల్ సిలిండర్ ధర రూ.115 పెరిగింది.
- హైదరాబాద్లో గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్ ధర రూ.965కి చేరిక.
- ధరల పెరుగుదలకు పశ్చిమాసియా ప్రాంతంలోని యుద్ధ పరిస్థితులే కారణం.
కేంద్ర ప్రభుత్వం సామాన్యులకు మరో షాక్ ఇచ్చింది. వంటగ్యాస్ సిలిండర్ బుకింగ్ గడువును పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా, గృహ వినియోగ మరియు కమర్షియల్ సిలిండర్ల ధరలను కూడా భారీగా పెంచింది. దీని ప్రభావం ప్రజలపై ఎలా ఉండబోతుందో చూడాలి.
గ్రామాల్లో గ్యాస్ బుకింగ్ నిబంధనలు మారుతున్నాయ్!
ప్రజలకు కేంద్రం మరోసారి షాకిచ్చింది. వంటగ్యాస్ (LPG) సిలిండర్ల బుకింగ్ గడువును మరోసారి పెంచింది. ఇప్పటికే పట్టణాల్లో సిలిండర్కు, సిలిండర్కు మధ్య కనీస గడువును 21 రోజుల నుండి 25 రోజులకు పెంచగా… తాజాగా గ్రామాలల్లోనూ నిబంధనలు విధించారు. గ్రామాల్లో కూడా సిలిండర్కు, సిలిండర్కు మధ్య కనీస గడువును 25 రోజుల నుండి 45 రోజులకు పెంచారు. ఈ కొత్త నిబంధన, అక్రమ నిల్వలను (Hoarding) అరికట్టేందుకు మరియు సరఫరాను క్రమబద్ధీకరించేందుకు అమలులోకి తీసుకొస్తున్నట్లు పేర్కొన్నారు.
మరోవైపు.. దేశవ్యాప్తంగా గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్ ధర రూ.60 పెరిగింది. అలాగే హోటళ్లు, రెస్టారెంట్లు, ఇతర వ్యాపార సంస్థలు వినియోగించే కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధర రూ.115 పెరిగింది. ఈ పెంపు వెంటనే అమల్లోకి రావడంతో వినియోగదారులు అదనపు భారం భరించాల్సి వస్తోంది. హైదరాబాద్లో గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్ ధర ప్రస్తుతం రూ.965గా ఉంది. ఇతర నగరాల్లో కూడా ధరలు ఇదే విధంగా పెరిగాయి. పశ్చిమాసియా ప్రాంతంలో జరుగుతున్న యుద్ధ పరిస్థితుల వల్లే ఎల్పీజీ ధరలు పెరగడానికి ప్రధాన కారణంగా తెలుస్తోంది.
ఎల్పీజీ సిలిండర్ ధరలకు భారీగా రెక్కలు!
ధరల పెరుగుదలకు కారణం ఏమిటి?
పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితుల కారణంగా గ్యాస్ ధరలు పెరుగుతున్నాయని తెలుస్తోంది. సామాన్యులపై ఇది మరింత ఆర్థిక భారం మోపనుంది. ప్రభుత్వం దీనిపై ఎలా స్పందిస్తుందో చూడాలి.


